Arvind Kejriwal: కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కన్నీరు పెట్టుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలో కొత్త పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం, కేజ్రీవాల్ కు అత్యంత ఆప్తుడిగా పేరొందిన మనీష్ సిసోడియాను గురించి తలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. గత ఫిబ్రవరి నెల నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.
ఈ కార్యక్రమంలో సిసోడియా గురించి తీవ్ర భావోద్వేగానికి గురైన సీఎం కేజ్రీవాల్, తన కన్నీటిని తుడుచుకుంటూ.. ప్రతీ బిడ్డకు ఉత్తమమైన విద్యను అందించాలని మనీష్ సిసోడియా కలగన్నారని, అతను మంచి పాఠశాలలు నిర్మించి, పిల్లలకు సరైన విద్యకు భరోసా ఇచ్చినందకు ఆయన జైలు పాలయ్యారని అన్నారు. బీజేపీని పరోక్షంగా ఉద్దేశిస్తూ.. వారు విద్యారంగంలో ఢిల్లీ విప్లవం ముగియాలని కోరుకుంటున్నారని, దాన్ని మేం జరగనివ్వమని కేజ్రీవాల్ అన్నారు.
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
Read Also: Ganja Seller: వెలుగులోకి చీకటి వ్యాపారం.. పానీపూరి చాటున గంజాయి విక్రయం
మరోవైపు కేజ్రీవాల్ ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఢిల్లీ అధికారులు బదిలీ, నియామకం అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై.. కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీంతో మరోసారి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంక్షోభం ఏర్పడింది. ఆర్డినెన్స్ చట్టంగా మారాలంటే ఆరు నెలల్లో పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్రానికి లోక్ సభలో మెజారిటీ ఉంది. రాజ్యసభలో మెజారిటీ లేదు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఆర్డినెన్స్ చట్టంగా మారడాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాల మద్దతు కూడగడుతోంది ఆప్. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన(యూబీటీ) వర్గం నేత ఉద్దవ్ ఠాక్రేలను కలుసుకుని మద్దతు తెలపాలని కేజ్రీవాల్ కోరారు. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ను కలుసుకోనున్నారు. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కేజ్రీవాల్ కు మద్దతు తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
#WATCH | Delhi CM Arvind Kejriwal gets emotional, as he remembers former education minister Manish Sisodia and his work in the area of education, at the inauguration of an educational institution pic.twitter.com/BDGSSbmpbq
— ANI (@ANI) June 7, 2023
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!