Rs.2000 note withdrawal: రూ. 2000 నోటు డిపాజిట్కే ప్రజల మొగ్గు.. మార్చుకోవడానికి విముఖత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs.2000 note withdrawal: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు ప్రజలు బ్యాంకుల్లో రూ.2000 నోటును మార్చుకునేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మెజారిటీ భారతీయులు మాత్రం రూ.2000 నోటును మార్చుకునే కన్నా.. బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారని ఓ నివేదిక తేల్చింది. దాదాపుగా 80 శాతం ప్రజలు నోట్లను డిపాజిట్ చేస్తున్నారు. చిన్న నోట్లుగా మార్చుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీనికి బదులుగా వారి ఖాతాల్లో రూ.2000 నోట్లను డిపాజిట్ చేస్తున్నారు.
Read Also: Google Pay: ఇకపై డెబిట్ కార్డ్ అవసరం లేదు.. ఆధార్ తో గుగూల్ పే యాక్టివేషన్..
Also Read
- CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
- Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
- NALSAR: "CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం".. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
- Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
మే నెలలో రూ.2000 నోటును ఉపసంహరించుకుంటూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకు వాటి మార్పిడికి లేదా డిపాజిట్కు అనుమతినిచ్చింది. ఒకసారి రూ. 20,000 విలువైన రూ.2000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే నోట్లను డిపాజిట్ చేయడానికి ఎలాంటి పరిమితి విధించలేదు. దీంతో ఎక్కువ మంది డిపాజిట్ చేసేందుకే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఉపసంహరణ ప్రకటించినప్పుడు ఆర్థిక వ్యవస్థలో సర్క్యూలేషన్ లో ఉన్న నోట్ల విలువ 3.6 ట్రిలియన్ రూపాయలుగా ఆర్బీఐ తెలిపింది.
అయితే ఇప్పటి వరకు అకౌంట్లలో జమ చేసిన, మార్చుకున్న మొత్తం నోట్ల విలువ అందుబాటులో లేనప్పటికీ.. ఆరు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకర్లు రాయిటర్స్ తో మాట్లాడుతూ.. తమకు వచ్చిన నోట్లలో 80 శాతం ఖాతాల్లో జమయ్యాయని చెప్పారు. మే 23 నుంచి ఉపసంహరణ ప్రారంభం అయినప్పటి నుంచి మొదటివారంలో సుమారుగా 170 బిలియన్ రూపాయలు పొందినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వెల్లడించింది. ఇందులో 140 బిలియన్లు అంటే 82 శాతం ఖాతాల్లో జమ కాగా.. మిగిలినవి మార్చుకున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు తమకు వచ్చిన నోట్లలో 80-90 శాతం నోట్లు డిపాజిట్ అయినట్లు చెప్పారు. ఇక కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఇదే విధంగా ఖాతాల్లో జమయ్యే డబ్బే ఎక్కువగా ఉన్నట్లు పేర్లు వెల్లడించని అధికారులు చెప్పారు. బ్యాంక్ డిపాజిట్ల వృద్ధి 10.9 శాతం పెరగి..కరెన్సీ ఇన్ సర్క్యూలేషన్(CIC) తగ్గవచ్చని ఆర్బీఐ డేటా చూపించింది.
తాజావార్తలు
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
-
KCC Loan: రైతులకు గుడ్న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
-
CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!