Venu Goapl Reddy
Author- NTV Telugu-
Republic Day: “రిపబ్లిక్ డే” రోజు పెద్ద ఎత్తున దాడులకు పాకిస్తాన్, జైష్ కుట్ర..
Republic Day: రిపబ్లిక్ డే లక్ష్యంగా భారత్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలు కలిసి ప్లాన్ చేస్తున్నాయని తెలుస్తోంది. ఈ కుట్రకు ‘‘26-26’’ అని కోడ్ నేమ్ పెట్టినట్లు సమాచారం. ఈ హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ వంటి సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
Kerala Woman: కేరళ బస్ వైరల్ వీడియో.. నిందితురాలు షింజితా ముస్తాఫా అరెస్ట్..
Kerala Woman: కేరళలో ఇటీవల బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఒక మహిళ చేసిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనలో, ఎలాంటి తప్పు చేయకపోయినా తనపై నిందలు రావడంతో 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. -
Operation Sindoor: పాక్పై దాడిలో అసలు విజయం “వైమానిక దళానిదే”: ఐఏఎఫ్ చీఫ్
Operation Sindoor: దేశ భద్రతకు కేవలం ఆర్థిక బలమే సరిపోదని, బలమైన సైనిక శక్తి తప్పనిసరి అని భారత వైమానిక దళ చీఫ్(IAF) చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన 22వ సుబ్రతో ముఖర్జీ సెమినార్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా, పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడులను గురించి ప్రస్తావించారు. ఆధునిక యుద్ధాల్లో ‘‘ఎయిర్ పవర్’’ చాలా కీలకమని అన్నారు. పాకిస్తాన్పై దాడుల్లో భారత వైమానిక […] -
Crime: పెళ్లై 4 నెలలు.. ఇద్దరు వ్యక్తులతో భార్య రాసలీలలు.. భర్త ఏం చేశాడంటే..
Crime: ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో దారుణం జరిగింది. ఒక యువకుడు తన భార్యను ముగ్గురు వ్యక్తులతో అసభ్యకరమైన స్థితిలో చూశానని చెప్పి, పెళ్లైన నాలుగు నెలలకే ఆమె గొంతు నులిమి హత్య చేశాడని అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, మరుసటి రోజు పోలీస్స్టేషన్లో నిందితుడు లొంగిపోయినట్లు తెలుస్తోంది. -
Maharashtra: బీజేపీకి బిగ్ షాక్.. మేయర్ పదవి కోసం ఒక్కటైన షిండే శివసేన, రాజ్ఠాక్రే..
Maharashtra: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి సత్తా చాటింది. దేశంలో అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్ అయిన ముంబై మేయర్ పీఠాన్ని బీజేపీ, శివసేనలు కలిసి దక్కించుకునే అవకాశం ఏర్పడింది. అయితే, ముంబైతో పాటు పలు కార్పొరేషన్లలో బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య మేయర్ పదవి కోసం ప్రతిష్టంభన ఏర్పడింది. -
Ryan Dahl: ప్రశ్నార్థకంగా “సాఫ్ట్వేర్ ఇంజనీర్ల” భవిష్యత్తు..
Ryan Dahl: AI అభివృద్ధి మొత్తం టెక్ రంగాన్ని మార్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. క్లాడ్ కోడ్ వంటి కోడింగ్ పనుల్ని ఏఐ సాధారణాలు సాఫ్ట్వేర్ డెవలపర్లు, కోడర్ల మాదిరిగానే చక్కబెట్టేస్తున్నాయి. దీంతో భవిష్యత్తులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పనిని కూడా ఏఐ నిర్వహించేలా పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా NodeJS క్రియేటర్, ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ర్యాన్ డాల్ చేసిన వ్యాఖ్యలు, టెక్కీల్లో గుబులు పుట్టిస్తున్నాయి. […] -
Pregnancy: GLP-1ఇంజెక్షన్లతో అద్భుతాలు.. భారత్లో పెరుగుతున్న ఆకస్మిక ‘‘ప్రెగ్నెన్సీలు’’.. కారణాలు ఇవే..
GLP-1: టైప్-2 డయాబెటిస్ కోసం తీసుకువచ్చిన GLP-1 వెయిట్ లాస్ ఇంజెక్షన్లు అద్భుతాలను సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ మందుల వాడకం పెరిగింది. ముఖ్యంగా, షుగర్ వల్ల బాధపడుతున్న వారు మాత్రమే కాకుండా.. స్థూలకాయం, అధిక బరువుతో బాధపడుతున్న వారు వీటిని తీసుకుంటున్నారు. భారత్లో వీటి వాడకం వల్ల అనూహ్యంగా చాలా ఏళ్లుగా ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్న చాలా మంది మహిళల్లో ఆకస్మిక ‘‘గర్భధారణ’’ కేసులు పెరుగుతున్నాయి. ‘‘ఆకస్మిక’’ లేదా ‘‘ఒజెంపిక్ శిశువుల’’గా పిలిచే కేసుల సంఖ్య […] -
Toll Fee: టోల్ బకాయిలు చెల్లించలేదా.? ఇకపై చిక్కుల్లో పడ్డట్లే.. కేంద్రం కఠిన నిర్ణయం..
Toll Fee: జాతీయ రహదారులపై టోల్ చెల్లింపులపై కేంద్రం సీరియస్గా వ్యవహరించనుంది. టోల్ బకాయిలు ఉన్న వాహనాలపై ఇకపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. టోల్ బకాయిలు ఉంటే వాహనాలకు కీలక సేవలను నిలిపివేయనుంది. బకాయిలు పెండింగ్లో ఉన్న వాహనాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC), ఫిట్నెస్ సర్టిఫికేట్ రిన్యువల్, నేషనల్ పర్మిట్ వంటి సేవల్ని అడ్డుకోనుంది. -
EU-India FTA: ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’.. భారత్-ఈయూ ట్రేడ్ డీల్పై కీలక వ్యాఖ్యలు..
EU-India FTA: యూరోపియన్ యూనియన్(EU)-భారత్ మధ్య ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) త్వరలో కుదురబోతోందని ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ అన్నారు. మంగళవారం దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆమె సంకేతాలు ఇచ్చారు. -
Asim Munir: పాకిస్తాన్ ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో, అది ఇప్పుడు నెరవేరుతోంది..
Asim Munir: ఇస్లాం పేరుపై ఏర్పడిన పాకిస్తాన్, ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో, ఇప్పుడు అది సాధించే దిశగా ఉన్నామని పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అన్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మనవడు జునైద్ సఫ్దర్ వలీమాకు హాజరైన bilwkh ఆయన పాక్ వార్తా పత్రిక ది న్యూస్ ఇంటర్నేషనల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, సీనియర్ సైనిక అధికారులు, క్యాబినెట్ మంత్రులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Varun Chakravarthy: వైభవ్ వికెట్తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
-
Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
-
US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్డౌన్
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?