Venu Goapl Reddy
Author- NTV Telugu-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
Fake Condoms: చైనాలో ఏ బ్రాండ్ వస్తువుకైనా నకిలీ లభిస్తుంటాయి. అంతగా ఆ దేశం ప్రతీ వస్తువును కాపీ కొడుతుంది. మొబైల్ ఫోన్ల దగ్గర నుంచి బ్రాండెడ్ దుస్తుల వరకు ప్రతీది కాపీ సరకు చైనాలో లభ్యమవుతుంది. చివరకు ‘‘కండోమ్’’లను కూడా డ్రాగన్ కంట్రీ వదలడం లేదు. ఏకంగా 2 లక్షల నకిలీ కండోమ్లు యూరప్లో పట్టుబడ్డాయమి. కఠినమైన భద్రతా నిబంధనల్ని తప్పించుకునేందుకు, ఈ కండోమ్లను ఆట వస్తువులుగా మార్చి, మార్కెట్ చేశారు. ఇలాంటి కండోమ్లు వాడితే […] -
Pakistan: టెంపోలో శవపేటికలు.. పాకిస్తాన్ పోలీసుల దుస్థితిపై తీవ్ర విమర్శలు
Pakistan: పాకిస్థాన్లోని బలూచిస్తాన్లో తిరుగుబాటుదారుల దాడిలో మరణించిన పోలీసుల సంఖ్య 42కు పెరిగింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాక్ సైనికులు, పోలీసుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద దాడి ఇవే. ఈ దాడిలో ముందు 9 మంది పోలీసులు మరణించినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. అయితే, బీఎల్ఏ తిరుగుబాటుదారులు వీరిలో చాలా మందిని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు మరణించిన వారి సంఖ్య నెమ్మదిగా బయటకు వస్తోంది. మరోవైపు, ఈ దాడిలో 54 మంది […] -
TMC Crisis: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ. 440 కోట్లు ఫ్రీజ్..
TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం పెరుగుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా టీఎంసీకి చెందిన రూ. 440.42 కోట్ల నిధులు ఉన్న మూడు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖతాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫ్రీజ్ చేసింది. పార్టీ నిధుల ద్వారా భారీ స్థాయిలో అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో భాగంగా ఢిల్లీలోని ఐదు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. ఇవన్నీ విమానయానరంగంలో పనిచేస్తున్న కేర్వెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు […] -
USA: అమెరికాలో భార్యను హత్య చేసిన తెలంగాణ టెక్కీ.. జీవితఖైదు పడే అవకాశం
USA: అమెరికాలో టెక్కీగా పనిచేస్తున్న తెలంగాణ వ్యక్తిపై హత్య కేసు నమోదైంది. తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అవినాష్ నార్నే(30), 27 ఏళ్ల భార్య రాజిత సబ్బినేనిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్టోబర్ 2025లో రాజిత మరణించింది. భారతదేశంలో వేరే యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్న అవినాష్, పథకం ప్రకారం భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అవినాష్, తన భార్య మరణించిన తర్వాతి రోజే ఆమె డెడ్బాడీ ఫోటోలను ప్రియురాలికి పంపినట్లు అంగీకరించాడని ఛార్జిషీట్ను […] -
Sabang Port: మోదీ వ్యూహంతో చైనాకు చెక్.. సబాంగ్ పోర్టు భారత్కు ఎందుకు కీలకం?
Sabang Port: ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. ఏ దేశాధినేత ఇవ్వని విధంగా మోడీకి ఘన స్వాగతం పలికింది. ఆ దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియోంటో భారత ప్రధాని పర్యటనకు ఎనలేని ప్రాముఖ్యత ఇచ్చారు. రెండు దేశాలు రక్షణ, వాణిజ్యం, ఆర్థిక విషయాల్లో సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. అయితే, ఇప్పుడు ఒక ఒప్పందం మాత్రం చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అదే ‘‘సబాంగ్ పోర్టు’’ ఒప్పందం. వెహ్ ద్వీపంలో ఉన్న ఈ పోర్టును భారత్-ఇండోనేషియాలు కలిసి […] -
Nepal: 25 మందిని చంపిన ‘‘కిల్లర్ ఏనుగు’’.. ఒకే కుటుంబంపై రెండుసార్లు దాడి..
