Pok Protests: పాక్ ఆర్మీ అరాచకం.. పీఓకే నిరసనకారులపై కాల్పులు, 8 మంది మృతి..
- పాకిస్తాన్ ఆర్మీ అరాచకాలు..
- పీఓకే నిరసనకారులపై కాల్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pok Protests: పాకిస్తాన్ ఆర్మీ, భద్రతా బలగాలు అరాచకానికి పాల్పడుతున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో జరుగుతున్న నిరసనల్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడి ఆర్మీకి వ్యతిరేకంగా పీఓకేలోని ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. గత మూడు రోజులుగా జరుగుతున్న ఆందోళనలను పాక్ ప్రభుత్వం అణిచివేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్ భద్రతా బలగాలు సాధారణ నిరసనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. బుధవారం జరిగిన ఈ కాల్పుల్లో 08 మంది నిరసనకారులు మరణించారు. చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది.
బుధవారం బాగ్ జిల్లాలోని ధిర్ కోట్ లో నలుగురు మరణించారని, ముజఫరాబాద్ లో ఇద్దరు, మీర్పూర్లో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి నిరసనల్ని కవర్ చేసేందుకు మీడియాను అనుమతించడం లేదు. మంగళవారం ముజఫరాబాద్లో ఇద్దరు మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది. తమ ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్నారని చెబుతూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో గత 72 గంటలుగా పీఓకే వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు.
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
బుధవారం ఉదయం నిరసనకారులు రాళ్లు విసిరారు. ముజఫరాబాద్పై నిరసనకారులు మార్చ్ను నిరోధించేందుకు వంతెనపై కంటైనర్లను అడ్డుగా ఉంచారు. అయితే, వాటిని వంతెనపై నుంచి నదిలో పారేశారు. ముజఫరాబాద్ మరణాలకు పాక్ రేంజర్ల కాల్పులే కారణమని జేఎసీ ఆరోపించింది. ముజఫరాబాద్ కాల్పులకు సంబంధించి, పాకిస్తాన్ ఇంటెల్ ఏజెన్సీ, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మద్దతు ఇచ్చిన ముస్లిం కాన్ఫరెన్స్ను ఉగ్రవాద సంస్థగా ముద్ర వేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని వారు కోరుతున్నారు.
అల్లర్లు తీవ్రమవుతున్న నేపథ్యంలో పీఓకేలో పాక్ బలగాలు గస్తీని పెంచాయి. పంబాబ్ ప్రావిన్సు నుంచి అదనపు బలగాలను అక్కడికి పంపారు. రాజధాని ఇస్లామాబాద్ నుంచి అదనంగా 1000 మంది సైనికుల్ని పంపారు. పాక్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా పరిమితం చేసింది.
తాజావార్తలు
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..