Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘పిక్పాకెట్’ వ్యాఖ్యలు.. చర్యలు తీసుకోవాలని ఈసీకి హైకోర్టు ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ ఉద్దేశిస్తూ ‘‘పిక్పాకెట్స్’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని గురువారం ఆదేశించింది. ఆయన ప్రకటన తప్పుగా ఉందని, 8 వారాల్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మినీ పుష్కర్లతో కూడిన ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
నవంబర్ 23న రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు జారీ చేసి, నవంబర్ 26న సమాధానం ఇవ్వాలని కోరింది. అయితే దీనిపై ఆయన స్పందించకపోవడంతో కోర్టు ఈ చర్యలకు ఆదేశించింది. అయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదాన్ని కోర్టు పేర్కొనలేదు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
Read Also: Assembly Meeting: కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం.. సీఎం మాట్లాడుతుండగా సభలో బీఆర్ఎస్ రచ్చ
గత నెల, నవంబర్ 23న ప్రధాని మోడీపై ‘పనౌటీ, జేబుదొంగ’ అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం.. రాజకీయ ప్రత్యర్థులపై ధృవీకరించని ఆరోపణలు చేయడానికి నాయకులకు అనుమతి లేదని ఈసీ తన నోటీసుల్లో పేర్కొంది. బీజేపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రూ. 14,00,000 కోట్ల రుణమాఫీ చేసిందని గాంధీ చేసిన ఆరోపణ, వాస్తవాలు కాదని బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
ఓ ర్యాలీలో ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, వ్యాపారవేత్త గౌతమ్ అదానీలను ‘పిక్ పాకెట్స్’ అని పిలిచినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ పిల్ దాఖలైంది. తాజాగా ఈ కేసును ఢిల్లీ హైకోర్టు విచారించి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇలాంటి ప్రసంగాలను నియంత్రించేందుకు కఠినమైన నిబంధనలు రూపొందించాలని కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేని కోర్టు వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!