Nepal: నేపాల్లో ఒక ఏనుగు 14 ఏళ్లుగా బీభత్సం సృష్టిస్తోంది. చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలోని జగత్పూర్ ప్రాంతంలో 25 ఏళ్ల మహిళ, ఆమె 4 ఏళ్ల కుమారుడిని తొక్కి చంపింది. దీనిని నేపాల్లో అత్యంత ప్రమాదకరమైన ‘‘కిల్లర్ ఏనుగు’’గా అధికారులు పరిగణిస్తారు. ఈ ఏనుగు ఇప్పటి వరకు 25 మందిని చంపింది. దాడి తర్వాత ఈ ఏనుగు అడవిలోకి పారిపోయింది. అటవీ శాఖ ఏనుగును పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. 2012లో ఇదే కుటుంబానికి చెందిన తల్లిదండ్రుల్ని ఈ […] -
Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
Bengaluru: నిత్యం ట్రాఫిక్తో రద్దీగా ఉండే బెంగళూర్ రోడ్డుపైకి ఊహించని అతిథి వచ్చింది. రోడ్డు మధ్యలో పగడ విప్పిన నాగుపాము ఏకంగా 30 నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్కు కారణంమైంది. నగరంలోని ప్యాలెస్ రోడ్డుపై పడగ విప్పి కనిపించడంతో వాహనాదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక వ్యక్తి.. “నిన్న బెంగళూరు ట్రాఫిక్కు సరికొత్త VIP కలుసుకుంది. ప్యాలెస్ […] -
Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
Tamil Nadu: మతం మార్చుకున్న వెనబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కొనసాగించే విషయంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టు దీనిపై ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. 2024 మార్చిలో అప్పటి డీఎంకే ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. బీసీ (BC), ఎంబీసీ (MBC), డీనోటిఫైడ్ కమ్యూనిటీలు (DNC), షెడ్యూల్డ్ కులాల (SC)కు చెందిన వ్యక్తులు హిందూమతం నుంచి ఇస్లాంలోకి మారిన వారికి బ్యాక్వర్డ్ క్లాస్ […] -
Microsoft: ‘‘ఇది ఆరంభం మాత్రమే’’.. ఉద్యోగుల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ బాంబ్..
Microsoft: ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 4800 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 2.1 శాతం. పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కారణంగా ఉద్యోగుల తొలగింపు జరిగిందే వాదన ఉంది. ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు మెటా, అమెజాన్, గూగుల్ వంటి కంపెనీలు కూడా వరసగా తన ఉద్యోగులకు లేఆఫ్స్ ఇస్తున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ హెచ్ ఆర్ హెడ్ అమీ కోల్మన్ ఉద్యోగులకు పంపిన ఒక ఇంటర్నల్ ఈమెయిల్ సంచలనంగా మారింది. […] -
Nijjar killing: ఖలిస్తానీ నిజ్జర్ హత్య భారత్ పాత్ర లేదు.. కెనడా సంచలన వ్యాఖ్యలు..
Nijjar killing: ఖలిస్తానీ ఉగ్రవాది హర్డీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, భారత్ మధ్య దౌత్యవివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. 2023లో సర్రే ప్రాంతంలో ఇతను హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని అప్పటి ప్రధాని జస్టిన్ టూడో సంచలన ఆరోపణలు చేయడంతో రెండు దేశాల మధ్య దౌత్య వివాదం మొదలైంది. కెనడా ఆరోపణలకు అంతే ధీటుగా భారత్ స్పందిస్తూ.. ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లకు కెనడా ప్రధాన స్థావరంగా మారిందని విమర్శించింది. ఈ […]
తాజావార్తలు
-
Ellamma: సంగీత దర్శకుడు కాదు.. ఇప్పుడు హీరో డీఎస్పీ!.. అదిరిపోయిన ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్
-
King100: నాగ్ 100వ సినిమాకు డీఎస్పీ ఎంట్రీ.. అంచనాలు పెంచిన క్రేజీ కాంబో
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Jasprit Bumrah: బుమ్రాకు ఏమైంది..? ఎందుకు సిరీస్ నుంచి దూరమయ్యాడు..? కారణం ఇదే..
-
Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?