CBRE: ఈ ఏడాది దేశంలో భారీగా పెరిగిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు..హైదరాబాద్ లో ఎన్ని యూనిట్లంటే..?
- రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం
- ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబాలు
- కానీ ధనవంతులపై ఎలాంటి ప్రభావం చూపని ద్రవ్యోల్బణం
- ఈ ఏడాది త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో భారీగా పెరిగిన లగ్జరీ ఇళ్ల అమ్మకాలు
- ఆరు నెలల వ్యవధిలో మొత్తం 8500 విలాసవంతమైన ఇళ్ల కొనుగోళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఓ వైపు మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు దేశంలోని ధనవంతులపై ద్రవ్యోల్బణం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ (CBRE) తాజా నివేదిక ప్రకారం.. దేశంలోని ధనవంతులు విలాసవంతమైన ఆస్తులను భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది త్రైమాసికంలో (జనవరి నుంచి జూన్) దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో వార్షిక ప్రాతిపదికన రూ.4 కోట్లు, అంతకంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ఇళ్ల విక్రయాలు 27% పెరిగాయి. ఈ నగరాల్లో కేవలం ఆరు నెలల వ్యవధిలో మొత్తం 8,500 విలాసవంతమైన ఇళ్లు అమ్ముడయ్యాయి. అమ్మకాలలో 84% దోహదపడింది.
READ MORE: IAS Transfers: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ల బదిలీలు..
Also Read
- Amrit Bharat Express: 7 కొత్త అమృత్ భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు కీలక కనెక్టివిటీ
- TV Ad Cap: 12 నిమిషాల యాడ్ రూల్కు కేంద్రం గుడ్బై.. టీవీ ఛానళ్లకు కొత్త నిబంధనలు
- BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
- RBI SGB Redemption: గ్రాము బంగారం రూ.3 వేలకు కొన్నారు.. ఇప్పుడు లక్షకు రూ.4 లక్షలు..
ఢిల్లీ-ఎన్సీఆర్లో గరిష్ట విక్రయాలు..
జనవరి-జూన్లో ఢిల్లీ-ఎన్సీఆర్లో గరిష్టంగా 3,300 లగ్జరీ ఇళ్లు విక్రయించబడ్డాయి. ఇది వార్షిక ప్రాతిపదికన 14 శాతం ఎక్కువ. ముంబైలో విక్రయాలు కూడా 14 శాతం పెరిగి 2,500 యూనిట్లకు చేరుకోగా.. హైదరాబాద్లో విక్రయాలు 44 శాతం పెరిగి 1,300 యూనిట్లకు చేరుకున్నాయి. చెన్నై మరియు కోల్కతాలో వరుసగా 100 మరియు 200 ఇళ్ళు అమ్ముడయ్యాయి. పుణెలో విక్రయాలు 450 శాతం పెరిగి 1,100 యూనిట్లకు చేరుకున్నాయి. బెంగళూరులో అమ్మకాలు జరగలేదు.
READ MORE:Puja Khedkar: ఒక్క ట్వీట్ తో ఐఏఎస్ పోస్ట్ ఊస్ట్.. ఆ ట్వీట్ చేసిన వ్యక్తి ఎవరంటే.. ?
నగరాల్లో ఇళ్ల ధరల పెరుగుదల..
ఇళ్లకు అధిక డిమాండ్ కారణంగా టాప్ 30 టైర్-2 నగరాల్లో ఇళ్ల ధరలు నాలుగేళ్లలో 94 శాతం పెరిగాయి. డేటా అనలిస్ట్ కంపెనీ ప్రాప్ ఈక్విటీ(PropEquity) ప్రకారం.. 2023-24లో ప్రాజెక్ట్ల సగటు ఆఫర్ ధర 2019-20 రేట్ల కంటే చాలా ఎక్కువ. విలాసవంతమైన ఆస్తుల విక్రయానికి సంబంధించి.. క్రెడాయ్ ఎన్ సీఆర్ (NCR) ఛైర్మన్ మనోజ్ గౌర్ మాట్లాడుతూ.. “విలాసవంతమైన ఆస్తి పట్ల పెరుగుతున్న ఆసక్తి సంపన్నమైన భారత ఆర్థిక వ్యవస్థకు సంకేతం. రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ వృద్ధి సానుకూల సంకేతం. ప్రజల వద్ద డబ్బు ఉంది. అందుకే వారు ఇప్పుడు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన జీవితం వైపు పయనిస్తున్నారు. ” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
‘అవారపన్ 2’ బాక్సాఫీస్ దుమ్మురేపింది.. తొలి రోజే ‘బత్వారా 1947’ను మూడింతలు దాటేసిన ఇమ్రాన్ హష్మీ
-
Amrit Bharat Express: 7 కొత్త అమృత్ భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు కీలక కనెక్టివిటీ
-
Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
PM Modi’s Saptdhara Vision: వికసిత్ భారత్ కోసం ‘సప్తధార’.. మోడీ చెప్పిన 7 కీలక శక్తులివే..
ట్రెండింగ్
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!