DGP Anjani Kumar: సైబర్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు.. దేశంలోనే తెలంగాణ ఫస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Anjani Kumar: సైబర్ నేరాల నివారణకు, సైబర్ భద్రతకు భరోసా కల్పించేందుకు తెలంగాణ పోలీసులు వినూత్నమైన పటిష్టమైన చర్యలు చేపట్టడం ద్వారా దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నారని తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ అన్నారు. గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్, డిజిటల్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ-2023 ఆన్లైన్ కాన్ఫరెన్స్లో అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సైబర్ స్పేస్ మేనేజ్మెంట్ కోసం నేషనల్ ఆర్కిటెక్చర్’ అనే అంశంపై అంజనీ కుమార్ ప్రసంగించారు. సైబర్ నేరాలను పరిశోధించడానికి, నిరోధించడానికి ప్రత్యేకమైన సైబర్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మైక్రోసాఫ్ట్తో సహా ప్రపంచంలోని దాదాపు 600 ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్లో స్థాపించబడ్డాయన్నారు. దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు, నిపుణులు ఇక్కడ పనిచేస్తున్నారని అన్నారు. సైబర్ నేరాలను అరికట్టడానికి, గుర్తించడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అయితే సైబర్ క్రైమ్ కేసులు పెరిగిపోయాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్గా మారిందని డీజీపీ సూచించారు.
Read also: TSRTC Offer: భారీగా తగ్గిన ఆర్టీసీ బస్సు చార్జీలు.. ప్రయాణికులకు పండగే
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
సైబర్ సెక్యూరిటీలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసినట్లు అంజనీకుమార్ తెలిపారు. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ బ్యూరోలో దాదాపు 500 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. సైబర్ నేరాల నియంత్రణలో ఇప్పటికే ఏర్పాటు చేసిన తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (టీ4సీ) కీలక పాత్ర పోషిస్తోందని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1930 ద్వారా ప్రజలను అప్రమత్తం చేసిన తర్వాత సైబర్ ఆధారిత ఆర్థిక నేరాల పరంగా తెలంగాణ పోలీసులు విజయవంతంగా రూ. 65 కోట్లను నిలిపివేశారు. సైబర్ నేరాలను నిరోధించడానికి, తెలంగాణ పోలీసులు అదే సమయంలో సామాన్య ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు; సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని 800 పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్లుగా పోలీసు అధికారులు శిక్షణ పొందారని డీజీపీ తెలిపారు.
Drugs Caught: కొకైన్ తరలించేందుకు కొత్త స్కెచ్.. అడ్డంగా బుక్కైన కిలాడి లేడి
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!