Venu Goapl Reddy
Author- NTV Telugu-
S Jaishankar: విదేశాంగ మంత్రి జైశంకర్కి భద్రత పెంపు.. వై నుంచి “జెడ్ కేటగిరి”గా అప్గ్రేడ్..
S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కి కేంద్రం భద్రతను పెంచింది. ఇప్పటి వరకు ఉన్న వై కేటగిరి భద్రతను పెంచుతూ ‘జెడ్ కేటగిరి’గా అప్గ్రేడ్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. -
Al-Nukhba Force: నరరూప రాక్షకులు వీళ్లు.. హమాస్ ‘అల్-నుఖ్బా’ ఫోర్స్ గురించి కీలక విషయాలు..
Al-Nukhba Force: ఇజ్రాయిల్ కలలో కూడా ఊహించని విధంగా పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ భీకరదాడికి పాల్పడింది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పైకి నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లను ప్రయోగించమే కాకుండా, ఇజ్రాయిల్ లోకి పారా గ్లైడర్ల ద్వారా ఉగ్రవాదులు ప్రవేశించి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మందిని దారుణంగా హతమార్చారు. 40 మంది చిన్నారుల తలలు నరికి హత్య చేయడాన్ని ఇజ్రాయిల్ జీర్ణించుకోలేకపోతోంది. దీనికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్ పై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. -
Palestine: స్వతంత్య్ర పాలస్తీనా ఏర్పాటుకు ఇండియా మద్దతు..
Palestine: ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదంలో హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై జరిపిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. అయితే స్వతంత్ర పాలస్తీనా దేశ ఏర్పాటుకు తాము మద్దతు ఇస్తున్నట్లు భారతదేశం ప్రకటించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. -
Putin: అంతర్జాతీయ కోర్టు అరెస్ట్ వారెంట్.. తొలిసారిగా విదేశీ పర్యటనకు రష్యా అధినేత పుతిన్..
Putin: గతేడాది ఫిబ్రవరి తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ సొంత దేశం వదిలి వేరే దేశ పర్యటనకు వెళ్లారు. యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ -
Artificial intelligence: విద్యుత్ని తింటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI).. కొన్ని దేశాల కంటే ఎక్కువ కరెంట్ వినియోగం
Artificial intelligence: ప్రపంచం మొత్తం టెక్నాలజీ వినియోగాన్ని ఎక్కువ చేసింది. చిన్న పని దగ్గర నుంచి అత్యంత సంక్లిష్ట ఆపరేషన్లను కూడా టెక్నాలజీ సులువు చేస్తుంది. ఇటీవల వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్(AI) మానవ జీవితాన్ని మరింత సులువు చేస్తోంది. చాట్ జీపీటీ వంటి ఏఐ సాంకేతికత 2022 నుంచి వేగంగా వృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో ఇప్పుడు AI వినియోగం పెరిగింది. -
live-in relationship: మరో లివ్-ఇన్ రిలేషన్ అరాచకం.. సోషల్ మీడియాలో యువతి మార్ఫింగ్ ఫోటోలు పెట్టిన లవర్..
live-in relationship: శ్రద్ధా వాకర్ దారుణ హత్య.. లివ్-ఇన్ రిలేషన్షిప్ లోని భయకర కోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధాను అతి కిరాతకంగా నరికి ఫ్రిజులో పెట్టిన సంఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. ఈ ఘటన తర్వాత లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న పలువురు యువతులు హత్యలకు గురవ్వడమో, లేకపోతే హింసించబడటమో జరిగింది. లివ్ ఇన్ లో ఉన్న యువతులు తమను పెళ్లి చేసుకోవాలని కోరడం హత్యలకు దారి తీశాయి. కొన్ని కేసుల్లో తమ మతంలోకి మారితేనే పెళ్లి… -
China: పిల్లల్ని కనడం మానేసిన చైనా ప్రజలు.. రికార్డ్ స్థాయిలో తగ్గిన జననాలు..
China: అగ్రరాజ్యం కావాలని కలలు కంటున్న చైనా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే గతంలో ఎప్పుడూ లేనంతగా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న చైనా, అమెరికాతో కయ్యం పెట్టుకుంది. ఇవిలా ఉంటే అన్నింటి కన్నా ముఖ్యంగా ఆ దేశాన్ని మరో సమస్య పట్టిపీడిస్తోంది. అక్కడి ప్రజలు పెళ్లిళ్లు చేసుకునేందుకు, పిల్లల్ని కనేందుకు ససేమిరా అంటున్నారు. సింగిల్ గా ఉండటమే బెస్ట్ అని అలాగే కంటిన్యూ అవుతున్నారు. దీంతో కమ్యూనిస్ట్ ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది. -
Joe Biden: పిల్లలపై ఇలాంటి ఘోరాలు చూస్తాననుకోలేదు.. హమాస్ దుశ్చర్యపై జో బైడెన్ ఆవేదన
Joe Biden: హమాస్ ఉగ్రవాదుల దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు అని చూడకుండా అత్యంత కిరాతకంగా హత్యలు చేశారు. ఒకే ప్రాంతంలో 40 మంది పిల్లల తలలను తెగనరికారు. ఈ క్రూరమైన దాడితో ఇజ్రాయిల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. హమాస్ని లేకుండా చేసేందుకు పావులు కదుపుతోంది. ఇదిలా ఉంటే ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. -
Israel-Hamas War: అప్పటి వరకు కుళాయి నీరు రాదు, కరెంట్ ఆన్ కాదు.. హమాస్కి ఇజ్రాయిల్ వార్నింగ్..
Israel-Hamas War: శనివారం ఇజ్రాయిల్పై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్, హమాస్ ఉగ్రవాదులపై విరుచుకుపడుతోంది. గాజాలోని బిల్డింగులతో పాటు యూనిర్సిటీలు, మసీదులు ఇలా హమాస్ ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానం ఉన్న అన్ని ప్రాంతాలపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ మరణాల సంఖ్య 3000కి చేరింది. ఇజ్రాయిల్ లో 1200 మందికి పైగా మరణించారు. అంతేస్థాయిలో గాజాలోని ప్రజలు మరణిస్తున్నారు. -
Operation Ajay: ఇజ్రాయిల్లో చిక్కుకున్న భారతీయుల కోసం “ఆపరేషన్ అజయ్” ప్రారంభం..
Operation Ajay: ఇజ్రాయిల్- పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య పూర్తిస్థాయి యుద్ధంగా మారుతున్న నేపథ్యంలో భారతదేశం, ఇజ్రాయిల్ లో చిక్కుకున్న తమ పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ‘ఆపరేషన్ అజయ్’ని ప్రారంభించింది. ఇజ్రాయిల్ లో భారతీయులు 18,000 మంది ఉన్నారు. ప్రత్యేక చార్టర్ విమానాల ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!