INDIA Bloc: ఖర్గే, రాహుల్ గాంధీని కలిసిన శరద్ పవార్.. ఇండియా కూటమి నెక్ట్స్ ప్లాన్పై ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA Bloc: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష ఇండియా కూటమి కార్యాచరణపై నేతలు చర్చించారు. సెప్టెంబర్ 1న ముంబైలో చివరిసారిగా సమావేశమైన ఇండియా కూటమి, తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్లు తెలిసింది.
ముంబై సమావేశం తర్వాత ఎక్కడ భేటీ కావాలనే విషయాన్ని కూటమి నిర్ణయించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి కూటమి నేతలు భేటీ కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా శరద్ పవార్, ఖర్గే, రాహుల్ గాంధీల మధ్య 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎలా ఢీకొట్టాలని నేతలు చర్చించారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
Read Also: Viral News : మెట్రోలో తిన్న ప్రయాణికుడు.. షాక్ ఇచ్చిన అధికారులు..
రాహుల్ గాంధీతో పాటు దేశ ప్రజల గొంతు వినిపించడానికి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కలిశారని ఖర్గే ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. మేము ప్రతీ సవాల్కి సిద్ధంగా ఉన్నాం, జూడేగా భారత్, జీతేగా ఇండియా( భారత్ ఏకమవుతుంది, భారత్ గెలుస్తుంది) అని ట్వీట్ చేశారు.
అక్టోబర్ నెలలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ర్యాలీ నిర్వహించాలని అనుకున్నప్పటికీ.. ఇది రద్దైంది. డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దీనికి మద్దతుగా పలువురు డీఎంకే నాయకులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ ఈ యాత్రను నిర్వహించలేకపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పలువురు ఇండియా కూటమి నేతలు తదుపరి సమావేశాన్ని పశ్చిమ బెంగాల్ లో నిర్వహించాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?