Uttar Pradesh: సీఎం యోగికి రక్తంతో లేఖ.. లైంగిక వేధింపులపై విద్యార్థినుల ఫిర్యాదు….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో ఓ కీచక ఉపాధ్యాయుడిపై విద్యార్థినులు ఏకంగా రక్తంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాశారు. యూపీ ఘజియాబాద్లో విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్ పాండేపై సీఎంకి అమ్మాయిలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కీచక ఉపాధ్యాయుడి నుంచి తమకు న్యాయం చేయాలని లేఖలో కోరారు.
విద్యార్థినుల నుంచి తీవ్ర ప్రతిస్పందన రావడంతో ప్రిన్సిపాల్ ని పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. ప్రిన్సిపాల్ రాజీవ్ పాండే సాకులతో బాలికను తన కార్యాలయానికి పిలిపించుకుని అసభ్యంగా శరీరాన్ని తాకేవాడు. బాధిత విద్యార్థినులంతా 12 నుంచి 15 ఏళ్ల లోపు వారే. అయితే ప్రిన్సిపాల్ కు భయపడి ముందుగా ఎవరికి చెప్పలేదు. చివరికి బాలికలు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
- Vijay TVK Alliance: విజయ్ కూటమిలోకి ఎవరు..? మిత్రపక్షాల భేటీపై తమిళనాడులో పెరిగిన ఆసక్తి
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
Read Also: K.Raghavendra Rao: ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దర్శకేంద్రుడు
ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు సీఎం యోగికి రక్తంతో లేఖ రాశారని పోలీసులు వెల్లడించారు. ప్రిన్సిపాల్ అకృత్యాల గురించి తెలుసుకున్న బాలికల కుటుంబ సభ్యులు అతనితో గొడవ పడినట్లు లేఖలో రాశారు. ప్రిన్సిపాల్ తో వాగ్వాదం జరగింది, కోపంగా ఉన్న తల్లిదండ్రులు అతడిపై దాడి చేశారు. అయితే తనపై దాడి చేసినందుకు విద్యార్థినుల తల్లిదండ్రులపై కౌంటర్ ఫిర్యాదు దాఖలు చేశాడు సదరు ప్రిన్సిపాల్. ఇరు వర్గాల కేసులను పోలీసులు కేసు నమోదు చేశారు.
తమను పోలీసులు బెదిరించి గంటల తరబడి నిర్భంధించారని విద్యార్థినుల, వారి తల్లిదండ్రులు ఆరోపించారు. నాలుగు గంటల పాటు పోలీస్ స్టేషన్ లో కూర్చోవాల్సి వచ్చిందని, లేఖలో పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ ఆర్ఎస్ఎస్ సంస్థకు చెందిన వాడు కావడంతోనే అతనిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని లేఖలో ఆరోపించారు. మేమంతా మీ కుమార్తెల వంటి వారమని, మిమ్మల్ని కలిసి, తమపై జరిగిన వేధింపుల గురించి వ్యక్తిగతంగా చర్చించాలని అనుకుంటున్నామని లేఖలో తెలిపారు.
తాజావార్తలు
-
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
-
Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
-
Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
-
Ampere Magnus G Max: ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్.. 142KM రేంజ్.. 65KM స్పీడ్.. 34 లీటర్ల స్టోరేజ్!
-
Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!