Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
- పశ్చిమాసియాలో మరోసారి యుద్ధం తీవ్రం
- అంతర్జాతీయంగా మరో సంక్షోభం తలెత్తే సూచనలు
- యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధం తీవ్రం కావడంతో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరికలు జారీ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు దేశానికి సవాళ్లుగా మారే అవకాశం ఉందని సంజయ్ మల్హోత్రా వార్నింగ్ ఇచ్చారు. గురువారం ద్రవ్యోల్బణం, రూపాయి మారకపు విలువపై స్పందించిన ఆయన.. ప్రస్తుతం ద్రవ్యోల్బణం, రూపాయి రెండూ సాపేక్షంగా అనుకూల స్థితిలోనే ఉన్నాయని తెలిపారు. అయితే పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయలేమని అన్నారు.
ద్రవ్యోల్బణంపై మాట్లాడుతూ.. సరఫరా వ్యవస్థపై ఒత్తిళ్ల కారణంగా ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మించే అవకాశం ఉందని.. అయినప్పటికీ ప్రస్తుతం ద్రవ్యోల్బణ పరిస్థితి సాపేక్షంగా మంచి స్థితిలోనే ఉందని అభిప్రాయపడ్డారు. రూపాయి మారకపు విలువపై స్పందిస్తూ.. భారత కరెన్సీ కూడా ప్రస్తుతం స్థిరమైన స్థితిలో కొనసాగుతోందని తెలిపారు. అయితే పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం, దానికి సంబంధించిన అనిశ్చితులు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముందని హెచ్చరించారు. అంతర్జాతీయ పరిణామాలను ఆర్బీఐ నిరంతరం పర్యవేక్షిస్తోందని, అవసరమైన సమయంలో తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పునాదులపై నిలిచి ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ పరిణామాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని గవర్నర్ సూచించారు.
Also Read
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. తాత్కాలిక శాంతి ఒప్పందం ముగియడంతో మళ్లీ దాడులు తీవ్రమయ్యాయి. పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా మరోసారి తీవ్ర సంక్షోభం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!