Mukkoti Ekadashi: రేపే ముక్కోటి ఏకాదశి.. ఈ 7 నియమాలు పాటిస్తే, శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పక్కా..!
- రేపే ముక్కోటి ఏకాదశి..
- శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం ఈ నియమాలు పాటించాలి..
- ఏకాదశి రోజున పాటించే నియమాలతో విష్ణువు ఆశీస్సులు లభిస్తాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukkoti Ekadashi: ముల్లోకాలను నడిపించే ఆ శ్రీ విష్ణువుని ముక్కోటి ఏకాదశి (Vaikuntha Ekadashi) రోజున ప్రార్థించే వారికి మోక్షం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువు ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి పెడతారు. క్షీరసాగర మథనం జరిగి హాలాహలం, అమృతం ఆవిర్భవించింది ఈ రోజునే. అందుకే ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు రేపు (డిసెంబరు 30న ) ఉపవాసం ఉండి లక్ష్మీ సమేతుడైన ఆ మహావిష్ణువుని భక్తితో పూజించి, నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేస్తే పుణ్యం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి, ద్వాదశి రోజున అతిథి లేకుండా భుజించరాదని పేర్కొంటున్నారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవాళ్లు పాప విముక్తుల అవుతారని పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసంతో జీర్ణాశయానికి రెస్ట్ దొరకడం ఆరోగ్యప్రదమే గాక ఏకాదశి రోజు చేసే ఆధ్యాత్మిక సాధనకు శరీరం పూర్తిగా సహకరిస్తుంది.
Read Also: VanaVeera : ఆ చిన్న సినిమా ఇన్ సైడ్ టాక్ బాగుందట.. కానీ సెన్సార్ పెండింగ్?
Also Read
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
- Gajakesari Yoga 2026 : గజకేసరి యోగం.. ఈ రాశులకు గురు, చంద్రుల కలయికతో లక్ష్మీకటాక్షం.!
అయితే, ఏకాదశి నాటి వ్రతంలో 7 నియమాలు..
* దశమి నాడు రాత్రి ఉపవాసం ప్రారంభించాలి..
* ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి.
* వైకుంఠ ఏకాదశి నాడు అబద్ధం ఆడొద్దు..
* చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
* స్త్రీ సాంగత్యం పనికి రాదు.
* ముక్కోటి ఏకాదశి రోజు రాత్రంతా జాగరణ చేయడం మంచిది.
* ఏకాదశి రోజున అన్నదానం చేయాలి.
ఇక, ద్వాదశి రోజున మళ్లీ భగవంతుడిని ఆరాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సత్కరించడం మంచింది. ఉపవాసం చేయలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు లాంటి పదార్థాలు తినవచ్చు. ముక్కోటి ఏకాదశి రోజున చేసే విష్ణు పూజ, భగవత్ గీత పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం, గో సేవ, మీకు శక్తిని అనుసరించి చేసే దానధర్మాలు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఇవన్నీ చేసే ఛాన్స్ లేకపోతే.. ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడంతో అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
అయితే, శ్రీమహావిష్ణువు కొలువై ఉండే దేవాలయమే మన దేహమని శాస్త్రం చెప్తుంది. ఉపనిషత్తులు చెప్పినట్లుగా ప్రతి మానవ హృదయంలోనూ జీవుడనే దేవుడిగా పరమాత్మ ప్రకాశిస్తుంది. పరమాత్మను దగ్గరగా సేవించేందుకు ఏకాదశి వ్రతాన్ని నియమంగా పాటించాల్సిందే. ఉపవాసం చేయడం ద్వారా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనసు.. మొత్తం పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకోని, పూజ-జపం-ధ్యానం చేయాడం వల్ల ఆ గోవిందుడి ఆశీస్సులు లభిస్తాయని భక్తుల నమ్మకం.
తాజావార్తలు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..