Rs.2000 note withdrawal: రూ. 2000 నోటు డిపాజిట్కే ప్రజల మొగ్గు.. మార్చుకోవడానికి విముఖత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs.2000 note withdrawal: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు ప్రజలు బ్యాంకుల్లో రూ.2000 నోటును మార్చుకునేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మెజారిటీ భారతీయులు మాత్రం రూ.2000 నోటును మార్చుకునే కన్నా.. బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారని ఓ నివేదిక తేల్చింది. దాదాపుగా 80 శాతం ప్రజలు నోట్లను డిపాజిట్ చేస్తున్నారు. చిన్న నోట్లుగా మార్చుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీనికి బదులుగా వారి ఖాతాల్లో రూ.2000 నోట్లను డిపాజిట్ చేస్తున్నారు.
Read Also: Google Pay: ఇకపై డెబిట్ కార్డ్ అవసరం లేదు.. ఆధార్ తో గుగూల్ పే యాక్టివేషన్..
Also Read
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
మే నెలలో రూ.2000 నోటును ఉపసంహరించుకుంటూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకు వాటి మార్పిడికి లేదా డిపాజిట్కు అనుమతినిచ్చింది. ఒకసారి రూ. 20,000 విలువైన రూ.2000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే నోట్లను డిపాజిట్ చేయడానికి ఎలాంటి పరిమితి విధించలేదు. దీంతో ఎక్కువ మంది డిపాజిట్ చేసేందుకే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఉపసంహరణ ప్రకటించినప్పుడు ఆర్థిక వ్యవస్థలో సర్క్యూలేషన్ లో ఉన్న నోట్ల విలువ 3.6 ట్రిలియన్ రూపాయలుగా ఆర్బీఐ తెలిపింది.
అయితే ఇప్పటి వరకు అకౌంట్లలో జమ చేసిన, మార్చుకున్న మొత్తం నోట్ల విలువ అందుబాటులో లేనప్పటికీ.. ఆరు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకర్లు రాయిటర్స్ తో మాట్లాడుతూ.. తమకు వచ్చిన నోట్లలో 80 శాతం ఖాతాల్లో జమయ్యాయని చెప్పారు. మే 23 నుంచి ఉపసంహరణ ప్రారంభం అయినప్పటి నుంచి మొదటివారంలో సుమారుగా 170 బిలియన్ రూపాయలు పొందినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వెల్లడించింది. ఇందులో 140 బిలియన్లు అంటే 82 శాతం ఖాతాల్లో జమ కాగా.. మిగిలినవి మార్చుకున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు తమకు వచ్చిన నోట్లలో 80-90 శాతం నోట్లు డిపాజిట్ అయినట్లు చెప్పారు. ఇక కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఇదే విధంగా ఖాతాల్లో జమయ్యే డబ్బే ఎక్కువగా ఉన్నట్లు పేర్లు వెల్లడించని అధికారులు చెప్పారు. బ్యాంక్ డిపాజిట్ల వృద్ధి 10.9 శాతం పెరగి..కరెన్సీ ఇన్ సర్క్యూలేషన్(CIC) తగ్గవచ్చని ఆర్బీఐ డేటా చూపించింది.
తాజావార్తలు
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!