Venu Goapl Reddy
Author- NTV Telugu-
PM Modi: కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా ఉగ్రవాదం, నేరాలే..
PM Modi: రాజస్థాన్ పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించారు. భరత్ పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు విధానంతో సంఘ విద్రోహ శక్తులకు అవకాశం ఇస్తోందని మండిపడ్డారు. నేరాలు, అల్లర్లలో రాష్ట్రాన్ని టాప్ ప్లేస్లో ఉంచిందని విమర్శించారు. -
Halal: హలాల్ ఉత్పత్తులపై ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ నిషేధం..
Halal: హలాల్ ట్యాగ్ కలిగిన ఉత్పత్తులను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు నిషేధించింది. ప్రజారోగ్యం దృష్ట్యా హలాల్ సర్టిఫైడ్ వస్తువుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకాలను తక్షణమే నిషేధిస్తున్నట్లు తన యూపీ ఫుడ్ కమిషనర్ కార్యాలయం ఈ రోజు ఉత్తర్వులను జారీ చేసింది. ఆహార ఉత్పత్తుల హలాల్ ధృవీకరణ అనేది ఒక సమాంతర వ్యవస్థ, ఇది ఆహార పదార్థాల నాణ్యతకు సంబంధించిన గందరగోళాన్ని సృష్టిస్తుందని, ఇది చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఆమోదయోగ్యం కాదని ఆర్డర్ పేర్కొంది. -
Maldives: భారత్ మిలిటరీ మా దేశం నుంచి విత్డ్రా చేసుకోవాలి..
Maldives: మాల్దీవులు అన్నంత పనిచేసింది. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత.. మాల్దీవుల్లో భారత మిలిటరీ ఉనికి ఉపసంహరించుకోవాలని కోరింది. అంతకుముందు రోజు ప్రయాణ స్వీకారానికి భారత్ తరుపున మాల్దీవులు వెళ్లిన కేంద్రమంత్రి కిరెన్ రిజిజును కలిసినప్పుడు, ముయిజ్జూ అధికారికంగా ఈ అభ్యర్థన చేసినట్లు తెలిసింది. -
Asaduddin Owaisi: “రాహుల్ గాంధీ అద్దంలో చూసుకో”.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..
Asaduddin Owaisi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై మరోసారి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. ఇతరులపై వేళ్లు చూపించే ముందు తనను తాను అద్దంలో చూసుకోవాలని శనివారం అన్నారు. హైదరాబాద్లోని నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి తరుపున ప్రచారం చేశారు. -
Domestic Violence: అత్తగారి ఇంట్లో ఉన్నది 11 రోజులే.. వరకట్న వేధింపుల కేసు..కోర్టు ఏం చెప్పిందంటే..
Dowry Harassment: ఒక మహిళ తన భర్త, అత్తామామలపై వేధింపులు, క్రూరత్వం, దొంగతనం ఆరోపణలతో కేసు పెట్టింది. అయితే సదరు మహిళ కేవలం అత్తగారి ఇంట్లో 11 రోజులు మాత్రమే ఉంది. ఈ కేసును విచారించిన సెషన్స్ కోర్టు, మెజిస్ట్రియల్ కోర్టు ఆదేశాలను సమర్థించింది. ఈ కేసు చట్టవిరుద్ధంగా లేదని చెప్పింది. -
Dog Meat: శతాబ్ధాల సంప్రదాయం.. కుక్క మాంసం వినియోగానికి స్వస్తి చెప్పనున్న ఆ దేశం..
Dog Meat: శతాబ్ధాలుగా వస్తున్న సంప్రదాయానికి దక్షిణ కొరియా స్వస్తి పలకనుంది. కొన్నేళ్లుగా దక్షిణ కొరియాలోని ప్రజలు కుక్క మాంసాన్ని తింటున్నారు. అయితే ఈ విధానానికి అడ్డుకట్ట వేసేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేశంలోని అధికార పీపుల్ పవర్ పార్టీ ఈ ఏడాది చివరి నాటికి కుక్క మాంసం వినియోగంపై నిషేధాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. కుక్క మాంసం వినియోగంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, ముఖ్యంగా యువతరాల్లో ఈ సెంటిమెంట్ ఎక్కువగా ఉంది. అలాగే జంతు హక్కుల సంఘాల నుంచి అంతర్జాతీయంగా… -
Delhi: వరల్డ్ కప్ ఫైనల్ రోజున మందుబాబులకు షాకిచ్చిన ప్రభుత్వం.. కారణం ఇదే..
Delhi: వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్ ఎదురుచూస్తు్న్నారు. ఆదివారం రోజున అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే భారత్లో పలు ప్రాంతాల్లో క్రికెట్ లవర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మ్యాచ్ని ఆస్వాదించేందుకు విందు, వినోదాలను సెట్ చేసుకుంటున్నారు. -
Rohit Sharma: రూ.275 స్కూల్ ఫీజ్ చెల్లించలేని స్థితిలో రోహిత్ శర్మ కుటుంబం.. ఆ తర్వాత అంతా చరిత్రే..
Rohit Sharma: రోహిత్ శర్మ.. ప్రస్తుతం టీం ఇండియాను విజయపథంలో నడిపిస్తున్న సారథి. కెప్టెన్గా వరల్డ్ కప్ టోర్నీలో తన సత్తా చాటుతున్నారు. ఇటు ఓపెనర్గా బౌలర్లను ఊచకోత కోస్తూ.. తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి లేకుండా చేస్తున్నాడు. మరోక్క విజయం సాధిస్తే, వరల్డ్ కప్ అందుకున్న మూడో భారత కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డులకెక్కుతారు. రేపు అహ్మదాబాద్లోని నరేంద్రమోడీ స్టేడియంలో లక్ష మంది ఫ్యాన్స్, భారత ప్రధాని నరేంద్రమోడీతో పాటు హై లెవల్ పీపుల్ మధ్య ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా హై టెన్షన్… -
Blood Money: ఉరిశిక్ష నుంచి కేరళ నర్సును రక్షించాలంటే ‘బ్లడ్ మనీ’ ఒక్కటే మార్గం..
Blood Money: కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. యెమెన్ దేశ పౌరుడిని హత్య చేసిన కేసులో 2017లో ఆమెకు శిక్ష విధించింది. అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆమె చేసుకున్న అప్పీల్ని తిరస్కరించింది. అయితే ఇండియాలో ఉన్న ఆమె తల్లి మాత్రం కూతురు ప్రాణాల కోసం పోరాడుతోంది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో తాను యెమెన్ వెళ్లేందుకు అవకాశం కల్పించాలని ఈ ఏడాది ప్రారంభంలో ప్రియ తల్లి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు కేంద్రాన్ని కోరింది. -
Israel-Hamas War: దక్షిణ గాజాపై ఇజ్రాయిల్ దాడుల్లో 32 మంది మృతి.. అల్ షిఫా నుంచి పారిపోతున్న రోగులు..
Israel-Hamas War: ఇన్నాళ్లు ఉత్తర గాజా ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ ఆర్మీ, ఇప్పుడు హమాస్ని పూర్తిగా నిర్మూలించడానికి దక్షిణ గాజాపై కూడా ఫోకస్ చేసింది. దక్షిణ గాజా లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దళం దాడులు చేసింది. శనివారం జరిగిన ఈ దాడుల్లో 32 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. గతంలో ఉత్తరగాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ గాజా ప్రజలను హెచ్చరించింది.
తాజావార్తలు
-
Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
-
Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?
-
Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
-
Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
-
KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!