RBI: రేపటి నుంచి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం..కీలక అంశాలపై చర్చ
- రేపటి నుంచి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం
- ఆగస్టు 8 వరకు కొనసాగనున్న సమావేశం
- రుణాన్ని చౌకగా ఇవ్వడంతో పాటు పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం
- గతేడాది ఫిబ్రవరిలో రెపో రేటును 6.5 శాతానికి పెంచిన ఆర్బీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సమావేశం ఆగస్టు 8 వరకు జరగనుంది. ఈ సమావేశంలో రుణాన్ని చౌకగా ఇవ్వడంతో పాటు పలు నిర్ణయాలు తీసుకోవచ్చు. గతేడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ రెపో రేటును 6.5 శాతానికి పెంచింది. ఆ తర్వాత వరుసగా 7 ఎంపీసీ సమావేశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు ఎనిమిదో సమావేశం మంగళవారం ప్రారంభం కానుంది. రెపో రేటును మార్చవచ్చు, రుణాలు చౌకగా చేయడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గవచ్చని అంచనా.
READ MORE: US Recession : అమెరికాపై మాంద్యం నీడ.. ప్రమాదంలో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
Also Read
- Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
ఆర్థిక విషయాలపై నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సమావేశంలో రుణాలను చౌకగా చేసే నిర్ణయంపై చాలా తక్కువ ఆశ ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని దాదాపు 4 శాతానికి తగ్గించే బాధ్యతను ఆర్బీఐకి కేంద్రం అప్పగించింది. జూన్లో వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 5.08 శాతానికి చేరుకుంది. ఇది వరుసగా 57వ నెలలో లక్ష్యం 4% కంటే ఎక్కువగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం వరుసగా 8 నెలలుగా 8% కంటే ఎక్కువగా ఉంది.
READ MORE:Success Story: హోటల్లో వెయిటర్గా ప్రస్థానం..ఇప్పుడు నెలకు రూ.18 కోట్ల సంపాదన
బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. “రెండవ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4 శాతం కంటే తక్కువగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇది జరుగుతుందా అనేది రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం మోస్తరుగా కనిపించవచ్చు. అయితే ఇది ప్రధానంగా బేస్ ఎఫెక్ట్ కారణంగా ఉంటుంది. అందువల్ల రేట్ల తగ్గింపు నిర్ణయం ఇప్పట్లో తీసుకునే అవకాశం లేదు. ఇది అక్టోబర్లో పరిగణించబడుతుంది. అధిక రెపో రేటు 6.5 శాతం మధ్య కూడా జీడీపీ వృద్ధి బలంగా ఉంది . 2024 ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం వృద్ధి తర్వాత, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7 శాతం వరకు ఉండవచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. ఆర్బీఐ 7.2 శాతం వృద్ధిని అంచనా వేసింది. వృద్ధి మందగమనం కారణంగా రేట్లు తగ్గించాలనే ఒత్తిడి పెరుగుతుంది. బీఓబీ ఆర్థికవేత్త అదితి గుప్తా మాట్లాడుతూ, ‘ద్రవ్యోల్బణం ఒత్తిడి ఎక్కువ కాలం తగ్గుతుందనే విశ్వాసం వచ్చే వరకు రేట్లను ప్రస్తుత స్థాయిలో ఉంచడానికి RBIకి బలమైన వృద్ధి అవకాశం కల్పించింది.” అని అన్నారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!