Assam: అస్సాంకు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు.. అంబానీ, అదానీ పోటీపడి మరీ ఇన్వెస్ట్మెంట్..
- అస్సాం రాష్ట్రానికి పెట్టుబడుల వరద..
- చెరో రూ. 50,000 కోట్ల పెట్టుబడుల్ని పెట్టనున్న అంబానీ, అదానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: అస్సాంకు పెట్టుబడుల వరద పారింది. గౌహతిలో జరిగిన అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్లో వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. దేశంలో దిగ్గజ పారిశ్రామికవేత్తలుగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ అస్సాంలో ఒక్కొక్కరు రూ. 50,000 కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించారు. ఇద్దరు కలిసి రూ. 1 లక్ష కోట్లను అస్సాంలో పెట్టుబడిగా పెట్టనున్నారు.
Read Also: Maha Shivaratri 2025: మహాశివరాత్రి నాడు జాగరణ, ఉపవాసం ఎలాంటి వారు చేయకూడదు?
Also Read
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
మంగళవారం జరిగిన సదస్సులో అదానీ మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రంలో రూ. 50,000 కోట్ల పెట్టుబడులను పెట్టబోతున్నట్లు చెప్పారు. ఇండియా ఆర్థిక వృద్ధిలో పెట్టుబడిదారుల శిఖరాగ్ర సమావేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ముఖేష్ అంబానీ కూడా రానున్న 5 ఏళ్లలో అస్సాంలో 50,000 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పారు. రాష్ట్రంలో యువత సాంకేతిక, ఇతర రంగాల్లో పురోగమిస్తున్నందున, AI – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరలో ‘అస్సాం ఇంటెలిజెన్స్’కు నిలయంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ సమ్మి్ట్కి దేశంలోని అగ్రగామి పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకారం.. రాష్ట్ర మంత్రి వర్గం ఆదివారం రోజు రూ. 1.22 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనల్ని ఆమోదించింది. ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని మోడీ సోమవారం గౌహతి చేరుకుని, టీ తెగకు చెందిన దాదాపు 9000 మంది కళాకారులు పాల్గొన్న ‘‘ఝుముర్’’ డ్యాన్స్ ప్రదర్శనకు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
-
Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
ట్రెండింగ్
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!