Odisha train accident: “నా బాధ్యత ముగియలేదు”.. ఎమోషనల్ అయిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన బాధ్యత ఇంకా ముగియలేదని ఆయన అన్నారు. బాలాసోర్ లో జరిగిన రైలు దుర్ఘటనలో 275 మంది మరణించారు. అశ్విని వైష్ణవ్ దెబ్బతిన్న ట్రాక్ మరమ్మతుల పనులు, రైళ్ల పునరుద్దరన గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. తప్పిపోయిన ప్రయాణికులను వారి కుటుంబాలతో కలపడంపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. తప్పిపోయిన వ్యక్తులను వీలైనంత త్వరగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం మా లక్ష్యం అని, మా బాధ్యత ఇంకా ముగియలేదని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత ట్రాక్ పునరుద్ధరించారు. ప్యాసింజర్ రైళ్లతో పాటు వందేభారత్ వంటి ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రమాద స్థలం నుంచి వెళ్తున్నాయి. అయితే నియంత్రిత వేగంతో వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: Russia-Ukraine War: యుద్ధంలో 500మంది పిల్లలను చంపిన రష్యా
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
శుక్రవారం సాయంత్ర 7 గంటల ప్రాంతంలో బాలాసోర్ సమీపంలోని బహనాగబజార్ రైల్వే స్టేషన్ సమీపంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్లో ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలోనే మరో ట్రాక్ పై యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రావడం, కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలు ఎగిరి వచ్చి యశ్వంత్ పూర్ రైలు వెళ్తున్న ట్రాక్ పై పడటంతో మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టిన సంఘటన జరిగింది. రైల్వే చరిత్రలో మూడు దశాబ్ధాల కాలంలో జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే. ఈ ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో లోపం కారణమై ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనలో సీబీఐ ఎంక్వైరీ చేయాలని రైల్వే బోర్డు సిఫారసు చేసింది.
#WATCH | Balasore,Odisha:…"Our goal is to make sure missing persons' family members can find them as soon as possible…our responsibility is not over yet": Union Railway Minister Ashwini Vaishnaw gets emotional as he speaks about the #OdishaTrainAccident pic.twitter.com/bKNnLmdTlC
— ANI (@ANI) June 4, 2023
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!