March 31st: త్వరపడండి.. మరో మూడు రోజుల్లో ముగుస్తున్న గడువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్చి 31తో దేశవ్యాప్తంగా ప్రజలు కొన్ని పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని పనులకు గడువు తేదీని పొడిగించింది. ఈ నేపథ్యంలో మళ్లీ గడువు తేదీని పొడిగించే పరిస్థితులు కనిపించడం లేదు. కావున మరో మూడురోజుల్లో గడువు ముగుస్తుంది కాబట్టి ఈ కింది పనులను పూర్తి చేయకుంటే ఇప్పుడే పూర్తి చేయండి.
★ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి మార్చి 31తో గడువు ముగుస్తోంది. ఆ తర్వాత ఐటీ రిటర్నులను సమర్పించడం వీలుకాదు. అందువల్ల ఇంకమ్ట్యాక్స్ పరిధిలోకి వచ్చేవారు మార్చి 31లోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయండి
Also Read
- JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
- Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
- RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
★ ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింకేజీని ఇంకా చాలా మంది ఉద్యోగులు పూర్తి చేయలేదు. ఆధార్తో పాన్ను అనుసంధానం చేసేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. గతంలో ఈ గడువును కేంద్ర ప్రభుత్వం మార్చి 31 వరకు పొడిగించింది. ఒకవేళ మార్చి 31లోగా మీరు ఆధార్-పాన్ లింక్ చేయకపోతే ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం కష్టతరం అవుతుంది. అందువల్ల ఇప్పుడే ఆధార్-పాన్ లింకేజీని పూర్తి చేయండి. లేకపోతే రూ.10వేలు జరిమానా కట్టాల్సి రావొచ్చు.
★ మీ బ్యాంకు ఖాతాలో కేవైసీ పూర్తి చేయండి. పాన్, ఆధార్, అడ్రస్ ఐడెంటిటీల వివరాలను మార్చి 31లోగా సమర్పించండి. బ్యాంకు ఖాతాలో కేవైసీ పూర్తి చేయకుంటే మీరు చాలా ప్రయోజనాలను పొందలేరు. అందువల్ల ఈ పనిని మీ బ్యాంక్ శాఖకు వెళ్లి పూర్తి చేయండి.
★ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకం ప్రయోజనాలను పొందాలంటే రైతులందరూ తప్పనిసరిగా మార్చి 31లోగా ఈ-కేవైసీ అప్డేట్ చేయాలి.
★ వివాద్ సే విశ్వాస్ పథకంలో భాగంగా పన్ను బాకీలను కూడా మార్చి 31లోగా చెల్లించండి. ఇలా చెల్లిస్తే వడ్డీతో పాటు అపరాధ రుసుములను రద్దు చేస్తామని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల వెల్లడించింది. కనుక ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి.
★ తెలంగాణలో వాహనాల పెండింగ్ ఛలానాలపై ప్రకటించిన డిస్కౌంట్ మార్చి 31లోగా ముగియనుంది. దీంతో వాహనాలపై ఛలానాలు ఉన్నవారు ఇప్పుడే డిస్కౌంట్ ఉపయోగించుకుని చెల్లింపులు చేయండి.
తాజావార్తలు
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!