Infosys: వారానికి మూడు రోజులు ఆఫీస్కి రావాల్సిందే.. తప్పనిసరి చేయనున్న ఇన్ఫోసిస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infosys: కోవిడ్-19 మహమ్మారి కారణంగా పలు కంపెనీలు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపయాన్ని కల్పించాయి. కరోనా ప్రభావం తగ్గినా కూడా కొందరు ఉద్యోగులు ఇంకా వర్క్ ఫ్రం హోం పద్ధతిలోనే పనిచేస్తామని కోరుకుంటున్నారు. అయితే ఐటీ కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని కొరుతున్నాయి. కొన్ని సంస్థలు కార్యాలయాలకు రాకుంటే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.
ఈ నేపథ్యంలో దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ కూడా తన ఉద్యోగులను కూడా ఆఫీసులకు రమ్మని కొరబోతున్నట్లు సమచారం. వారానికి మూడు రోజులు ఆఫీసుల నుంచే పనిచేయడాన్ని తప్పనిసరి చేయబోతున్నట్లు తెలుస్తోంది. నార్మల్ ఆఫీస్ రొటీన్ ప్రోత్సహించడంలో మేనేజ్మెంట్ విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉత్పాదకతను పెంచడానికి వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి ఇటీవల కోరిన తర్వాత ఈ వార్త వచ్చింది.
Also Read
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
- ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
Read Also: Air India: ఎయిరిండియా పైలట్లకు, సిబ్బందికి కొత్త యూనిఫాం.. అదిరిపోయేలా మనీష్ మల్హోత్రా డిజైన్..
ఇప్పటికే ఇన్ఫోసిస్ వర్టికల్ హెడ్స్ వారానికి మూడు రోజులు కార్యాలయానికి రావాలని కోరుతూ ఉద్యోగులకు ఈమెయిల్స్ వెళ్లాయి. అయితే వీటిపై ఇన్ఫోసిస్ అధికారికంగా స్పందించలేదు. వైద్యపరిమైన కారణాలుతో మినహా ఉద్యోగులు తప్పనిసరిగా కార్యాలయం నుంచే పనిచేయాలని ఆదేశాల్లో పేర్కొంది. కిందిస్థాయి ఉద్యోగులు ప్రతీ నెల పది రోజులు కార్యాలయానికి రావాలని ఇన్ఫోసిస్ ఇటీవల కోరింది.
ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే కాదు, ఇతర ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులు ఆఫీసులకు రావాలని కోరుతున్నాయి. విప్రో తన ఉద్యోగులకు హైబ్రిడ్ పాలసీని తీసుకువచ్చింది. వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలని కోరింది. ఇది జనవరి 7 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. టీసీఎస్ కూడా వర్క్ ఫ్రం ఆఫీసు విధానాన్ని పునరుద్ధరిస్తోంది.
తాజావార్తలు
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
ట్రెండింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!