T20 World Cup: ఆడితే భారత్లోనే, లేదంటే స్కాట్లాండ్ను తీసుకుంటాం.. బంగ్లాకు ఐసీసీ వార్నింగ్..
- ఆడితే భారత్లోనే, లేదంటే స్కాట్లాండ్ను తీసుకుంటాం..
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ వార్నింగ్..
- బంగ్లా ప్రతిపాదనకు వ్యతిరేకంగా బోర్డ్ ఓటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: T20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ నకరాలకు చేస్తోంది. భారత్లో ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చెబుతోంది. తమ మ్యాచ్లను భారత్ నుంచి తరలించాలని ఐసీసీని అభ్యర్థించింది. తమను ఐర్లాండ్తో స్వాప్ చేయాలని కోరింది. అయితే, షెడ్యూల్ను మార్చేది లేదని తమకు హామీ వచ్చిందిన ఐర్లాండ్ స్పష్టం చేసింది. ఐర్లాండ్ తన లీగ్ మ్యాచుల్ని శ్రీలంకలో ఆడుతోంది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ అభ్యర్థను ఐసీసీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. బోర్డు ఓటింగ్లో ఈ ప్రతిపాదనకు 14-2 ఓట్ల తేడాతో వీగిపోయినట్లు సమచారం. భారత్లో ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరిస్తే ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ను తొలగించి, దాని స్థానంలో మరో జట్టును తీసుకుంటామని ఐసీసీ బంగ్లా క్రికెట్ బోర్డును హెచ్చరించింది.
ఓటింగ్ తర్వాత, ఈ ఫలితాలనున బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేయాలని ఐసీసీ బంగ్లా బోర్డును కోరింది. బంగ్లాదేశ్ భారత్లో ఆడటానికి నిరాకరిస్తే, దాని స్థానంలో స్కాట్లాండ్ను తీసుకుంటామని ఐసీసీ స్పష్టం చేసింది. తుది నిర్ణయాన్ని తెలియజేయడానికి బంగ్లాదేశ్కు మరో రోజు గడువు ఇచ్చింది. బుధవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ తన వైఖరికి కట్టుబడి ఉంటే, దాని స్థానంలో మరో జట్టును తీసుకురావడానికి మెజారిటీ డైరెక్టర్లు అనుకూలంగా ఓటు వేశారు. హాజరైన 15 మంది డైరెక్టర్లలో, కేవలం పీసీబీ మాత్రమే బీసీబీకి మద్దతు ఇచ్చిందని తెలిసింది. టోర్నమెంట్కు సహ-ఆతిథ్యమిస్తున్న శ్రీలంకలో ఆడాలన్న బంగ్లాదేశ్ అభ్యర్థనకు తాము మద్దతు ఇస్తున్నామని పేర్కొంటూ పీసీబీ మంగళవారం ఐసీసీకి, ఇతర బోర్డులకు లేఖ రాసిన తర్వాత ఈ సమావేశం జరిగింది.
Also Read
- గోల్ చేసిన వెంటనే ఏడ్చేసిన Lionel Messi.!
- FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్పై 3-1 తేడాతో.!
- Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
- FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్... ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ కోల్కతాలో మూడు లీగ్ మ్యాచ్లు, ముంబైలో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతా కారణాలను చూపుతూ, తమ వేదికను శ్రీలంకకు మార్చాలని కోరింది. ప్రస్తుతం, బంగ్లాదేశ్ వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లాండ్, నేపాల్లతో పాటు గ్రూప్ సిలో ఉంది. ఒకవేళ బంగ్లాదేశ్ వైదొలిగితే, స్కాట్లాండ్ గ్రూప్ సిలో వారి స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని వారాలుగా ఈ ప్రతిష్టంభన నెలకొంది. షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని ఐసీసీ చెబుతుంటే, తాము భారత్లో ఆడబోమని బంగ్లా స్పష్టం చేస్తో్ంది.
ఐపీఎల్ టీం కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్) నుంచి బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ ను తీసేసిన తర్వాత వివాదం మొదలైంది. బంగ్లాలో హిందువుల హత్యలను భారత ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేకేఆర్లోకి ముస్తాఫిజుర్ను తీసుకోవడంపై వివాదం మొదలైంది.
తాజావార్తలు
-
Sharwanand : మళ్ళీ సంక్రాంతిపై కన్నేసిన శర్వా
-
Melodi: ‘‘ఇన్స్టాలో మనమే ఫేమస్ కపుల్’’.. జీ7లో స్పెషల్ అట్రాక్షన్గా మోడీ-మెలోనీ
-
“Aadarsha Kutumbam” కి రీషూట్లు! జాగ్రత్తపడ్డ త్రివిక్రమ్
-
Twisha Sharma: ఇంకా బయటకు రాని ట్విషా శర్మ రెండో పోస్ట్మార్టం రిపోర్ట్.. కారణమిదేనా?
-
Vijay Deverakonda: దేవరకొండకు క్రికెట్ అసోసియేషన్ షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!