Assam: అస్సాంకు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు.. అంబానీ, అదానీ పోటీపడి మరీ ఇన్వెస్ట్మెంట్..
- అస్సాం రాష్ట్రానికి పెట్టుబడుల వరద..
- చెరో రూ. 50,000 కోట్ల పెట్టుబడుల్ని పెట్టనున్న అంబానీ, అదానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: అస్సాంకు పెట్టుబడుల వరద పారింది. గౌహతిలో జరిగిన అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్లో వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. దేశంలో దిగ్గజ పారిశ్రామికవేత్తలుగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ అస్సాంలో ఒక్కొక్కరు రూ. 50,000 కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించారు. ఇద్దరు కలిసి రూ. 1 లక్ష కోట్లను అస్సాంలో పెట్టుబడిగా పెట్టనున్నారు.
Read Also: Maha Shivaratri 2025: మహాశివరాత్రి నాడు జాగరణ, ఉపవాసం ఎలాంటి వారు చేయకూడదు?
Also Read
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
- Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
- Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే.."కాక్రోచ్ జనతా పార్టీ" ఫ్లాప్ షో..
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
మంగళవారం జరిగిన సదస్సులో అదానీ మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రంలో రూ. 50,000 కోట్ల పెట్టుబడులను పెట్టబోతున్నట్లు చెప్పారు. ఇండియా ఆర్థిక వృద్ధిలో పెట్టుబడిదారుల శిఖరాగ్ర సమావేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ముఖేష్ అంబానీ కూడా రానున్న 5 ఏళ్లలో అస్సాంలో 50,000 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పారు. రాష్ట్రంలో యువత సాంకేతిక, ఇతర రంగాల్లో పురోగమిస్తున్నందున, AI – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరలో ‘అస్సాం ఇంటెలిజెన్స్’కు నిలయంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ సమ్మి్ట్కి దేశంలోని అగ్రగామి పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకారం.. రాష్ట్ర మంత్రి వర్గం ఆదివారం రోజు రూ. 1.22 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనల్ని ఆమోదించింది. ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని మోడీ సోమవారం గౌహతి చేరుకుని, టీ తెగకు చెందిన దాదాపు 9000 మంది కళాకారులు పాల్గొన్న ‘‘ఝుముర్’’ డ్యాన్స్ ప్రదర్శనకు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
-
India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
-
Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!