Business Headlines: 300 బిలియన్ డాలర్లకు చేరనున్న ఇండియా బయో ఎకానమీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Business Headlines: నిఫ్టీ50 బెస్ట్ పెర్ఫార్మెన్స్
ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ నిఫ్టీ50 బెస్ట్ పెర్ఫార్మర్గా నిలవటం విశేషం. గత నెలలో ఆసియా దేశాల్లోని అన్ని స్టాక్ మార్కెట్ల కన్నా నిఫ్టీ టాప్ లెవల్కి చేరుకుంది. ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లు, రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను బాగా ఆకర్షించాయి. వివిధ రంగాలు, సంస్థలు మూడు నెలలుగా ప్రదర్శిస్తున్న పనితీరును బట్టి చూస్తే స్టాక్ మార్కెట్లలో రానున్న రోజుల్లో ట్రేడింగ్ మరింత సానుకూలంగా సాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
- SpaceX IPO: స్పేస్ఎక్స్ IPOతో ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ అవుతారా?.. ప్రపంచ దృష్టి నాస్డాక్పై
- Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
విండ్ఫాల్ ట్యాక్స్ల తగ్గింపు
అంతర్జాతీయంగా ఇంధనం ధరలు దిగొస్తుండటంతో వాటి ఎగుమతులపై విండ్ఫాల్ ట్యాక్స్లను విధించిన మూడు వారాల్లోపే కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. గ్యాసోలిసిన్ ఎక్స్పోర్ట్ల పైన లీటర్కి 6 రూపాయల చొప్పున లెవీని పూర్తిగా తొలగించింది. డీజిల్తోపాటు విమాన ఇంధనంపై లీటర్కి 2 రూపాయల చొప్పున విండ్ఫాల్ ట్యాక్స్ని తగ్గించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.
జియో, ఎయిర్టెల్కి పెరిగిన యూజర్లు
మే నెలలో రిలయెన్స్ జియోకి 31 లక్షల మంది కొత్త కస్టమర్లు పెరిగారు. ఎయిర్టెల్కి 10 లక్షల మంది యూజర్లు యాడయ్యారు. వొడాఫోన్-ఐడియాకి మాత్రం వినియోగదారులు తగ్గారు. ఈ నేపథ్యంలో టెలికం మార్కెట్లో జియో అత్యధిక వాటాను అంటే 35 పాయింట్ ఆరు తొమ్మిది శాతం షేరును సొంతం చేసుకుంది. 31 పాయింట్ ఆరు రెండు శాతం వాటాతో ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉంది. వొడాఫోన్-ఐడియా షేరు మరింత తగ్గి 22 పాయింట్ ఐదు ఆరు శాతానికి పడిపోయింది.
read more: AndhraPradesh Woman: మానవ సేవే “మాధవి” సేవ. అంతిమ ‘సంస్కారం’ చూపుతున్న ఆంధ్రప్రదేశ్ మహిళ
‘రూపాయి’తో లాభమూ నష్టం
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రూపాయి సహా మెజారిటీ కరెన్సీల కన్నా డాలర్దే పైచేయి అయింది. దీంతో నిన్న మంగళవారం రూపాయి మారకం విలువ 80 మార్కును దాటిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం మన దేశ ఎగుమతులకు కొంచెం ఊతం ఇస్తుందేమో గానీ వాణిజ్య లోటును మాత్రం మరింత పెంచనుంది. క్రూడాయిల్, బంగారం దిగుమతులను తగ్గించినప్పటికీ రూపాయి మారకం విలువ పతనంతో వాణిజ్య లోటుకు కలిగే ఉపశమనం స్వల్పమేనని అంటున్నారు.
300 బిలియన్ డాలర్లకు బయోఎకానమీ!
ఇండియా బయో ఎకానమీ 2025 నాటికి 150 బిలియన్ డాలర్లకు, 2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు చేరొచ్చంటున్నారు. తాజాగా విడుదలైన ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్ భవిష్యత్ అంచనాలను వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థలో బయోటెక్ సంస్థల వాటాల సమాచారాన్ని బట్టి ఈ నివేదికను రూపొందించారు. గతేడాది ఇండియా ఎకానమీలో బయోటెక్ కంపెనీల షేరు 80 బిలియన్ డాలర్లకు పైగా నమోదైంది. 2020తో పోల్చితే ఇది 14 పాయింట్ 1 శాతం ఎక్కువే కావటం చెప్పుకోదగ్గ విషయం.
తాజావార్తలు
-
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!