R Sreelekha: తిరువనంతపురం బీజేపీ మేయర్గా శ్రీలేఖ.? ఇంతకీ ఎవరు ఈమె..?
- కేరళ రాజధానిలో బీజేపీ పాగా..
- తిరువనంతపురం కార్పొరేషన్ కైసవం..
- మేయర్గా మాజీ డీజీపీ ఆర్ శ్రీలేఖ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R Sreelekha: కేరళలో కమల వికాసానికి నిదర్శనం రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ కైవసం. వామపక్ష, కాంగ్రెస్ రాజకీయాలకు కేంద్రంగా ఉండే కేరళలో, బీజేపీ రాజధానిని గెలుచుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. 45 ఏళ్ల నిరంతర సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి పాలనకు బీజేపీ ముగింపు పలికింది. ఇప్పుడు, త్రివేండ్రం మేయర్గా బీజేపీ వ్యక్తి రాబోతున్నారు. అయితే, మేయర్ రేసులో కేరళ మాజీ ఐపీఎస్ అధికారిణి, 2020లో డీజీపీగా పదవీ విమరణ చేసిన ఆర్ శ్రీలేఖ ముందు వరసలో ఉన్నారు. శాస్తమంగళం డివిజన్లో భారీ మెజారిటీతో గెలిచారు. 64 ఏళ్ల శ్రీలేఖనే త్రివేండ్రానికి కాబోతున్న తొలి బీజేపీ మేయర్ అని తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు బీజేపీ మేయర్ ఎవరు అవుతారు అనేది స్పష్టంగా చెప్పకున్నా, శ్రీలేఖనే తొలి ప్రాధాన్యత అని తెలుస్తోంది.
అయితే, ఈ విషయంపై మేయర్ ఎన్నికపై బీజేపీ అధిష్టానానిదే తుది నిర్ణయమని ఆమె చెబుతున్నారు. శాస్తమంగళంలో ఇంత మెజారిటీలో ఇప్పటి వరకు ఎవరూ గెలించింది లేదని, ప్రజలు ఇచ్చిన తీర్పుకు ధన్యవాదాలు తెలిపారు. నా అభ్యర్థిత్వాన్ని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ వ్యతిరేకించినా ప్రజలు తనకు అండగా నిలిచారని అన్నారు.
Also Read
- Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
- Maharashtra: "ఇది కదా విశ్వాసం అంటే".. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
- Food Inflation 2026: వంటగది బడ్జెట్కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
- DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
శనివారం ఓట్ల లెక్కింపు జరిగినప్పుడు, 101 మంది సభ్యులున్న తిరువనంతపురం కార్పొరేషన్లో బీజేపీ 50 వార్డులను గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 29 స్థానాలను, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 19 స్థానాలను గెలుచుకున్నాయి. రెండు వార్డులను స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్నారు.
Read Also: Startup Journey: సాప్ట్ వేర్ జాబ్ వదిలేసి… దోశల వ్యాపారంలోకి వచ్చిన యువకుడు
పోలీస్ నుంచి మేయర్ అభ్యర్థిగా..
తిరువనంతపురంలో పుట్టి పెరిగిన శ్రీలేఖ, జనవరి 1987లో కేరళ మొదటి మహిళా ఐపీఎస్ అధికారిణిగా నిలిచారు. 30 ఏళ్ల కెరీర్లో అనేక జిల్లాలో ఆమె పనిచేశారు. సీబీఐ, కేరళ క్రైమ్ బ్రాంచ్, విజిలెన్స్, ఫైర్ ఫోర్స్, మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్, జైళ్ల శాఖతో సహా కీలక ఏజెన్సీలలో పనిచేశారు. 2017లో డీజీపీగా పదొన్నాతి పొందారు. ఈ హోదా పొందిన తొలి కేరళ మహిళా అధికారిగా రికార్డ్ క్రియేట్ చేశారు. సీబీఐలో పనిచేస్తున్న సమయంలో, ఆమె భయం లేకుండా అనేక దాడులు, అవినీతి వ్యతిరేక చర్యలకు తీసుకున్నారు. దీంతో ఆమెకు ‘‘ రైడ్ శ్రీలేఖ’’ అనే మారుపేరు సంపాదించుకున్నారు. 2020లో పదవీ విరమణ చేశారు.
మలయాళ స్టార్ హీరోయిన్పై 2017లో లైంగిక దాడి కేసులో నటుడు దిలీప్ తప్పుగా ఇరికించారని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల, కాంగ్రెస్ నుండి బహిష్కరించబడిన నాయకుడు రాహుల్ మమ్కూటత్తిల్పై లైంగిక వేధింపుల ఫిర్యాదు దాఖలు చేయడంలో జరిగిన జాప్యాన్ని ప్రశ్నించి ఆమె వివాదానికి తెరలేపారు. అక్టోబర్ 2024లో బీజేపీ చేరిన శ్రీలేఖ కేరళలో కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమయ్యారు.
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!