Election Commission: అమిత్ షా, రాహుల్ గాంధీలకు ఈసీ నోటీసులు..
- ఫైనల్ స్టేజ్కి చేరిన మహారాష్ట్ర ఎలక్షన్స్..
- అమిత్ షా, రాహుల్ గాంధీలకు ఈసీ నోటీసులు..
Election Commission: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు అయిన అమిత్ షా, రాహుల్ గాంధీలు చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం శనివారం నోటీసులు జారీ చేసింది. ఇద్దరు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించింది. బీజేపీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు రెండు రోజుల ముందు, సోమవారం లోగా తమ రెస్పాన్స్ తెలియజేయాలని ఆదేశించింది.
Read Also: US-Iran: ట్రంప్ని చంపడానికి ప్రయత్నించబోం.. అమెరికాకు ఇరాన్ హామీ..
Also Read
నవంబర్ 06న ముంబైలో జరిగిన ఒక సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ‘‘మహారాష్ట్ర నుంచి అవకాశాలను, పెట్టుబడులను ఇతర రాష్ట్రాలకు దోచిపెట్టారు’’ అని అన్నారు. రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేశారని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ‘‘ రాహుల్ గాంధీ తన ప్రకటనతో మహారాష్ట్ర యువతను రెచ్చగొడుతున్నారు. ఇది జాతి ఐక్యత, సమగ్రతకు ప్రమాదకరం. ఆయన ప్రసంగం అబద్ధాలతో నిండి ఉంది. మహరాష్ట్ర గుజరాత్, ఇతర రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు, శత్రుత్వం సృష్టించేందుకు ప్రయత్నించారు.’’ అని నవంబర్ 11న ఈసీ ఎదుట బీజేపీ కంప్లైంట్ చేసింది.
నవంబర్ 12న జార్ఖండ్ ధన్బాద్లో అమిత్ షా మాట్లాడుతూ… కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు విభజన, దురుద్దేశపూరిత ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. ‘‘ అమిత్ షా తన ప్రసంగంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, దేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తొలగించాలని యోచిస్తోందని ఆరోపించారు. ’’ ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నవంబర్ 13న కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో