Arvind Kejriwal: కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కన్నీరు పెట్టుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలో కొత్త పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం, కేజ్రీవాల్ కు అత్యంత ఆప్తుడిగా పేరొందిన మనీష్ సిసోడియాను గురించి తలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. గత ఫిబ్రవరి నెల నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.
ఈ కార్యక్రమంలో సిసోడియా గురించి తీవ్ర భావోద్వేగానికి గురైన సీఎం కేజ్రీవాల్, తన కన్నీటిని తుడుచుకుంటూ.. ప్రతీ బిడ్డకు ఉత్తమమైన విద్యను అందించాలని మనీష్ సిసోడియా కలగన్నారని, అతను మంచి పాఠశాలలు నిర్మించి, పిల్లలకు సరైన విద్యకు భరోసా ఇచ్చినందకు ఆయన జైలు పాలయ్యారని అన్నారు. బీజేపీని పరోక్షంగా ఉద్దేశిస్తూ.. వారు విద్యారంగంలో ఢిల్లీ విప్లవం ముగియాలని కోరుకుంటున్నారని, దాన్ని మేం జరగనివ్వమని కేజ్రీవాల్ అన్నారు.
Also Read
- MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
Read Also: Ganja Seller: వెలుగులోకి చీకటి వ్యాపారం.. పానీపూరి చాటున గంజాయి విక్రయం
మరోవైపు కేజ్రీవాల్ ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఢిల్లీ అధికారులు బదిలీ, నియామకం అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై.. కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీంతో మరోసారి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంక్షోభం ఏర్పడింది. ఆర్డినెన్స్ చట్టంగా మారాలంటే ఆరు నెలల్లో పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్రానికి లోక్ సభలో మెజారిటీ ఉంది. రాజ్యసభలో మెజారిటీ లేదు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఆర్డినెన్స్ చట్టంగా మారడాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాల మద్దతు కూడగడుతోంది ఆప్. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన(యూబీటీ) వర్గం నేత ఉద్దవ్ ఠాక్రేలను కలుసుకుని మద్దతు తెలపాలని కేజ్రీవాల్ కోరారు. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ను కలుసుకోనున్నారు. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కేజ్రీవాల్ కు మద్దతు తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
#WATCH | Delhi CM Arvind Kejriwal gets emotional, as he remembers former education minister Manish Sisodia and his work in the area of education, at the inauguration of an educational institution pic.twitter.com/BDGSSbmpbq
— ANI (@ANI) June 7, 2023
తాజావార్తలు
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!