RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీ బ్యాంక్ సేవలతో మీకు ఏదైనా సమస్య ఎదురైందా? బ్యాంక్ తప్పుల వల్ల మీ డబ్బులు నిలిచిపోవడం లేదా నష్టపోవడం వంటివి జరిగాయా? అయితే, మీ సమస్యపై బ్యాంకుకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు సరైన రీతిలో స్పందించకపోతే, ఇప్పుడు మీరు నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తలుపు తట్టవచ్చు. ఆర్బీఐ ప్రవేశపెట్టిన నూతన ‘ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్’ (RBI Ombudsman Scheme) కింద కస్టమర్లకు రూ.33 లక్షల వరకు పరిహారం పొందే సువర్ణావకాశం లభిస్తోంది. బ్యాంకింగ్ సేవల్లో లోపాల వల్ల ఇబ్బంది పడే ఏ కస్టమర్ అయినా ఈ పథకం కింద ఆర్బీఐ అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేయవచ్చు.
అయితే.. ఆర్బీఐని ఆశ్రయించే ముందు, సంబంధిత బ్యాంకులో ముందుగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం తప్పనిసరి. అక్కడ ఫిర్యాదు చేసిన నెల రోజుల్లోగా ఎలాంటి పరిష్కారం లభించకపోయినా లేదా బ్యాంక్ ఇచ్చిన సమాధానం మీకు సంతృప్తికరంగా లేకపోయినా, మీరు ఆర్బీఐ అంబుడ్స్మన్ను సంప్రదించవచ్చు. దీని కోసం కస్టమర్లు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఖర్చు లేకుండా, అత్యంత వేగంగా, సులభతరంగా వివాదాలను పరిష్కరించేందుకు ఆర్బీఐ ఈ ఉచిత వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఇది బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు (NBFCs), ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ కంపెనీలు, క్రెడిట్ సమాచార సంస్థలపై వర్తిస్తుంది.
Also Read
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
ఈ పథకం కింద ఫిర్యాదు చేసే వివాద పరిమితిపై (డిస్ప్యూట్ అమౌంట్) ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. ఎంత పెద్ద మొత్తానికి సంబంధించిన వివాదాన్నైనా ఇక్కడ ప్రస్తావించవచ్చు. అయితే, బ్యాంక్ లోపాల వల్ల కస్టమర్లకు జరిగిన ప్రత్యక్ష ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడానికి అంబుడ్స్మన్ గరిష్టంగా రూ.30 లక్షల వరకు నష్టపరిహారం మంజూరు చేయవచ్చు. దీనితో పాటు కస్టమర్ల సమయం వృధా కావడం, మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అదనంగా మరో రూ.3 లక్షల వరకు ప్రత్యేక పరిహారాన్ని కూడా కేటాయించవచ్చు.
ఈ విధంగా బాధిత వినియోగదారుడికి మొత్తం కలిపి గరిష్టంగా రూ.33 లక్షల వరకు పరిహారం దక్కే అవకాశం ఉంది. ఈ ఆర్బీఐ అంబుడ్స్మన్కు ఫిర్యాదు సమర్పించేటప్పుడు కస్టమర్ తన పేరు, మొబైల్ నంబర్, పూర్తి చిరునామా, వివాదంలో ఉన్న బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ పేరు, బ్యాంకుకు గతంలో చేసిన ఫిర్యాదు నంబర్, ఖాతా లేదా లోన్ వివరాలు, గతంలో బ్యాంక్ నుండి అందుకున్న తిరస్కరణ లేఖల కాపీలను జతచేయాల్సి ఉంటుంది. డిజిటల్ విధానంలో కూడా సులభంగా ఆన్లైన్ ద్వారా ఆర్బీఐ అధికారిక పోర్టల్లో ఈ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!