RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీ బ్యాంక్ సేవలతో మీకు ఏదైనా సమస్య ఎదురైందా? బ్యాంక్ తప్పుల వల్ల మీ డబ్బులు నిలిచిపోవడం లేదా నష్టపోవడం వంటివి జరిగాయా? అయితే, మీ సమస్యపై బ్యాంకుకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు సరైన రీతిలో స్పందించకపోతే, ఇప్పుడు మీరు నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తలుపు తట్టవచ్చు. ఆర్బీఐ ప్రవేశపెట్టిన నూతన ‘ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్’ (RBI Ombudsman Scheme) కింద కస్టమర్లకు రూ.33 లక్షల వరకు పరిహారం పొందే సువర్ణావకాశం లభిస్తోంది. బ్యాంకింగ్ సేవల్లో లోపాల వల్ల ఇబ్బంది పడే ఏ కస్టమర్ అయినా ఈ పథకం కింద ఆర్బీఐ అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేయవచ్చు.
అయితే.. ఆర్బీఐని ఆశ్రయించే ముందు, సంబంధిత బ్యాంకులో ముందుగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం తప్పనిసరి. అక్కడ ఫిర్యాదు చేసిన నెల రోజుల్లోగా ఎలాంటి పరిష్కారం లభించకపోయినా లేదా బ్యాంక్ ఇచ్చిన సమాధానం మీకు సంతృప్తికరంగా లేకపోయినా, మీరు ఆర్బీఐ అంబుడ్స్మన్ను సంప్రదించవచ్చు. దీని కోసం కస్టమర్లు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఖర్చు లేకుండా, అత్యంత వేగంగా, సులభతరంగా వివాదాలను పరిష్కరించేందుకు ఆర్బీఐ ఈ ఉచిత వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఇది బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు (NBFCs), ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ కంపెనీలు, క్రెడిట్ సమాచార సంస్థలపై వర్తిస్తుంది.
Also Read
- UPI MDR Charges: యూపీఐ పేమెంట్లపై ఇక ఛార్జీలు?.. కేంద్రం పరిశీలిస్తున్న కొత్త ప్రతిపాదన పూర్తి వివరాలు..!
- Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
- IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
ఈ పథకం కింద ఫిర్యాదు చేసే వివాద పరిమితిపై (డిస్ప్యూట్ అమౌంట్) ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. ఎంత పెద్ద మొత్తానికి సంబంధించిన వివాదాన్నైనా ఇక్కడ ప్రస్తావించవచ్చు. అయితే, బ్యాంక్ లోపాల వల్ల కస్టమర్లకు జరిగిన ప్రత్యక్ష ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడానికి అంబుడ్స్మన్ గరిష్టంగా రూ.30 లక్షల వరకు నష్టపరిహారం మంజూరు చేయవచ్చు. దీనితో పాటు కస్టమర్ల సమయం వృధా కావడం, మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అదనంగా మరో రూ.3 లక్షల వరకు ప్రత్యేక పరిహారాన్ని కూడా కేటాయించవచ్చు.
ఈ విధంగా బాధిత వినియోగదారుడికి మొత్తం కలిపి గరిష్టంగా రూ.33 లక్షల వరకు పరిహారం దక్కే అవకాశం ఉంది. ఈ ఆర్బీఐ అంబుడ్స్మన్కు ఫిర్యాదు సమర్పించేటప్పుడు కస్టమర్ తన పేరు, మొబైల్ నంబర్, పూర్తి చిరునామా, వివాదంలో ఉన్న బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ పేరు, బ్యాంకుకు గతంలో చేసిన ఫిర్యాదు నంబర్, ఖాతా లేదా లోన్ వివరాలు, గతంలో బ్యాంక్ నుండి అందుకున్న తిరస్కరణ లేఖల కాపీలను జతచేయాల్సి ఉంటుంది. డిజిటల్ విధానంలో కూడా సులభంగా ఆన్లైన్ ద్వారా ఆర్బీఐ అధికారిక పోర్టల్లో ఈ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
-
The Odyssey: రిలీజ్కు ముందే సెన్సేషన్.. హాట్కేకుల్లా అమ్ముడవుతున్న ‘ది ఒడిస్సీ’ టికెట్లు! లక్షకు పైగా..
-
Local Governance : గ్రామ పంచాయతీలకు బంపర్ పవర్.. సొంత ఆదాయంపై పూర్తి హక్కు.!
-
HYDRAA : కోర్టు ఆదేశాలే పట్టవా?.. హైడ్రాపై హైకోర్టు ఫైర్.!
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!