China: చైనాలో దారుణం జరిగింది. 21 ఏళ్ల విద్యార్థి కత్తితో దాడి చేయడంతో 8 మంది మృతి చెందారు. ఈ ఘటన చైనా తూర్పు నగరమైన వుక్సీలో జరిగింది. వుక్సీలో శనివారం సాయంత్రం సమయంలో 21 ఏళ్ల విద్యార్థి కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్యల ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Donald Trump: ఖలిస్తాన్ ఉగ్రవాది, అమెరికన్ సిటిజన్ అయిన గురుపత్వంత్ సింగ్ నిజ్జర్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణతో భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారిపై కేసు నమోదు చేసిన ఫెడరల్ ప్రాసిక్యూటర్ డామియన్ విలియమ్స్ని కొత్తగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. ఇతడి స్థానంలో న్యూయార్క్లోని సదరన్ డిస్ట్రిక్ట్కి డిస్ట్రిక్ట్ అటార్నీగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) మాజీ ఛైర్మన్ జే క్లేటన్ను నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ గురువారం ప్రకటించారు
Falcon-9 Rocket: భారతదేశం తన అత్యంత అధునాతనమైన బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-20ని ప్రయోగించనుంది. దీనిని GSAT N-2 అని కూడా పిలుస్తారు. వచ్చే వారం దీనిని ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ‘‘ఫాల్కన్ 9’’ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగబోతోంది. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్కి అత్యంత సన్నిహితుడైన ఎలాన్ మస్క్కి చెందిన సంస్థతో ఇస్రో భాగస్వామ్యైంది.
Manipur Violence: హింసాత్మక ఘటనలతో మరోసారి మణిపూర్లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్లతో పాటు బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కాంగ్పోక్పి, చురచంద్పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపేశారు. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఆందోళనకారులు పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసిన ఆస్తుల్ని ధ్వంసం చేశారు
Father kills son: చదువుకునేందుకు నిరాకరించినందుకు తన 14 ఏళ్ల కొడుకుని తండ్రి హత్య చేసిన ఘటన బెంగళూర్లో జరిగింది. ఈ ఘటనపై కేఎస్ లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేశారు. తేజస్ అనే పిల్లాడు పాఠశాలకు వెళ్లడం మానేయడంతో పాటు చదువుని నిర్లక్ష్యం చేసినందు కోపంతో హత్య చేసినట్లు తెలుస్తోంది.
Election Commission: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు అయిన అమిత్ షా, రాహుల్ గాంధీలు చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం శనివారం నోటీసులు జారీ చేసింది. ఇద్దరు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించింది. బీజేపీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు రెండు రోజుల ముందు, సోమవారం లోగా తమ రెస్పాన్స్ తెలియజేయాలని ఆదేశించింది.
US-Iran: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని చంపే ప్రయత్నం చేయబోమని ఇరాన్ గత నెలలో అమెరికాకు తెలియజేసినట్లు తెలుస్తోంది. అమెరికా అధికారులు ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్తో పంచుకన్నారు. అక్టోబర్ 14న ఇరాన్ ఈ మేరకు అమెరికకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ట్రంప్కి వ్యతిరేకంగా ఏదైనా బెదిరింపులు యూఎస్ జాతీయ భద్రతకు సంబంధించిన అత్యున్నత ఆందోళన అని బైడెన్ ప్రభుత్వం ఇరాన్కి స్పష్టం చేసిందని, అలాంటి ఏ చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని యూఎస్ అధికారులు తెలిపారు.
Donald Trump: హిందువులతో పాటు మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్న బంగ్లాదేశ్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని భారతీయ అమెరికన్లు కోరుతున్నారు. ఈ మేరకు బంగ్లాదేశ్పై ఆర్థిక ఆంక్షలు విధించడంతో పాటు చర్యలు తీసుకోవాలని వచ్చే ఏడాది ఏర్పాటు కాబోతున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ని, యూఎస్ కాంగ్రెస్ని సంప్రదించడానికి భారతీయ అమెరికన్లు కృషి చేస్తున్నారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ బ్రెజిల్లో జరిగే జీ-20 సమ్మిట్ కోసం బయలుదేరారు. బ్రెజిల్ సహా గయానా, నైజీరియా దేశాల్లో పర్యటించనున్నారు. గతేడాది జీ-20 సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నైజీరియాలోలో పర్యటించబోతున్నారు.
Crime: ఉత్తర్ ప్రదేశ్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. హాపూర్ జిల్లాలో ఢిల్లీ-లక్నో హైవేపై ఈ రోజు ఎర్రటి సూట్కేస్ కనిపించింది. అనుమానం రావడంతో సూట్కేస్ ఓపెన్ చేసి చూడగా అందులో మహిళ డెడ్బాడీ ఉంది. ముందుగా ఈ సూట్కేస్ని రోడ్డుపై ప్రయాణికులు గమనించినట్లు పోలీసులు తెలిపారు.