Koti Deepotsavam 2022: 9వ రోజు కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2022: అక్టోబర్ 31వ తేదీన ప్రారంభమైప భక్తి టీవీ కోటి దీపోత్సవం 9వ రోజుకి చేరింది. ఈ నెల 14వ తేదీ వరకు ఈ మహా క్రతువు సాగనుంది. మంగళవారం నాడు కోటి దీపోత్సవం కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఈరోజు తొలుత డా.శంకరమంచి రామకృష్ణశాస్త్రి స్తోత్ర పారాయణం చేశారు. అనంతరం కోటి దీపోత్సవ ప్రాంగణంలో గ్రహణమోక్ష అనంతరం నదీజలాలతో మహా సంప్రోక్షణ చేశారు. చిట్యాలకు చెందిన శ్రీ హరిహర స్మార్థ వేదపాఠశాల విద్యార్థులు వేదపఠనం చేశారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.గరికపాటి నరసింహారావు ప్రవచనామృతం చేశారు, శ్రీ పరిపూర్ణానందగరి స్వామిజీ వారు (ఏర్పేడు, వ్యాసాశ్రమం), శ్రీ అసంగానందగిరి స్వామీజీ (ఏర్పేడు, ఉత్తరాధిపతి వ్యాసాశ్రమం), శ్రీవ్రతధర రామానుజ జీయర్ స్వామీజీ (హైదరాబాద్, జగన్నాథమఠం) అనుగ్రహ భాషణం చేశారు.

Also Read
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్గా మారిన స్వీట్!
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
ఈరోజు కోటిదీపోత్సవం కార్యక్రమానికి టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ వారికి గురు వందనం, శ్రీ అసంగానందగిరి స్వామీజీ వారికి గురు వందనం, శ్రీ వ్రతధర రామానుజ జీయర్ స్వామీజీ వారికి గురు వందనం జరిగాయి. పూణే డోల్ వాయిద్యం, పంబమేళా, సాంస్కృతిక కదంబం వంటి కార్యక్రమాలు భక్తులను అలరించాయి. చంద్రగ్రహణం ముగియడంతో శ్రీకాళహస్తీశ్వరస్వామి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. తర్వాత అశ్వవాహన సేవ, సింహ వాహన సేవలను వైభవంగా నిర్వహించారు. గంగానది నుంచి తెచ్చిన దివ్యజలంతో సంప్రోక్షణ జరిగింది. ఈ సందర్భంగా ఓం నమః శివాయ నామస్మరణతో మారుమ్రోగింది. వాహన సేవల్లో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. కోటి దీపోత్సవంతో ఎన్టీఆర్ స్టేడియం అంతా దేదీప్యమానంగా వెలిగింది. ఇల కైలాసంగా విలసిల్లింది.

తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!