New Year Celebrations: మోత మోగించిన రైల్వే అధికారులు.. రైల్వే స్టేషన్లో వెరైటీగా వేడుకలు
- సోషల్ మీడియాలో వైరల్ వీడియో..
- ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్లో
- వెరైటీగా కొత్త సంవత్సర వేడుకలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Year Celebrations: 2025 సంవత్సరంలోకి ప్రపంచ దేశాలు అడుగు పెట్టాయి. నూతన సంవత్సర వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రజలు ఆనందోత్సాహాలతో బాణాసంచా కాల్చుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రజలు కేక్ కట్ చేస్తూ ఆనందంగా గడిపారు. చాలామంది భక్తులు దేవాలయాలను సందర్శించడం ద్వారా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించారు. పుణ్యస్నానాలు చేస్తూ, గడ్డకట్టే చలిని పట్టించుకోకుండా తెల్లవారు జామునుంచే గుడుల ముందు బారులు తీరి నిలిచారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. దేశంలోని ముఖ్యమైన దేవాలయాలు కాశీ విశ్వనాథుడి ఆలయం, అయోధ్య రామమందిరం, ఉజ్జయినీ మహాకాళేశ్వరుడు, పూరీ జగన్నాథుడు, మధుర మీనాక్షి, కంచి కామాక్షి అమ్మవారి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి.
Also Read: Minister Ratnesh Sada: మార్నింగ్ వాక్కు వెళ్లిన మంత్రిని ఢీకొన్న ఆటో..
Also Read
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
Honking in the new! The tradition of all trains honking together at 12 midnight to welcome and salute the New Year at Mumbai CSMT station & rail car-sheds continues. Happy New Year 2024. Courtesy respective owner. pic.twitter.com/8hiChEOxYC
— Rajendra B. Aklekar (@rajtoday) December 31, 2024
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఉత్సాహం కనిపించింది. తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం, వేములవాడ, భద్రాచలం వంటి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ ఏడాది శుభం కలగాలంటూ భక్తులు ప్రార్థనలు చేశారు. అయితే, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్లో రైల్వే అధికారులు, సిబ్బంది, ప్రయాణికులు కలిసి ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లో ఉన్న డిజిటల్ క్లాక్ అర్ధరాత్రి 12 గంటలు చూపగానే స్టేషన్ లో ఉన్న రైళ్ల హారన్లు ఒక్కసారిగా మోగించారు. ఈ సంఘటనను ప్రయాణికులు తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
Huawei MateBook Pro S: హువావే మేట్బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్టాప్.. Kirin XE90 ప్రాసెసర్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!