Congress: బీజేపీ ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సీఎంలుగా కొత్తవారిని నియమించడంపై కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రుల ఎంపికపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ రాహుల్ గాంధీ మార్గంలో నడుస్తున్నారంటూ పేర్కొన్నారు.
Bhajan Lal Sharma: రాజకీయ హేమాహేమీలు, దిగ్గజాలు ఉన్నా కూడా వారందరిని పక్కన పెట్టి అనూహ్యమైన వ్యక్తిని రాజస్థాన్ సీఎంగా ప్రకటించింది బీజేపీ. మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్ వంటి వ్యక్తులను పక్కనపెడుతూ.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్లాల్ శర్మకు రాజస్థాన్ అధికార పగ్గాలు అప్పగించింది. ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాగే విష్ణుదేవ్ సాయ్, మోహన్ యాదవ్లను సీఎంలుగా ప్రకటించిన సర్ప్రైజ్ చేసిన బీజేపీ, రాజస్థాన్ సీఎం అభ్యర్థి విషయంలోనూ ఇదే ఫార్ములాను అనుసరించింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)పై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ డీప్ఫేక్ టెక్నాలజీ, ఏఐ ద్వారా వచ్చే ప్రమాదాలను గురించి మంగళవారం హెచ్చరించారు. ఏఐ భారతదేశ టెక్నాలజీని విప్లవాత్మకంగా మార్చగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉందని ప్రధని అన్నారు. అయితే ముఖ్యంగా ఉగ్రవాదుల చేతికి ఏఐ చిక్కొద్దని హెచ్చరించారు.
Infosys: కోవిడ్-19 మహమ్మారి కారణంగా పలు కంపెనీలు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపయాన్ని కల్పించాయి. కరోనా ప్రభావం తగ్గినా కూడా కొందరు ఉద్యోగులు ఇంకా వర్క్ ఫ్రం హోం పద్ధతిలోనే పనిచేస్తామని కోరుకుంటున్నారు. అయితే ఐటీ కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని కొరుతున్నాయి. కొన్ని సంస్థలు కార్యాలయాలకు రాకుంటే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.
North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కి లగ్జరీ కార్లు అంటే విపరీతమైన మోజు. అయితే ఆ దేశ అణు కార్యక్రమాల నేపథ్యంలో ఉత్తర కొరియాపైన ప్రపంచంలో చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశానికి లగ్జరీ వస్తువులు చేరాలంటే అక్రమ రవాణానే మార్గం. దేశంలో ప్రజలు తినడానికి తిండి లేనప్పటికీ.. కిమ్కి మాత్రం ఫారెన్ మందు, స్విట్జర్లాండ్ చీజ్ మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. వీటిలో పాటు విలువైన కార్లను స్మగ్లింగ్ ద్వారా తన దేశానికి తెప్పించుకుంటాడు.
Air India: టాటా గ్రూపు సొంతం చేసుకున్న తర్వాత ఎయిరిండియా రూపు రేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో కొత్త విమానాలకు ఆర్డర్ చేసిన టాటా, ఇప్పుడు తన పైలట్లు, సిబ్బందికి కొత్త యూనిఫాంని ఈ రోజు విడుదల చేసింది. 1932లో స్థాపించిబడిన ఈ ఎయిర్లైన్ తన యూనిఫామ్ని మార్చడం ఇదే తొలిసారి. ఈ ఏడాది చివరినాటికి విడుదల కానున్న కొత్త యూనిఫామ్ ‘‘ఎయిరిండియా గొప్ప చరిత్ర, ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం’’ అంటూ ట్వీట్ చేసింది.
PM Modi: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసాల నుంచి ఐటీ అధికారులు భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. గత బుధవారం నుంచి ఆయనకు సంబంధం ఉన్న మద్యం వ్యాపారాలపై దాడులు నిర్వహించారు. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిపిన దాడుల్లో ఏకంగా రూ. 353 కోట్ల నగదు బయటపడటం దేశాన్ని నివ్వెరపరిచింది.
Diya Kumari: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బీజేపీ సంచలన వ్యక్తిని ప్రకటించింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్లాల్ శర్మని సీఎంగా ఎంపిక చేసింది. ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా రాజకుటుంబ నేపథ్యం ఉన్న దియా కుమారిని, ఎస్సీ వర్గానికి చెందిన ప్రేమ్ చంద్ బైర్వాలు ఎన్నికయ్యారు. అయితే, ముందుగా మాజీ సీఎం వసుంధర రాజేని స్థానంలో దియాకుమారి సీఎం అవుతారనే ప్రచారం జరిగింది. చివరకు ఉపముఖ్యమంత్రి పదవి దియాకుమారిని వరించింది.
CBSE Class 10 Exam: సీబీఎస్ఈ 10 తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ తేదీలను ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పదో తరగతి ఎగ్జామ్ ఉంటాయని, అలాగే 12వ తరగతి ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు ఉంటాయని తెలిపింది.
Shivraj Singh Chouhan: నాలుగు పర్యాయాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎంపీ సీఎంగా బీజేపీ అధిష్టానం మోహన్ యాదవ్ని ప్రకటించడంతో శివరాజ్ సింగ్ పాలనకు తెరపడిండి. ఈ రోజు జరిగిన వీడ్కోలు సమావేశంలో పలువురు మహిళలు ఆయనకు కన్నీటీ వీడ్కోలు పలికారు.