Vijayawada Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై పవర్ వివాదం.. అమ్మవారి ఆలయానికి కరెంట్ కట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Kanaka Durga Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై పవర్ వివాదం చోటుచేసుకుంది. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో గంట సేపు కరెంటు కట్ చేశారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో.. ఆ సమయంలో ఆలయ అధికారులు జనరేటర్ల ద్వారా దర్శనాలు కొనసాగించారు. ఈ ఘటనపై ఆలయ ఈవో శీనా నాయక్ విద్యుత్ అధికారులతో చర్చలు జరిపారు. చర్చల అనంతరం అమ్మవారి ఆలయానికి మళ్లీ కరెంటు సరఫరా ప్రారంభమైంది. అయితే, గత రెండేళ్లుగా అప్పారావుపేట పాముల కాలువ వద్ద ఉన్న సోలార్ ప్లాంట్ ద్వారా ఇంద్రకీలాద్రి దేవస్థానం రోజుకు 24 మెగావాట్ల విద్యుత్ను ఏపీ విద్యుత్ మండలికి ఉచితంగా అందిస్తోంది. దానికి ప్రతిగా దేవస్థానానికి చెందిన 10 విద్యుత్ సర్వీసులకు ఉచిత కరెంటు సరఫరా చేయాలనే ఒప్పందం ఉంది.
Read Also: Tragedy : ఆసుపత్రిలో మంచినీళ్లు అనుకొని కెమికల్ తాగి యువకుడు మృతి..
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
అయితే, ఇప్పుడు అదే 10 సర్వీసులకు బిల్లులు చెల్లించాలని విద్యుత్ శాఖ కోరడం వివాదానికి కారణమైంది. ఒప్పందం ప్రకారమే రూ.2 కోట్ల వ్యయంతో సోలార్ ప్లాంట్ నిర్మించామని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఒప్పందం రద్దు చేస్తే రూ.2 కోట్ల ప్రజాధనం వృథా అవుతుందని ఈవో శీనా నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఈవో కోరారు. మరి పవర్ వివాదం ఎటువైపు వెళ్తుందనేది వేచిచూడాలి..
తాజావార్తలు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!