L&T Chairman: సంక్షేమ పథకాల వల్లే కార్మికులు దొరకడం లేదు..
- మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎల్ అండ్ టీ ఛైర్మన్..
- సంక్షేమ పథకాల వల్లే ఇండియాలో కార్మికుల కొరత..
- గతంలో వారానికి 90 గంటలు పనిచేయాలన్న ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
L&T Chairman: ఇటీవల వారానికి 90 గంటలు పని చేయాలని ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సాధారణ ప్రజలతో పాటు మిగతా పారిశ్రామికవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, తాజాగా మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మంగళవారం చెన్నైలో జరిగిన మిస్టిక్ సౌత్ గ్లోబల్ లింకేజెస్ సమ్మిట్ 2025లో శ్రీ సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల వల్ల కార్మికులు అందుబాటులో ఉండటం లేదని, వారి కొరత ఏర్పడిందని చెప్పారు. ఇప్పుడు ఇది కొత్త చర్చకు దారి తీసింది.
ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుబాటులో ఉండటం వల్ల కార్మికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదని, నిర్మాణ రంగంలో కార్మికుల్ని పొందడం కష్టంగా మారిందని చెప్పారు. ఉపాధి హామీ, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు, జన్ ధన్ ఖాతాలు వంటి పథకాలు కార్మికుల సమీకరణను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. ‘‘అవకాశాల కోసం కార్మికులు వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. బహుశా వారి స్థానిక ఆర్థిక వ్యవస్థ బాగానే ఉండొచ్చు. బహుశా దీనికి వివిధ ప్రభుత్ పథకాలు కారణం కావచ్చు’’ అని అన్నారు. కార్మికుల కొరత భారతదేశ మౌలిక సదుపాయాల నిర్మాణంపై ప్రభావం చూపుతోందని చెప్పారు.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
Read Also: PM Modi: ఫ్రాన్స్లో కొనసాగుతున్న మోడీ టూర్.. మార్సెయిల్లో భారతీయ సైనికులకు ప్రధాని నివాళి
భారత్ వలసల్లో విచిత్రమైన సమస్యల్ని ఎదుర్కుంటోందని, ఎల్ అండ్ టీకి 4 లక్షల మంది కార్మికుల అవసరం అయితే, ఉద్యోగులు ఎప్పుడు మానేస్తారో తెలియక 16 లక్షల మందిని నియమించుకున్నామని సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కార్మికుల వేతనాలను సవరించాల్సిన అవసరాన్ని లేవనెత్తారు. మధ్యప్రాచ్యంలో కార్మికుల సంఖ్య భారత్ కన్నా మూడు నుంచి 3.5 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు.
గతంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆదివారాలు కూడా పనిచేయాలని కోరారు. ఇంట్లో కూర్చోని ఏం చేస్తారు..? ఎంత సేపు నీ భార్యను చూస్తూ ఉంటారు? ఆఫీసుకు వెళ్లి పనిచేయండి అని, ఆదివారాలు కూడా పనిచేయాలని ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఆనంద్ మహీంద్రా, అదార్ పూనావాలా, ఐటీసీ సంజీవ్ పూరి వంటి వారు ఉత్పాదకత ముఖ్యమని ఎన్ని గంటలు పనిచేశామనే కాదని అన్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ఉండాలని చెప్పారు. మరోవైపు 70 లేదా 90 గంటలకు వర్క్ అవర్స్ని పెంచే అవకాశం లేదని ప్రభుత్వం గత వారం పార్లమెంట్కి తెలిపింది. వారానికి 60 గంటలకు పైగా పనిచేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆర్థిక సర్వేలో కేంద్రం చెప్పింది.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!