Rs.2000 note withdrawal: రూ. 2000 నోటు డిపాజిట్కే ప్రజల మొగ్గు.. మార్చుకోవడానికి విముఖత
Rs.2000 note withdrawal: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు ప్రజలు బ్యాంకుల్లో రూ.2000 నోటును మార్చుకునేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మెజారిటీ భారతీయులు మాత్రం రూ.2000 నోటును మార్చుకునే కన్నా.. బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారని ఓ నివేదిక తేల్చింది. దాదాపుగా 80 శాతం ప్రజలు నోట్లను డిపాజిట్ చేస్తున్నారు. చిన్న నోట్లుగా మార్చుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీనికి బదులుగా వారి ఖాతాల్లో రూ.2000 నోట్లను డిపాజిట్ చేస్తున్నారు.
Read Also: Google Pay: ఇకపై డెబిట్ కార్డ్ అవసరం లేదు.. ఆధార్ తో గుగూల్ పే యాక్టివేషన్..
Also Read
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
- Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
మే నెలలో రూ.2000 నోటును ఉపసంహరించుకుంటూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకు వాటి మార్పిడికి లేదా డిపాజిట్కు అనుమతినిచ్చింది. ఒకసారి రూ. 20,000 విలువైన రూ.2000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే నోట్లను డిపాజిట్ చేయడానికి ఎలాంటి పరిమితి విధించలేదు. దీంతో ఎక్కువ మంది డిపాజిట్ చేసేందుకే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఉపసంహరణ ప్రకటించినప్పుడు ఆర్థిక వ్యవస్థలో సర్క్యూలేషన్ లో ఉన్న నోట్ల విలువ 3.6 ట్రిలియన్ రూపాయలుగా ఆర్బీఐ తెలిపింది.
అయితే ఇప్పటి వరకు అకౌంట్లలో జమ చేసిన, మార్చుకున్న మొత్తం నోట్ల విలువ అందుబాటులో లేనప్పటికీ.. ఆరు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకర్లు రాయిటర్స్ తో మాట్లాడుతూ.. తమకు వచ్చిన నోట్లలో 80 శాతం ఖాతాల్లో జమయ్యాయని చెప్పారు. మే 23 నుంచి ఉపసంహరణ ప్రారంభం అయినప్పటి నుంచి మొదటివారంలో సుమారుగా 170 బిలియన్ రూపాయలు పొందినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వెల్లడించింది. ఇందులో 140 బిలియన్లు అంటే 82 శాతం ఖాతాల్లో జమ కాగా.. మిగిలినవి మార్చుకున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు తమకు వచ్చిన నోట్లలో 80-90 శాతం నోట్లు డిపాజిట్ అయినట్లు చెప్పారు. ఇక కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఇదే విధంగా ఖాతాల్లో జమయ్యే డబ్బే ఎక్కువగా ఉన్నట్లు పేర్లు వెల్లడించని అధికారులు చెప్పారు. బ్యాంక్ డిపాజిట్ల వృద్ధి 10.9 శాతం పెరగి..కరెన్సీ ఇన్ సర్క్యూలేషన్(CIC) తగ్గవచ్చని ఆర్బీఐ డేటా చూపించింది.
తాజావార్తలు
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
-
Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
-
Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
-
Ravibabu : డబ్బు, టైం ఉంటే ఏ వెధవైనా సినిమా అద్భుతంగా చేస్తాడు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో