RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీ బ్యాంక్ సేవలతో మీకు ఏదైనా సమస్య ఎదురైందా? బ్యాంక్ తప్పుల వల్ల మీ డబ్బులు నిలిచిపోవడం లేదా నష్టపోవడం వంటివి జరిగాయా? అయితే, మీ సమస్యపై బ్యాంకుకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు సరైన రీతిలో స్పందించకపోతే, ఇప్పుడు మీరు నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తలుపు తట్టవచ్చు. ఆర్బీఐ ప్రవేశపెట్టిన నూతన ‘ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్’ (RBI Ombudsman Scheme) కింద కస్టమర్లకు రూ.33 లక్షల వరకు పరిహారం పొందే సువర్ణావకాశం లభిస్తోంది. బ్యాంకింగ్ సేవల్లో లోపాల వల్ల ఇబ్బంది పడే ఏ కస్టమర్ అయినా ఈ పథకం కింద ఆర్బీఐ అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేయవచ్చు.
అయితే.. ఆర్బీఐని ఆశ్రయించే ముందు, సంబంధిత బ్యాంకులో ముందుగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం తప్పనిసరి. అక్కడ ఫిర్యాదు చేసిన నెల రోజుల్లోగా ఎలాంటి పరిష్కారం లభించకపోయినా లేదా బ్యాంక్ ఇచ్చిన సమాధానం మీకు సంతృప్తికరంగా లేకపోయినా, మీరు ఆర్బీఐ అంబుడ్స్మన్ను సంప్రదించవచ్చు. దీని కోసం కస్టమర్లు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఖర్చు లేకుండా, అత్యంత వేగంగా, సులభతరంగా వివాదాలను పరిష్కరించేందుకు ఆర్బీఐ ఈ ఉచిత వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఇది బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు (NBFCs), ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ కంపెనీలు, క్రెడిట్ సమాచార సంస్థలపై వర్తిస్తుంది.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
- Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
ఈ పథకం కింద ఫిర్యాదు చేసే వివాద పరిమితిపై (డిస్ప్యూట్ అమౌంట్) ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. ఎంత పెద్ద మొత్తానికి సంబంధించిన వివాదాన్నైనా ఇక్కడ ప్రస్తావించవచ్చు. అయితే, బ్యాంక్ లోపాల వల్ల కస్టమర్లకు జరిగిన ప్రత్యక్ష ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడానికి అంబుడ్స్మన్ గరిష్టంగా రూ.30 లక్షల వరకు నష్టపరిహారం మంజూరు చేయవచ్చు. దీనితో పాటు కస్టమర్ల సమయం వృధా కావడం, మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అదనంగా మరో రూ.3 లక్షల వరకు ప్రత్యేక పరిహారాన్ని కూడా కేటాయించవచ్చు.
ఈ విధంగా బాధిత వినియోగదారుడికి మొత్తం కలిపి గరిష్టంగా రూ.33 లక్షల వరకు పరిహారం దక్కే అవకాశం ఉంది. ఈ ఆర్బీఐ అంబుడ్స్మన్కు ఫిర్యాదు సమర్పించేటప్పుడు కస్టమర్ తన పేరు, మొబైల్ నంబర్, పూర్తి చిరునామా, వివాదంలో ఉన్న బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ పేరు, బ్యాంకుకు గతంలో చేసిన ఫిర్యాదు నంబర్, ఖాతా లేదా లోన్ వివరాలు, గతంలో బ్యాంక్ నుండి అందుకున్న తిరస్కరణ లేఖల కాపీలను జతచేయాల్సి ఉంటుంది. డిజిటల్ విధానంలో కూడా సులభంగా ఆన్లైన్ ద్వారా ఆర్బీఐ అధికారిక పోర్టల్లో ఈ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
-
Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్తో అదరగొట్టనున్న వివో ఫోన్
-
Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!