Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- జంతర్ మంతర్లో సీజేపీ నిరసనలకు మెహబూబా ముఫ్తీ మద్దతు.
- పేపర్ లీక్, అవినీతిపై ఉద్యమాన్ని ప్రశంసించిన పీడీపీ చీఫ్.
- "దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం" అని వ్యాఖ్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సీజేపీ ఉద్యమానికి సపోర్ట్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గురువారం ఆమె నిరసనకు మద్దతు తెలిపారు. పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నిరసనల్ని రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, యువత భవిష్యత్తును కాపాడే పోరాటంగా అభివర్ణించారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. తీవ్రమైన ఎండను తట్టుకుని నిరసనలు కొనసాగిస్తున్న విద్యార్థుల్ని అభినందించారు. ఈ ఉద్యమం అవినీతి, పేపర్ లీక్లకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని ఇస్తుందని అన్నారు.
గత 12 ఏళ్లుగా దేశంలో విభజన రాజకీయాలు, అవినీతి, పేపర్ లీకులు, మహిళలపై నేరాలు పెరిగాయని ఆమె ఆరోపించారు. ఈ రోజు మన దేశంలో పిల్లల కన్నా ఆవులే ఎక్కువ సురక్షితంగా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు న్యాయవ్యవస్థపై విమర్శలు చేశారు. ఇన్ని రోజులుగా విద్యార్థుల ఉద్యమం జరుగుతున్నా వారి సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, యువత ఆందోళనల్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ అహంకారం ఎక్కువ రోజులు నిలవదని, యువత శక్తి కన్నా గొప్ప శక్తి లేదని, రాజ్యాంగాన్ని కాపాడేది యువతే అని ఆమె అన్నారు.
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?