INDIA Bloc: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష ఇండియా కూటమి కార్యాచరణపై నేతలు చర్చించారు. సెప్టెంబర్ 1న ముంబైలో చివరిసారిగా సమావేశమైన ఇండియా కూటమి, తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్లు తెలిసింది.
Sela Tunnel: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్లో భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా ఇండో-చైనా బోర్డర్లో సైనిక, రవాణా వసతులను మెరుగుపరుస్తోంది. సరిహద్దు వెంబడి సైన్యం సునాయాసంగా కదిలేందుకు వీలుగా రోడ్లను నిర్మిస్తోంది. పలు ప్రాంతాల్లో ఎయిర్ ఫెసిలిటీలు, కమ్యూనికేషన్ వ్యవస్థను బలపరుస్తోంది.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ వరుస పేలుళ్లతో వణికిపోతోంది. బలూచిస్తాన్ పేలుళ్లలో 50 మందికి పైగా ప్రజలు చనిపోయిన తర్వాత మరో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పాకిస్తాన్ అణు కమిషన్ కార్యాలయం వద్ద పేలుడు జరిగింది.
Putin: వెస్ట్రన్ దేశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫైర్ అయ్యారు. భారత్, రష్యా బంధాన్ని పశ్చిమ దేశాలు విడదీయలేవని ఆయన అన్నారు. భారతదేశం తన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని, దీనివల్ల పాశ్చాత్య దేశాల ప్రభావం పడదని ఆయన పేర్కొన్నారు. సోచి నగరంలో రష్యాన్ బ్లాక్ సీ రిసార్టులో జరిగి ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Putin: రష్యా తన కొత్త వ్యూహాత్మక క్షిపణిని విజయవంతంగా పరీక్షించిందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. 30 ఏళ్ల తరువాత తొలిసారిగి అణుసమార్థ్యం ఉన్న ఆయుధ పరీక్షను నిర్వహించింది రష్యా. అణుశక్తితో నడిచే, అణు సామర్థ్యం కలిగిన క్రూయిజ్ క్షిపణి అయిన ‘బ్యూరేవెస్ట్నిక్’ని విజయవంతంగా పరీక్షించిందని పుతిన్ చెప్పారు. రష్యా తన కొత్త తరం అణ్వాయుధాలలో కీలకమైన సర్మత్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థపై దాదాపుగా పనిని పూర్తి చేసిందని వెల్లడించారు.
Justin Trudeau: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్య విషయంలో భారత్పై అనవసర ఆరోపణలు చేసి దౌత్య సంబంధాలను దెబ్బతిన్నాకున్నాడు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. ఇప్పటికే భారత ఆగ్రహం చవిచూసిన ట్రూడో, అక్కడి స్థానికుల నుంచి కూడా మద్దతు కోల్పోతున్నాడు. తాజాగా ఓ కెనడియన్, ప్రధానిని అందరి ముందు తిట్టాడు, కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా ఇష్టపడలేదు. దేశంలో హౌసింగ్ సంక్షోభం, కార్బన్ పన్నులపై ప్రశ్నించాడు.
Nobel Peace Prize: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. ఇరాన్ మానవహక్కుల కార్యకర్త నర్గేస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి లభించింది. తన దేశంలో మహిళలపై జరుగుతున్న అణిచివేతకు వ్యతిరేకంగా ఆమె పోరాడారు. ప్రస్తుతం ఆమె జైలులో ఉన్నారు. మహిళా హక్కుల కోసం నినదించిన నర్గేస్ మొహమ్మదీకి 2023 సంవత్సరానికి గానూ శాంతి బహుమతి ఇచ్చారు.
Elections: త్వరలోనే ఎన్నికల నగారా మోగబోతోంది. తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని కసరత్తుల్ని పూర్తిచేసింది. వారంలోపు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. జాతీయ మీడియా సంస్థల ప్రకారం అక్టోబర్ 8-10 తేదీల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని కథనాలు ప్రచురిస్తున్నాయి.
Tata Safari-Harrier facelift: భారతీయ ఆటో దిగ్గజం టాటా దూసుకుపోతోంది. ఇప్పటికే టాటా నెక్సాన్ ఫేస్లిఫ్ట్ వేరియంట్ని తీసుకువచ్చిన ఈ సంస్థ తన ప్రసిద్ధ ఎస్యూవీ కార్లు అయిన సఫారీ, హారియర్ ఫేస్లిఫ్ట్ వెర్షన్లను తీసుకురాబోతోంది. మరిన్ని అధునాతన ఫీచర్లతో, టెక్నాలజీని ఈ కార్లలో ఇంట్రడ్యూస్ చేయబోతోంది. ఈ కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ రెండు కార్లకు సంబంధించిన బుకింగ్స్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి వెస్ట్రన్ దేశాలపై ఆగ్రహ వ్యక్తం చేశారు. ‘‘రష్యా కొత్త ప్రపంచాన్ని నిర్మించే పనిలో ఉంది’’ అని గురువారం అన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి వెస్ట్రన్ దేశాలే కారణమని నిందించారు. ప్రపంచ ఆధిపత్యం కోసం పశ్చిమ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆరోపించారు. పాశ్యాత్య దేశాలకు ఎప్పుడూ ఓ శతృవు కావాలని ఎద్దేవా చేశారు. వాల్దాయ్ పొలిటికల్ ఫోరమ్ సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.