Infosys: ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన ఇన్ఫోసిస్.. 400 మందికిపై వేటు..
- వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న ఇన్ఫోసిస్
- 400 మంది ట్రైనీ ఉద్యోగుల తొగింపు
- రోడ్డున పడ్డ బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇన్ఫోసిస్ వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య మొత్తం ఐటీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు కంపెనీ తన ట్రైనీ ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించింది. కర్ణాటకలోని మైసూర్ క్యాంపస్ నుంచి 400 మంది ట్రైనీ ఇంజనీర్లను తొలగించింది. కంపెనీ ఈ ఆఫర్ లెటర్లను సైతం పంపింది. ఇది మాత్రమే కాదు.. కంపెనీ ఈ ఉద్యోగుల ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది అక్టోబర్లో ట్రైనీలుగా చేరిన వారిలో కూడా సగం మందిపై వేటు పడినట్లు సమాచారం.
READ MORE: Sri Murali : పాన్ ఇండియా హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా
Also Read
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
- Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
ఈ ట్రైనీ ఇంజనీర్లు వరుసగా నిర్వహించిన మూడు ఎవాల్యుయేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదని, అందుకే తొలగించినట్లు సంబంధిత వర్గాల నుంచి సమాచారం అందింది. కానీ కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. తొలగించిన వారందరినీ సిస్టమ్ ఇంజనీర్స్ (SE), డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్స్ (DSE) పోస్టులకు నియమించారు. ఈ సందర్భంగా పలువురు ట్రైనీ ఇంజనీర్లు స్పందించారు. ” ఈ పరీక్షలు చాలా కఠినమైనవి. మమ్మల్ని ఫెయిల్ చేయడానికి కావాలనే ఈ పరీక్షలను పెట్టారు. ఇప్పుడు మా భవిష్యత్తు అంధకారంగా మారింది.” అని పేర్కొన్నారు. శిక్షణ పొందినవారు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా చూసుకోవడానికి కంపెనీ బౌన్సర్లు, భద్రతా సిబ్బందిని నియమించినట్లు వార్తలు వస్తున్నాయి. తొలగించిన వాళ్లు సాయంత్రం 6 గంటలలోపు ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని కంపెనీ అల్టిమేటం జారీ చేసింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు అధికారికం ఫిర్యాదు చేస్తామని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) తెలిపింది
READ MORE: West Bengal : బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ఇద్దరు మహిళలు సహా నలుగురు సజీవ దహనం
కాగా.. 2022-23 నియామక ప్రక్రియలో భాగంగా 2000 మంది ఫ్రెషర్లను కంపెనీ తీసుకుంది. సిస్టమ్ ఇంజినీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ పోస్టులను కేటాయిస్తూ.. ఆఫర్ లెటర్లు సైతం ఇచ్చింది. వారు 2022లో ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న వాళ్లు. వీళ్లను విధుల్లోకి తీసుకోవడంతో జాప్యం చేస్తూ వచ్చిన కంపెనీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కార్మిక శాఖకు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో చేసేదేమీ లేక కంపెనీ 2024 ఏప్రిల్లో వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!