RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీ బ్యాంక్ సేవలతో మీకు ఏదైనా సమస్య ఎదురైందా? బ్యాంక్ తప్పుల వల్ల మీ డబ్బులు నిలిచిపోవడం లేదా నష్టపోవడం వంటివి జరిగాయా? అయితే, మీ సమస్యపై బ్యాంకుకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు సరైన రీతిలో స్పందించకపోతే, ఇప్పుడు మీరు నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తలుపు తట్టవచ్చు. ఆర్బీఐ ప్రవేశపెట్టిన నూతన ‘ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్’ (RBI Ombudsman Scheme) కింద కస్టమర్లకు రూ.33 లక్షల వరకు పరిహారం పొందే సువర్ణావకాశం లభిస్తోంది. బ్యాంకింగ్ సేవల్లో లోపాల వల్ల ఇబ్బంది పడే ఏ కస్టమర్ అయినా ఈ పథకం కింద ఆర్బీఐ అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేయవచ్చు.
అయితే.. ఆర్బీఐని ఆశ్రయించే ముందు, సంబంధిత బ్యాంకులో ముందుగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం తప్పనిసరి. అక్కడ ఫిర్యాదు చేసిన నెల రోజుల్లోగా ఎలాంటి పరిష్కారం లభించకపోయినా లేదా బ్యాంక్ ఇచ్చిన సమాధానం మీకు సంతృప్తికరంగా లేకపోయినా, మీరు ఆర్బీఐ అంబుడ్స్మన్ను సంప్రదించవచ్చు. దీని కోసం కస్టమర్లు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఖర్చు లేకుండా, అత్యంత వేగంగా, సులభతరంగా వివాదాలను పరిష్కరించేందుకు ఆర్బీఐ ఈ ఉచిత వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఇది బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు (NBFCs), ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ కంపెనీలు, క్రెడిట్ సమాచార సంస్థలపై వర్తిస్తుంది.
Also Read
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
- FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
- ఒకే రీఛార్జ్లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
ఈ పథకం కింద ఫిర్యాదు చేసే వివాద పరిమితిపై (డిస్ప్యూట్ అమౌంట్) ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. ఎంత పెద్ద మొత్తానికి సంబంధించిన వివాదాన్నైనా ఇక్కడ ప్రస్తావించవచ్చు. అయితే, బ్యాంక్ లోపాల వల్ల కస్టమర్లకు జరిగిన ప్రత్యక్ష ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడానికి అంబుడ్స్మన్ గరిష్టంగా రూ.30 లక్షల వరకు నష్టపరిహారం మంజూరు చేయవచ్చు. దీనితో పాటు కస్టమర్ల సమయం వృధా కావడం, మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అదనంగా మరో రూ.3 లక్షల వరకు ప్రత్యేక పరిహారాన్ని కూడా కేటాయించవచ్చు.
ఈ విధంగా బాధిత వినియోగదారుడికి మొత్తం కలిపి గరిష్టంగా రూ.33 లక్షల వరకు పరిహారం దక్కే అవకాశం ఉంది. ఈ ఆర్బీఐ అంబుడ్స్మన్కు ఫిర్యాదు సమర్పించేటప్పుడు కస్టమర్ తన పేరు, మొబైల్ నంబర్, పూర్తి చిరునామా, వివాదంలో ఉన్న బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ పేరు, బ్యాంకుకు గతంలో చేసిన ఫిర్యాదు నంబర్, ఖాతా లేదా లోన్ వివరాలు, గతంలో బ్యాంక్ నుండి అందుకున్న తిరస్కరణ లేఖల కాపీలను జతచేయాల్సి ఉంటుంది. డిజిటల్ విధానంలో కూడా సులభంగా ఆన్లైన్ ద్వారా ఆర్బీఐ అధికారిక పోర్టల్లో ఈ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!