Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘పిక్పాకెట్’ వ్యాఖ్యలు.. చర్యలు తీసుకోవాలని ఈసీకి హైకోర్టు ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ ఉద్దేశిస్తూ ‘‘పిక్పాకెట్స్’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని గురువారం ఆదేశించింది. ఆయన ప్రకటన తప్పుగా ఉందని, 8 వారాల్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మినీ పుష్కర్లతో కూడిన ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
నవంబర్ 23న రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు జారీ చేసి, నవంబర్ 26న సమాధానం ఇవ్వాలని కోరింది. అయితే దీనిపై ఆయన స్పందించకపోవడంతో కోర్టు ఈ చర్యలకు ఆదేశించింది. అయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదాన్ని కోర్టు పేర్కొనలేదు.
Also Read
- CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
- Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
- India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
- Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
Read Also: Assembly Meeting: కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం.. సీఎం మాట్లాడుతుండగా సభలో బీఆర్ఎస్ రచ్చ
గత నెల, నవంబర్ 23న ప్రధాని మోడీపై ‘పనౌటీ, జేబుదొంగ’ అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం.. రాజకీయ ప్రత్యర్థులపై ధృవీకరించని ఆరోపణలు చేయడానికి నాయకులకు అనుమతి లేదని ఈసీ తన నోటీసుల్లో పేర్కొంది. బీజేపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రూ. 14,00,000 కోట్ల రుణమాఫీ చేసిందని గాంధీ చేసిన ఆరోపణ, వాస్తవాలు కాదని బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
ఓ ర్యాలీలో ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, వ్యాపారవేత్త గౌతమ్ అదానీలను ‘పిక్ పాకెట్స్’ అని పిలిచినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ పిల్ దాఖలైంది. తాజాగా ఈ కేసును ఢిల్లీ హైకోర్టు విచారించి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇలాంటి ప్రసంగాలను నియంత్రించేందుకు కఠినమైన నిబంధనలు రూపొందించాలని కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేని కోర్టు వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
-
iQOO Z11i: ఐకూ Z11i విడుదల.. 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Snapdragon 4 Gen 2
-
Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!