INDIA Bloc: ఖర్గే, రాహుల్ గాంధీని కలిసిన శరద్ పవార్.. ఇండియా కూటమి నెక్ట్స్ ప్లాన్పై ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA Bloc: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష ఇండియా కూటమి కార్యాచరణపై నేతలు చర్చించారు. సెప్టెంబర్ 1న ముంబైలో చివరిసారిగా సమావేశమైన ఇండియా కూటమి, తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్లు తెలిసింది.
ముంబై సమావేశం తర్వాత ఎక్కడ భేటీ కావాలనే విషయాన్ని కూటమి నిర్ణయించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి కూటమి నేతలు భేటీ కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా శరద్ పవార్, ఖర్గే, రాహుల్ గాంధీల మధ్య 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎలా ఢీకొట్టాలని నేతలు చర్చించారు.
Also Read
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
Read Also: Viral News : మెట్రోలో తిన్న ప్రయాణికుడు.. షాక్ ఇచ్చిన అధికారులు..
రాహుల్ గాంధీతో పాటు దేశ ప్రజల గొంతు వినిపించడానికి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కలిశారని ఖర్గే ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. మేము ప్రతీ సవాల్కి సిద్ధంగా ఉన్నాం, జూడేగా భారత్, జీతేగా ఇండియా( భారత్ ఏకమవుతుంది, భారత్ గెలుస్తుంది) అని ట్వీట్ చేశారు.
అక్టోబర్ నెలలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ర్యాలీ నిర్వహించాలని అనుకున్నప్పటికీ.. ఇది రద్దైంది. డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దీనికి మద్దతుగా పలువురు డీఎంకే నాయకులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ ఈ యాత్రను నిర్వహించలేకపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పలువురు ఇండియా కూటమి నేతలు తదుపరి సమావేశాన్ని పశ్చిమ బెంగాల్ లో నిర్వహించాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!