Venu Goapl Reddy
Author- NTV Telugu-
India-Pak tensions: ‘‘ఆహారం, నిత్యావసరాలు నిల్వ చేసుకోండి’’.. ఉద్రిక్తతల మధ్య ప్రజలకు పీఓకే ప్రధాని పిలుపు
India-Pak tensions: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పరిస్థితి తీవ్రతను మరింత పెంచారు. భారత్ తమపై దాడికి సిద్ధమవుతుందని సాక్ష్యాత్తు ఆ దేశ మంత్రులే వ్యాఖ్యానించారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాక్ సైన్యం భారత సరిహద్దుల్లో మోహరించింది. మరోవైపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) పై భారత్ దాడి చేస్తుందేమో అని పాక్ తెగ భయపడుతోంది. ఈ మేరకు ఇప్పటికే పీఓకేలోని మదర్సాలను, మతపరమైన కార్యకలాపాలను ఖాళీ చేయించింది. -
Earthquake: అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం..
Earthquake: దక్షిణ అమెరికా దేశం అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది. చిలీ, అర్జెంటీనా దక్షిన తీరాలను బలమైన భూకంపం శుక్రవారం కుదిపేసింది. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో భూకంపం నమోదైట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మరో రెండు భూ ప్రకంపనలు రికార్డ్ అయినట్లు తెలిపింది. -
Donald Trump: “హార్వర్డ్ యూనివర్సిటీ”కి ట్రంప్ బిగ్ షాక్..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసిద్ధ ‘‘హార్వర్డ్ యూనివర్సిటీ’’కి బిగ్ షాక్ ఇచ్చాడు. హార్వర్డ్కి ‘‘పన్ను మినహాయింపు’’ హోదాని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ‘‘క్యాంపస్ యాక్టివిజం’’పై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఆగ్రహంతో ఉంది. గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా ఈ క్యాంపస్ యాక్టవిజం, లెఫ్టిస్ట్ భావజాలంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతానని చెప్పారు. -
Pakistan Army: పాకిస్తాన్ ఆర్మీకి వేల కోట్లలో వ్యాపారాలు.. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా..
Pakistan Army: అన్ని దేశాలకు సైన్యం ఉంటుంది, కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం ఓ సైన్యానికి దేశం ఉందని చెప్పవచ్చు. భారత్ వంటి దేశాల్లో మిలిటరీ చీఫ్లుగా పని చేసిన వారు రిటైర్మెంట్ తర్వాత సాధాసీదా జీవితం గడుపుతారు. కానీ పాకిస్తాన్లో అలా కాదు మిలిటరీలో చేరితే జాక్పాట్ కొట్టినట్లు, ప్రభుత్వమే పదుల నుంచి వందల ఎకరాల భూమిని ఆర్మీలో పనిచేసిన వారికి ఇస్తుంది. -
UP: అక్రమ మదర్సాలు, మసీదులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
UP: ఉత్తర్ ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అక్రమ మసీదులు, మదర్సాలపై ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా ఇండియా- నేపాల్ సరిహద్దుల్లోని ఉన్నవాటిపై అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. జిల్లా పాలనాధికారులు, స్థానిక పోలీసులు, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) వంటి కేంద్ర దళాల సమన్వయంతో శుక్రవారం పెద్ద ఎత్తున యాక్షన్ చేపట్టింది. -
Pahalgam Terror Attack: లష్కరే, జైషే మహ్మద్, పాకిస్తాన్ సంబంధాలు.. నిఘా పత్రాల్లో సంచలన విషయాలు..
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది టూరిస్టులు మరణించారు. పాకిస్తాన్కి చెందిన లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ దాడి చేసింది. -
Pakistan: పాకిస్తాన్కి విదేశీ విమాన సంస్థల షాక్.. ప్రతీ నెలా మిలియన్ డాలర్ల నష్టం..
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో అనే భయంతో పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత వైమానిక సంస్థలకు మూసేసింది. -
Shehbaz Sharif: పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ యూట్యూబ్ ఛానెల్ బ్లాక్..
Shehbaz Sharif: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరేతోయిబాకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రటించుకున్నారు. ఈ దాడి వెనక పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కర్ ప్రయేయాన్ని భారత దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. ఈ నేపథ్యంలో, భారత్ పాకిస్తాన్పై భారీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దౌత్య చర్యల్లో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. -
India Pakistan: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లకు షాక్ ఇచ్చిన భారత్..
India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్కి భారత్ వరస షాక్లు ఇస్తోంది. పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు నది, దాని ఉపనదులకు సంబంధించిన ‘‘సింధు జలాల ఒప్పందం’’ని భారత్ రద్దు చేసుకుంది. ఇక పాకిస్తాన్ సెలబ్రిటీలపై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. భారత్లో ప్రజాదరణ ఉన్న పాక్ క్రికెటర్లు, సెలబ్రిటీలు, సినీ యాక్టర్లకు చెందిన సోషల్ మీడియా అకౌంట్లను, యూట్యూబ్ ఛానెళ్లను ఇండియా బ్లాక్ చేస్తోంది. -
Indian Air Force: గంగా ఎక్స్ప్రెస్ వేపై యుద్ధ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్.. ఉద్రిక్తల వేళ ఐఏఎఫ్ సత్తా..
Indian Air Force: భారతదేశంలో మరో రోడ్ ‘రన్ వే’ని ఈ రోజు ప్రారంభించనున్నారు. భారత వైమానిక దళం ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్పూర్ జిల్లాలోని గంగా ఎక్స్ప్రెస్వే పై నిర్మించిన 3.5 కి.మీ పొడవైన ఎయిర్ స్ట్రిప్ని శుక్రవారం ప్రారంభించనుంది. ఇది దేశ రక్షణను మరింత పెంచుతుంది. అధునాతన లైటింగ్, నావిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్ స్ట్రిప్పై యుద్ధ విమానాలు పగలు, రాత్రి ల్యాండింగ్ చేయవచ్చు. భారత్లో ఇలాంటి సదుపాయం ఉన్న ఎయిర్స్ట్రిప్లో ఇదే […]
తాజావార్తలు
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
-
Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!