Shivaji: బాగా కావాల్సిన వారే నాపై కుట్ర చేశారు.. శివాజీ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు శివాజీ ఇటీవల ‘దండోరా’ సినిమా వేడుకలో చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన క్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ కావడమే కాకుండా, ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్లోని మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ, తన వివరణ ఇచ్చిన క్రమంలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో తను అనవసరంగా సలహాలు ఇచ్చానని, ఇకపై ఎవరికీ ఎలాంటి సూచనలు చేయకూడదని అర్థమైందని శివాజీ పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన కమిషన్ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని, తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు. ఎవరి హక్కులకు భంగం కలిగినా ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయని, ఎవరి దుస్తులు వారి ఇష్టమని, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని ఆయన కోరారు.
Also Read: Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఛార్జిషీట్ దాఖలు, ఏ-11గా అల్లు అర్జున్!
Also Read
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్పై మెగాస్టార్ రియాక్షన్ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
- Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
- 'Peddi': టాలీవుడ్ అంటే అంత అలుసా? 'పెద్ది' విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
తనపై కావాలనే వ్యక్తిగత కక్షతో కుట్ర పన్నుతున్నారని శివాజీ ఆరోపించారు. తన వ్యాఖ్యల తర్వాత తనను ఇబ్బంది పెట్టడానికి కొందరు ప్రత్యేకంగా ‘జూమ్ మీటింగ్’లు పెట్టుకున్నారని, ఇది తనను విస్మయానికి గురిచేసిందని ఆయన అన్నారు. తనతో కెరీర్ మొదలుపెట్టిన వారికే తనపై కోపం ఉందని, తనకు బాగా కావాల్సిన వారు ఇలా కుట్ర చేస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చాలా మంది చేశారని, వారిని వదిలేసి తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న ప్రచారం కాదని స్పష్టం చేశారు.
Also Read:Tollywood Christmas: ఈ వారం సినిమాల కలెక్షన్స్ రేసులో దూసుకుపోతున్న ఛాంపియన్
తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ శివాజీ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు ఆత్మాభిమానం తప్ప మరేమీ ముఖ్యం కాదని చెప్పారు. ఒకవేళ సినిమాలు లేకపోయినా తాను వ్యవసాయం చేసుకుని బతకగలనని, తనది రైతు కుటుంబమని ఆయన గర్వంగా చెప్పుకొచ్చారు. భారత దేశంలో కుటుంబ వ్యవస్థ అత్యంత గొప్పగా ముందుకు వెళ్తోందని, ఇంట్లో పెద్దలు జాగ్రత్తలు చెప్పడం సహజమేనని ఆయన గుర్తు చేశారు. శివాజీ తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూనే, జరిగిన పరిణామాలకు చింతిస్తున్నట్లు తెలిపారు. మహిళా కమిషన్ ఇంకా విచారణ కోరితే మళ్ళీ హాజరవుతానని, కానీ తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!