Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాల స్పష్టీకరణ.
- మంత్రి మార్పు కంటే పరీక్షల వ్యవస్థ సంస్కరణలపైనే కేంద్రం దృష్టి.
- ఎన్టీఏలో లోపాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్న ప్రభుత్వం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmendra Pradhan: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్ చేస్తోంది. రాజీనామా చేస్తేనే ఉద్యమం ఆపుతామని హెచ్చరిస్తోంది. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయన రాజీనామాను కోరుతున్నారు. అప్పుడే పార్లమెంట్లో చర్చిస్తామని చెబుతున్నారు. మరోవైపు, సీజేపీ ఈ రోజు కేంద్రంతో జరిగిన చర్చల్లో ధర్మేంద్ ప్రధాన్ రాజీనామాపై తగ్గేదే లేదని చెప్పింది. కేంద్రం దీనిపై రేపటి వరకు సమయం కోరింది.
ఇదిలా ఉంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని, దీనిని సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం పరిగణించడం లేదని, రాజీనామా చేసి బాధ్యతల నుంచి పారిపోవడం వంటిదని కేంద్ర భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారు, ప్రభుత్వం తన బాధ్యత నెరవేర్చే వ్యవస్థను మెరుగుపరుస్తుందని కేంద్రం భావిస్తోంది. బీజేపీతో పాటు, కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్కు అండగా నిలుస్తున్నట్లు సమాచారం.
Also Read
- Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
- UNEP: భారత్కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
- IndiGo Plane Hits Pole: ఎయిర్పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్ను ఢీకొన్న ఫ్లైట్!
- Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్కి రెడీ!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లోని లోపాలు, సమస్యలను గుర్తిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటిపై ఒక సవివరమైన జాబితాను సిద్ధం చేస్తోందని, సమస్యల పరిష్కరించడానికి త్వరలో అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. పేపర్ లీక్ ప్రమేయం ఉన్న ముఠాలను ఇప్పటికే పట్టుకున్నారు. దర్యాప్తు సంస్థలు తమ దర్యాప్తును వేగవంతం చేశాయి. రాబోయే రోజుల్లో ఈ మాఫియా నెట్వర్క్పై కేంద్రం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. రాజీనామాల రాజకీయాలపై కాకుండా, దేశ పరీక్షా వ్యవస్థను పారదర్శకంగా, విశ్వసనీయంగా మార్చడంపైనే తమ దృష్టి ఉందని ప్రభుత్వం పేర్కొంది.
తాజావార్తలు
-
Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
-
Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్తో సైలెంట్ మోడ్లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
-
MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
-
Irumudi 2: రామ్ చరణ్తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
-
UNEP: భారత్కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!