Elections: తెలంగాణతో సహా 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగేది అప్పుడే.. వారంలోగా షెడ్యూల్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elections: త్వరలోనే ఎన్నికల నగారా మోగబోతోంది. తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని కసరత్తుల్ని పూర్తిచేసింది. వారంలోపు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. జాతీయ మీడియా సంస్థల ప్రకారం అక్టోబర్ 8-10 తేదీల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని కథనాలు ప్రచురిస్తున్నాయి.
నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం మధ్య పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘానికి సంబంధించిన వర్గాలు తెలిపినట్లు సమాచారం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఒకే విడతలో, ఛత్తీస్గడ్ రాష్ట్రంలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు సమాచారం. 5 రాష్ట్రాల ఎన్నికల తేదీలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. కౌంటింగ్ ఒకే రోజు జరగనుంది.
Also Read
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
Read Also: KTR: షాక్ కొట్టి పోతే దరిద్రం పోతుంది.. కాంగ్రెస్, బీజేపీ నాయకులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
మిజోరాం అసెంబ్లీ కాలపరిమితి డిసెంబర్ 17తో ముగియనుంది. ఇక మిగతా రాష్ట్రాలకు జనవరి వరకు సమయం ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంసిద్ధతను పరిశీలించింది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వ్యూహాలను ఖరారు చేసేందుకు ఎన్నికల సంఘం శుక్రవారం తన పరిశీలకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల కోడ్ అమలు, మద్యం, డబ్బు పంపకాలకు చెక్ పెట్టేందుకు వ్యూహాలను రచిస్తోంది.
2024 లోక్సభ ఎన్నికల ముందు జరగబోతున్న ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి కీలకం కానున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండగా.. ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. మిజోరాంలో బీజేపీ మిత్రపక్షమైన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) అధికారంలో ఉంది.
తాజావార్తలు
-
Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!