Venu Goapl Reddy
Author- NTV Telugu-
IMF meeting: పాకిస్తాన్కి ఐఎంఎఫ్ ఆర్థిక ప్యాకేజీ ఇవ్వొద్దు.. ఓటింగ్కి దూరంగా భారత్..
IMF meeting: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పాకిస్తాన్కి అందించే బెయిలౌట్ ప్యాకేజీని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. గతంలో పాకిస్తాన్కి ఇచ్చిన రుణాలను దుర్వినియోగం చేసిందని, భారత్ తన ఆందోళనను వ్యక్త పరిచింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఐఎంఎఫ్ నిధులను దుర్వినియోగం చేస్తుందని చెప్పింది. పాకిస్తాన్ భారీ రుణభారం, ఆర్థిక వ్యవస్థల్లో పాక్ ఆర్మీ జోక్యాన్ని భారత్ ఐఎంఎఫ్ ముందు లేవనెత్తింది. ప్రపంచ ఆర్థిక విధానాలలో నైతిక పరిశీలనల అవసరాన్ని భారతదేశం నొక్కి చెప్పింది. -
India Pakistan War: 100కి పైగా పాకిస్తాన్ డ్రోన్లను కూల్చేసిన భారత్..
India Pakistan War: పాకిస్తాన్ తన తీరు మార్చుకోవడం లేదు. భారత్ చేతిలో చావు దెబ్బలు తింటున్నా.. యుద్ధానికే సిద్ధపడుతోంది. వరసగా రెండో రోజు కూడా డ్రోన్లతో భారత భూభాగాలపై దాడులు చేసేందుకు ప్రయత్నించింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు యత్నించింది. ఈ దాడులను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది. -
India Pak War: భారత్ పాకిస్తాన్పై విరుచుకుపడుతుంటే, బంగ్లాదేశ్లో భయం మొదలైంది..
India Pak War: పహల్గామ్ ఉగ్రవాద ఘటనకు భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద కార్యాలయాలను, వాటి శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 100కు మించి ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం, పాక్ భారత్పై దాడికి పాల్పడింది. దీని తర్వాత మరోసారి ఇండియా -
Nawaz Sharif: భారత్తో ఉద్రిక్తత.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ కీలక సలహా..
Nawaz Sharif: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం సాయంత్ర పాకిస్తాన్ వందలాది డ్రోన్లతో, క్షిపణులతో భారత్పై అటాక్ చేయడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ తరహా పరిస్థితులు నెలకున్నాయి. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కి, ఆయన సోదరుడు, మాజీ ప్రధాని అయిన నవాజ్ షరీఫ్ కీలక సూచనలు చేశారు. పెరుగుతున్న ఉద్రిక్తతల్ని తగ్గించుకోవడానికి దౌత్యపరమైన విధానం అవసరమని సలహా ఇచ్చినట్లు దిఎక్స్ప్రెస్ […] -
Indian forces: BSF, CISF, ITBP, SSB దళాల మధ్య తేడాలు ఏంటి.. ఏ సరిహద్దును ఎవరు కాపాడుతారు..?
Indian forces: భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హోం మంత్రిత్వ శాఖ కింద వివిధ రకాల పారామిలిటరీ దళాలు ఉంటాయి. అస్సాం రైఫిల్స్ (AR), సరిహద్దు భద్రతా దళం (BSF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమా బల్ (SSB) దళాలు సరిహద్దు రక్షణ దళాలుగా పనిచేస్తాయి. ఇవి మనదేశంలోని సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తాయి. వీటిలో పాటు సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ […] -
India Pakistan war: ఆ డ్రోన్లు టర్కీకి చెందినవి.. పాక్ దాడిపై కల్నల్ సోఫియా ఖురేషీ..
India Pakistan war: గురువారం రాత్రి పాకిస్తాన్ జరిపిన డ్రోన్ దాడుల గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించింది. నిన్న రాత్రి జరిగిన దాడిలో భారత సైనిక స్థావరాలను టార్గెట్ చేసినట్లు కల్నర్ సోషియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు. -
Asim Munir: ‘‘యుద్ధ పిపాసి, జిహదీ జనరల్’’.. పాక్ ఆర్మీ చీఫ్ గురించి కీలక విషయాలు..
Asim Munir: ఇండియా, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎక్కడ..? అనే ప్రశ్న అందరితో మెదులుతోంది. మీడియాలో వస్తు్న్న వార్తల ప్రకారం, ఆసిమ్ మునీర్ని ఆర్మీ చీఫ్ పదవి నుంచి తొలగించి, అరెస్ట్ చేశారనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ మొత్తం ఉద్రిక్తతకు కారణం మాత్రం ఆసిమ్ మునీరే. ఆయన చేసిన విద్వేష ప్రసంగం తర్వాత పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. హిందూ-ముస్లింలు వేరని హిందువుల పట్ల, భారత్ పట్ల ద్వేషాన్ని వెల్లగక్కాడు. -
India Pakistan War: 24 నగరాలే లక్ష్యంగా, 500 డ్రోన్లతో పాక్ దాడి.. తిప్పికొట్టిన భారత్..
India Pakistan War: గురువారం రాత్రి దాయాది దేశం పాకిస్తాన్, భారత్పై దుష్ట పన్నాగానికి పాల్పడింది. అయితే, భారత్ తన గగనతల రక్షణ వ్యవస్థలతో ఈ దాడిని తిప్పికొట్టింది. మే 8 రాత్రి, 8 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య పాకిస్తాన్ ఏకంగా భారత్పైకి 500 డ్రోన్లతో అటాక్ చేసినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లోని 24 నగరాలను లక్ష్యంగా చేసుకుని చిన్న డ్రోన్లను మోహరించిందని తెలిసింది. -
S-400 sudarshan chakra: మనోహర్ పారికర్ సార్, మీరు లేకున్నా.. మీ నిర్ణయం భారత్ని రక్షించింది.
S-400 sudarshan chakra: పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణుల నుంచి భారత్ని ‘‘S-400 సుదర్శన చక్ర’’ క్షిపణి రక్షణ వ్యవస్థ కాపాడుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఇది ఒకటి. అత్యంత ఖచ్చితత్వంతో శత్రువుల నుంచి వస్తున్న వైమానిక దాడులను తిప్పికొడుతుంది. గురువారం రాత్రి సమయంలో పాకిస్తాన్ దాడిని కూడా ఈ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ పనితీరుపై ఇప్పుడు అందరు ప్రశంసలు కురిపిస్తాను. కానీ, […] -
India Pakistan War: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య, రక్షణ మంత్రిత్వ శాఖ సంచలన ఆదేశాలు..
India Pakistan War: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ సంచలన ఆదేశాలను జారీ చేసింది. భారతదేశ సహాయక సైనిక దళం అయిన టెరిటోరియల్ ఆర్మీని యాక్టివేట్ చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. మొత్తం 32 ఇన్ఫాంట్రీ బెటాలియన్లలో 14 బెటాలియన్లను యాక్టివ్ చేసింది.
తాజావార్తలు
-
Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
-
Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
-
Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
-
Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!