Success Story: పాత బట్టలతో బొమ్మల తయారీ..ఏటా రూ. 75 లక్షల సంపాదన!
- పారేసే పాత బట్టల ద్వారా ఓ జంట డబ్బు సంపాదన
- పాత బట్టలతో బొమ్మల తయారీ
- 'ది గుడ్ గిఫ్ట్' పేరుతో మార్కెటింగ్
- 200 మంది గిరిజన మహిళలకు ఉపాధి
- గతేడాది సంపాదన రూ.75 లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం పనికిరానివిగా భావించి పారేసే పాత బట్టల ద్వారా ఓ జంట డబ్బు సంపాదిస్తోంది. పాత బట్టలతో బొమ్మలు చేసి అమ్ముతుంది ఈ జంట. ఈమె పేరు సునీతా రామేగౌడ, భర్త సుహాస్ రామెగౌడ. తమ స్టార్టప్ గురించి సునీత, సుహాస్ మాట్లాడుతూ.. చిన్నతనంలో పాత బట్టలతో అమ్మమ్మ బొమ్మలు చేయడం చూశామని చెప్పారు. దీంతో ఈ స్టార్టప్ను ప్రారంభించాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు. సుహాస్ ప్రకారం.. ఈ బొమ్మ దాని బట్టలు కూడా మార్చుకునే విధంగా తయారు చేయబడింది. ఈ బొమ్మల ముఖ కవళికలను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టపడే విధంగా తీర్చిదిద్దారు.
READ MORE: Devara 2: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. దేవర 2 వచ్చేది అప్పుడే
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
- RBI Online Fraud Rule: యూపీఐ ఫ్రాడ్, బ్యాంకింగ్ స్కామ్లపై RBI బిగ్ అప్డేట్.. డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్!
- Rule Change 1st July: జూలై 1 నుంచి మీ జేబుపై ప్రభావం.. మారుతున్న 7 ముఖ్యమైన నిబంధనలు ఇవే..!
గిరిజన మహిళలకు ఉపాధి..
పాత బట్టలతో బొమ్మలు తయారు చేయడం ద్వారా చాలా వరకు బట్టలు పల్లపులోకి వెళ్లకుండా చేశారు. ల్యాండ్ఫిల్ సైట్కు వెళ్లకుండా సుమారు 8000 కిలోల గుడ్డ ఆదా చేయబడ్డాయి. దానిని తన స్టార్టప్లో ఉపయోగిస్తున్నారు. అంతే కాదు వీరి స్టార్టప్లో గిరిజన మహిళలకు ఉపాధితో పాటు వారికి సాధికారత కల్పించారు. తమిళనాడులోని నీలగిరి గిరిజన తెగలకు చెందిన 200 మందికి పైగా మహిళలు తన స్టార్టప్తో అనుబంధం కలిగి ఉన్నారు.
READ MORE:Duvvada Vani: ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నా.. ఈ పరిస్థితి ఊహించలేదు..!
15 ఏళ్ల సర్వీసు తర్వాత తీసుకున్న నిర్ణయం..
పెళ్లి తర్వాత సునీత, సుహాస్లు బెంగళూరులో స్థిరపడ్డారు. ఇక్కడ కనీసం 15 సంవత్సరాలు కార్పొరేట్ రంగంలో సుహాస్ పనిచేశారు. ఉద్యోగంలో తనకు సంతృప్తి లేదని వదిలేశారు. తనకు సంతోషాన్ని ఇచ్చే పని చేయాలనుకున్నారు. పట్టణ సందడితో విసిగిపోయానని సుహాస్ చెప్పారు. అటువంటి పరిస్థితిలో.. అతను ఒక గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 2017లో నీలగిరి పర్వతాలలో నివసించాలని నిర్ణయించుకున్నారు. తానే స్వయంగా మట్టి ఇల్లు కట్టుకున్నారు. కూరగాయల సాగు ప్రారంభించారు. పర్వత నదుల నుంచి నీటిని సేకరించి విద్యుత్ కోసం సౌరశక్తిని ఉపయోగించారు.
READ MORE:Manish Sisodia: 17 నెలల తర్వాత భార్యతో కలిసి చాయ్ తాగిన మనీష్ సిసోడియా
ఇక్కడ నివసించే గిరిజనులకు జీవనోపాధి అనేది రోజువారీ సవాలుగా ఉందని సుహాస్ తెలుసుకున్నారు. టీ హార్వెస్టింగ్ తప్ప, గ్రామీణ మహిళలకు ఇతర సాధారణ పని లేదు. రోజూ ఉదయాన్నే పిల్లలను వదిలి ఇతర గ్రామాలకు పనికి వెళ్లేవాళ్లు. అటువంటి పరిస్థితిలో, ఈ జంట 2019 సంవత్సరంలో ఇండియన్ యార్డ్స్ ఫౌండేషన్ను స్థాపించారు. ఇది క్రాఫ్ట్ తయారీకి సంబంధించిన సామాజిక సంస్థ. నీలగిరిలోని గిరిజన వర్గాల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడం దీని లక్ష్యం.
READ MORE: Health insurance companies: ఆరోగ్య బీమా కంపెనీలపై దోమల బెడద!
మొదట్లో పల్లెటూరి మహిళలకు ఎంబ్రాయిడరీ మొదలైన వాటిని నేర్పేది. కొంత కాలం ఇలాగే గడిచింది. అంతా బాగానే ఉంది. కానీ ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. ఈ అవసరం 2023 ప్రారంభంలో ‘ది గుడ్ గిఫ్ట్’ ఏర్పడటానికి దారితీసింది. ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు వెబ్సైట్ను రూపొందించారు. వెబ్సైట్లో అనేక రకాల ఉత్పత్తులను పోస్ట్ చేశారు. చివరికి ఫాబ్రిక్ బొమ్మలపై దృష్టి పెట్టారు.
READ MORE:Health insurance companies: ఆరోగ్య బీమా కంపెనీలపై దోమల బెడద!
నేడు, లక్షల రూపాయల వార్షిక టర్నోవర్..
స్టార్టప్ను ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే , ఈ జంట తమ వ్యాపారాన్ని బీ2బీకి విస్తరించింది. చెన్నై, బెంగళూరు, గోవా, ఊటీ తదితర ప్రాంతాల్లో 60 ఆఫ్లైన్ స్టోర్లలో తమ ఉనికిని నెలకొల్పారు. వారు ఇప్పుడు ప్రతి నెల 3000 గుడ్డ బొమ్మలను విక్రయిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వీరి ఆదాయం రూ.75 లక్షలు. ఈరోజు తన దగ్గర పనిచేస్తున్న గిరిజన మహిళలు నెలకు 8 నుంచి 10 వేల రూపాయలు సంపాదిస్తున్నారని సునీత చెప్పారు.
తాజావార్తలు
-
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!