Odisha train accident: “నా బాధ్యత ముగియలేదు”.. ఎమోషనల్ అయిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్..
Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన బాధ్యత ఇంకా ముగియలేదని ఆయన అన్నారు. బాలాసోర్ లో జరిగిన రైలు దుర్ఘటనలో 275 మంది మరణించారు. అశ్విని వైష్ణవ్ దెబ్బతిన్న ట్రాక్ మరమ్మతుల పనులు, రైళ్ల పునరుద్దరన గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. తప్పిపోయిన ప్రయాణికులను వారి కుటుంబాలతో కలపడంపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. తప్పిపోయిన వ్యక్తులను వీలైనంత త్వరగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం మా లక్ష్యం అని, మా బాధ్యత ఇంకా ముగియలేదని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత ట్రాక్ పునరుద్ధరించారు. ప్యాసింజర్ రైళ్లతో పాటు వందేభారత్ వంటి ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రమాద స్థలం నుంచి వెళ్తున్నాయి. అయితే నియంత్రిత వేగంతో వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: Russia-Ukraine War: యుద్ధంలో 500మంది పిల్లలను చంపిన రష్యా
Also Read
శుక్రవారం సాయంత్ర 7 గంటల ప్రాంతంలో బాలాసోర్ సమీపంలోని బహనాగబజార్ రైల్వే స్టేషన్ సమీపంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్లో ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలోనే మరో ట్రాక్ పై యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రావడం, కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలు ఎగిరి వచ్చి యశ్వంత్ పూర్ రైలు వెళ్తున్న ట్రాక్ పై పడటంతో మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టిన సంఘటన జరిగింది. రైల్వే చరిత్రలో మూడు దశాబ్ధాల కాలంలో జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే. ఈ ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో లోపం కారణమై ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనలో సీబీఐ ఎంక్వైరీ చేయాలని రైల్వే బోర్డు సిఫారసు చేసింది.
#WATCH | Balasore,Odisha:…"Our goal is to make sure missing persons' family members can find them as soon as possible…our responsibility is not over yet": Union Railway Minister Ashwini Vaishnaw gets emotional as he speaks about the #OdishaTrainAccident pic.twitter.com/bKNnLmdTlC
— ANI (@ANI) June 4, 2023
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో