Venu Goapl Reddy
Author- NTV Telugu-
POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
POK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో పలువురు మరణించినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో, పాకిస్తాన్ను తాను చేస్తున్న దుర్మార్గాలకు అంతర్జాతీయ సమాజం ముందు జవాబుదారీగా నిలబెట్టాలని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ నుంచి తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలు వ్యాప్తి చెందుతున్నాయని ఆరోపించారు. […] -
POK Protest: అసిమ్ మునీర్ ఒక టెర్రరిస్ట్.. పీఓకేలో తిరుగుబాటు..
POK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో పాకిస్తాన్ ఆర్మీ దాష్టీకాలకు తెగబడుతోంది. హక్కుల కోసం ఆందోళన చేస్తున్న నిరసనకారులపై కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో 30 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మరణాల సంఖ్య 100ను దాటినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) నిర్వహించిన “ముజఫరాబాద్కు లాంగ్ మార్చ్” సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి, పాకిస్థాన్ […] -
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
POK killings: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(POK)లోని ప్రజలు తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రావల్కోట ప్రాంతంలో నిరసనల్ని అణిచివేయడానికి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. కాల్పుల్లో కనీసం 30 మంది మరణించినట్లు, 200 మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై యూకేలోని కాశ్మీరీ ప్రవాసులు పాకిస్తాన్ కాన్సులేట్ ముందు నిరసన చేపట్టారు. బ్కాడ్ఫోర్డ్ సిటీలో మంగళవారం(జూన్ 09)న కాశ్మీరీ నిరసనకారులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పీఓకేలో శాంతియుతంగా జరుగుతున్న నిరసనలపై […] -
India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
India: అణు ఆయుధ విధానంలో భారత్ స్పష్టమైన మార్పు చేసినట్లు తెలుస్తోంది. భారత్ తొలిసారిగా 12 అణు వార్హెడ్లను మోహరించినట్లు స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (SIPRI) తన తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. దశాబ్ధాలుగా అణ్వాయుధాలను, వాటిని ప్రయోగించే వ్యవస్థలను వేర్వేరుగా ఉంచే విధానాన్ని భారత్ అవలంభిస్తోంది. కానీ తాజా నివేదిక ప్రకారం, భారత్ ప్రయోగించే స్థితిలో అణు ఆయుధాలను ఉంచినట్లు తెలుస్తోంది. భూగర్భ క్షిపణి స్థావరాలలో, కొత్త అణు జలాంతర్గాములలో ప్రయోగించడానికి […] -
POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
POK: పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్(POK) అట్టుడుకుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం అణిచివేతకు నిరసనగా పీఓకే ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ హక్కుల కోసం నినాదాలు చేశారు. పీఓకే పాకిస్తాన్ నుంచి విముక్తి కావడానికి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ స్వాతంత్య్రం కోసం ఆందోళనబాట పట్టారు. అయితే, ఈ ఆందోళనల్ని పాక్ ఆర్మీ, పాక్ ప్రభుత్వం అత్యంత క్రూరంగా అణిచివేస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి రిజర్వేషన్ వివాదం కారణమైంది. పాకిస్తాన్ ఆర్మీ అందోళనల్ని అణిచివేయడానికి కాల్పులు జరిపింది. […] -
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ముక్కలైంది. గత 15 ఏళ్లుగా బెంగాల్లో అధికారం చెలాయించిన మమతా బెనర్జీ, ఓడిపోయిన తర్వాత పార్టీని నిలబెట్టుకోలేకపోతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఆమెపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పటికే, తృణమూల్కు ఉన్న 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది రీటబ్రత బెనర్జీ వెనక చేరారు. తమదే అసలైన తృణమూల్ అని చెబుతున్నారు. ఇక ఎంపీల్లో కూడా తిరుగుబాటు ప్రారంభమైంది. టీఎంసీకి ఉన్న 28 మంది లోక్సభ ఎంపీల్లో 20 మంది రెబల్ […] -
INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
దాదాపు 2 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరిగింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), తమిళనాడులో డీఎంకే ఓటమి తర్వాత ఈ భేటీ జరుగుతుండటంతో ప్రాధాన్యత ఏర్పడింది. సోమవారం జరిగిన ఈ భేటీకి కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు మమతా బెనర్జీ, ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్, ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీ నుంచి సుప్రియా సూలే వంటి నేతలు హాజరయ్యారు. తమిళనాడులో కాంగ్రెస్తో విభేదాల కారణంగా డీఎంకే ఈ సమావేశాన్ని బాయ్ […] -
Kerala: “దీపం” వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
Kerala: కేరళలో ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో ముస్లిం లీగ్ ఎమ్మెల్యే ఫాతిమా తాలియా సంప్రదాయ ‘‘దీపం’’ వెలిగించడం వివాదంగా మారింది. ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్(ఐయూఎంఎల్) తొలి మహిళా ఎమ్మెల్యే ఫాతిమా ఇప్పుడు మత పెద్దల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. సున్నీ మత సంస్థ ‘‘సమస్త’’ దీపం వెలిగించడంపై అభ్యంతరం తెలిపింది. తన నియోజకవర్గమైన పెరంబరలో జరిగిన ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫాతిమా దీపం వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ […] -
China: “మనం శత్రువులం కాము”.. భారత్కు చైనా సందేశం..
China: భారత్ పట్ల చైనా తన వైఖరిని మార్చుకుంటోంది. ఇప్పుడు స్నేహం అంటూ చిలకపలుకులు పలుకుతోంది. భారత్, చైనాలు ప్రత్యర్థులు లేదా వ్యతిరేక శక్తులు కాదని, ఒకరి అభివృద్ధికి మరొకరు ముప్పుగా కాకుండా అవకాశాలుగా నిలిచే సహాకర భాగస్వాములు అని చైనా చెప్పింది. సోమవారం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాలతో రష్యాకు ఉన్న సంబంధాలను ప్రస్తావిస్తూ ఇటీవల పుతిన్ చేసిన వ్యాఖ్యల తర్వాత డ్రాగన్ కంట్రీ […] -
Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
Petrol-Diesel: ఇరాన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలోని పరిణామాలు భారత్లో ఇంధన రంగంపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ ఘర్షణ జరిగిన అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారత ఇంధన రంగాన్ని కలవరపరుస్తుంది. ఇదే కాకుండా, 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ఇతర దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. దీని వల్ల గణనీయంగా విదేశీ మారకనిల్వల్ని కోల్పోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాల గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే, పెట్రోల్లో ఇథనాల్ కలుపుతోంది. ఇటీవల దేశంలో […]
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!