Ola Bike Price Drop: శుభవార్త చెప్పిన ఓలా.. ఆ ఎలక్ట్రిక్ బైక్ ధరలు భారీగా తగ్గింపు..
- ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసే వారికి శుభవార్త..
- రోడ్స్టర్ వాహనం ధర భారీగా తగ్గించిన ఓలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ వాహనదారులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. తన ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ అయిన రోడ్స్టర్ X+ 9.1 kWh ధరను ఏకంగా రూ. 60,000 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఈ బైక్ ధర రూ. 1,89,999 ఉండగా.. ఇప్పుడు అది కేవలం రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్) కే లభించనుంది.
ధర ఇంతలా తగ్గడానికి కారణం ఏమిటి..?
సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ ఖర్చే అత్యధికంగా ఉంటుంది. ఓలా కంపెనీ తన ‘గిగా ఫ్యాక్టరీ’లో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ‘4680 భారత్ సెల్’ అనే బ్యాటరీలను తయారు చేస్తోంది. ఈ సెల్స్ ఉత్పత్తి భారీ స్థాయిలో పెరగడంతో తయారీ ఖర్చులు బాగా తగ్గాయి. సొంతంగా బ్యాటరీలు తయారు చేసుకోవడం వల్ల కలిగిన ఈ ఆర్థిక లాభాన్ని కంపెనీ నేరుగా కస్టమర్లకే బదిలీ చేయాలని నిర్ణయించుకుంది.
Also Read
- Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
- Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
ఎప్పుడు కొనుగోలు చేయవచ్చు..?
అయితే.. ఈ బైక్ను ఎప్పుడు పడితే అప్పుడు కొనే అవకాశం లేదు. దీనిని కేవలం పరిమిత సమయ విండోల్లో (Limited Purchase Windows) మాత్రమే విక్రయించాలని ఓలా నిర్ణయించింది.
మొదటి కొనుగోలు అవకాశం ఏప్రిల్ 3న (శుక్రవారం) సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి ఇలాంటి మరిన్ని సేల్ విండోలను భవిష్యత్తులో ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది.
రోడ్స్టర్ X+ ప్రత్యేకతలు..
ఈ బైక్ పనితీరు విషయానికి వస్తే, ఇది ఒక రేంజ్ కింగ్ అని చెప్పవచ్చు. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న #EndICEAge క్యాంపెయిన్ వల్ల ఈ బైక్కు డిమాండ్ 5 రెట్లు పెరిగిందని కంపెనీ చెబుతోంది.
పుంజుకున్న ఓలా అమ్మకాలు..
గత మార్చి నెలలో ఓలా ఎలక్ట్రిక్ అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో రిజిస్ట్రేషన్లు 150 శాతం పెరిగాయి. ఆ నెలలో మొత్తం 10,117 యూనిట్లు అమ్ముడయ్యాయి. మార్చి చివరి వారంలో ప్రతిరోజూ 1,000 కంటే ఎక్కువ ఆర్డర్లు రావడం గమనార్హం. కేవలం వాహనాల అమ్మకాలే కాకుండా.. సర్వీస్ సెంటర్ల మెరుగుదల, కస్టమర్ల నమ్మకాన్ని గెలవడంలో ఓలా సఫలమైందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తానికి.. పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలను సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఓలా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..