Infosys: వారానికి మూడు రోజులు ఆఫీస్కి రావాల్సిందే.. తప్పనిసరి చేయనున్న ఇన్ఫోసిస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infosys: కోవిడ్-19 మహమ్మారి కారణంగా పలు కంపెనీలు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపయాన్ని కల్పించాయి. కరోనా ప్రభావం తగ్గినా కూడా కొందరు ఉద్యోగులు ఇంకా వర్క్ ఫ్రం హోం పద్ధతిలోనే పనిచేస్తామని కోరుకుంటున్నారు. అయితే ఐటీ కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని కొరుతున్నాయి. కొన్ని సంస్థలు కార్యాలయాలకు రాకుంటే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.
ఈ నేపథ్యంలో దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ కూడా తన ఉద్యోగులను కూడా ఆఫీసులకు రమ్మని కొరబోతున్నట్లు సమచారం. వారానికి మూడు రోజులు ఆఫీసుల నుంచే పనిచేయడాన్ని తప్పనిసరి చేయబోతున్నట్లు తెలుస్తోంది. నార్మల్ ఆఫీస్ రొటీన్ ప్రోత్సహించడంలో మేనేజ్మెంట్ విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉత్పాదకతను పెంచడానికి వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి ఇటీవల కోరిన తర్వాత ఈ వార్త వచ్చింది.
Also Read
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
- Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
Read Also: Air India: ఎయిరిండియా పైలట్లకు, సిబ్బందికి కొత్త యూనిఫాం.. అదిరిపోయేలా మనీష్ మల్హోత్రా డిజైన్..
ఇప్పటికే ఇన్ఫోసిస్ వర్టికల్ హెడ్స్ వారానికి మూడు రోజులు కార్యాలయానికి రావాలని కోరుతూ ఉద్యోగులకు ఈమెయిల్స్ వెళ్లాయి. అయితే వీటిపై ఇన్ఫోసిస్ అధికారికంగా స్పందించలేదు. వైద్యపరిమైన కారణాలుతో మినహా ఉద్యోగులు తప్పనిసరిగా కార్యాలయం నుంచే పనిచేయాలని ఆదేశాల్లో పేర్కొంది. కిందిస్థాయి ఉద్యోగులు ప్రతీ నెల పది రోజులు కార్యాలయానికి రావాలని ఇన్ఫోసిస్ ఇటీవల కోరింది.
ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే కాదు, ఇతర ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులు ఆఫీసులకు రావాలని కోరుతున్నాయి. విప్రో తన ఉద్యోగులకు హైబ్రిడ్ పాలసీని తీసుకువచ్చింది. వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలని కోరింది. ఇది జనవరి 7 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. టీసీఎస్ కూడా వర్క్ ఫ్రం ఆఫీసు విధానాన్ని పునరుద్ధరిస్తోంది.
తాజావార్తలు
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!