Arvind Kejriwal: కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కన్నీరు పెట్టుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలో కొత్త పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం, కేజ్రీవాల్ కు అత్యంత ఆప్తుడిగా పేరొందిన మనీష్ సిసోడియాను గురించి తలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. గత ఫిబ్రవరి నెల నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.
ఈ కార్యక్రమంలో సిసోడియా గురించి తీవ్ర భావోద్వేగానికి గురైన సీఎం కేజ్రీవాల్, తన కన్నీటిని తుడుచుకుంటూ.. ప్రతీ బిడ్డకు ఉత్తమమైన విద్యను అందించాలని మనీష్ సిసోడియా కలగన్నారని, అతను మంచి పాఠశాలలు నిర్మించి, పిల్లలకు సరైన విద్యకు భరోసా ఇచ్చినందకు ఆయన జైలు పాలయ్యారని అన్నారు. బీజేపీని పరోక్షంగా ఉద్దేశిస్తూ.. వారు విద్యారంగంలో ఢిల్లీ విప్లవం ముగియాలని కోరుకుంటున్నారని, దాన్ని మేం జరగనివ్వమని కేజ్రీవాల్ అన్నారు.
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
Read Also: Ganja Seller: వెలుగులోకి చీకటి వ్యాపారం.. పానీపూరి చాటున గంజాయి విక్రయం
మరోవైపు కేజ్రీవాల్ ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఢిల్లీ అధికారులు బదిలీ, నియామకం అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై.. కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీంతో మరోసారి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంక్షోభం ఏర్పడింది. ఆర్డినెన్స్ చట్టంగా మారాలంటే ఆరు నెలల్లో పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్రానికి లోక్ సభలో మెజారిటీ ఉంది. రాజ్యసభలో మెజారిటీ లేదు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఆర్డినెన్స్ చట్టంగా మారడాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాల మద్దతు కూడగడుతోంది ఆప్. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన(యూబీటీ) వర్గం నేత ఉద్దవ్ ఠాక్రేలను కలుసుకుని మద్దతు తెలపాలని కేజ్రీవాల్ కోరారు. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ను కలుసుకోనున్నారు. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కేజ్రీవాల్ కు మద్దతు తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
#WATCH | Delhi CM Arvind Kejriwal gets emotional, as he remembers former education minister Manish Sisodia and his work in the area of education, at the inauguration of an educational institution pic.twitter.com/BDGSSbmpbq
— ANI (@ANI) June 7, 2023
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!