PM Modi: పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్పందించడానికి భారత త్రివిధ దళాలకు పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చారు. ప్రధాని మోడీ నివాసంలో జరిగిన అత్యున్నత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని మోడీ ఆదేశించారు.
Vaccination: వైద్యారోగ్య చరిత్రలో ‘‘వ్యాక్సిన్’’ అనేది అద్భుత సృష్టిగా చెప్పవచ్చు. ప్రాణాంతక వ్యాధుల నుంచి టీకాలు ప్రజల్ని కాపాడుతున్నాయి. పుట్టిన ప్రతీ బిడ్డకు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ కుడి చేతికి వేస్తే మంచిదా.? ఎడమ చేతికి వేస్తే మంచిదా..? అనే దానిపై ఆస్ట్రేలియన్ పరిశోధకులు రీసెర్చ్ చేశారు. ‘‘వ్యాక్సిన్ మొదటి డోస్ ఏ చేతికి ఇస్తారో, బూస్టర్ డోస్ కూడా అదే చేతికి ఇస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి’’ అని ఈ రీసెర్చ్లో వెల్లడించారు.
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంది. రెండు దేశాలు కూడా యుద్ధానికి సిద్ధమయ్యేందుకు అవసరమైన మిలిటరీ ఎక్సర్సైజులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ ఉగ్రవాద దాడిపై పలు దేశాలు స్పందించాయి. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు భారతదేశానికి మద్దతు పలికాయి. ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, ఈ విషయంలో భారత్కి తాము మద్దతు తెలుపుతామని చెప్పాయి.
PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి, పాకిస్తాన్పై ప్రతీకార చర్యల్లో భాగంగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. త్రివిధ దళాధిపతులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహిస్తున్నారు.
Pak Hackers: 26 మంది అమాయకపు టూరిస్టులను బలిగొన్న పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత, భారతీయ సైట్లపై పాకిస్తాన్ హ్యాకర్ల దాడులు పెరిగాయి. ఇండియన్ సైట్లను హ్యాక్ చేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. మంగళవారం, శ్రీనగర్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్(APS), APS రాణిఖేత్, ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ (AWHO) డేటాబేస్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ పోర్టల్స్ని హ్యాకర్స్ టార్గెట్ చేశారు. "IOK హ్యాకర్"గా పనిచేస్తున్న హ్యాకర్లు ఈ వెబ్సైట్లను డీఫేస్ చేయడానికి ప్రయత్నించారు.
Pahalgam Terror Attack: పహల్గామ్ దాడిలో కీలక ఉగ్రవాది, ప్రధాన సూత్రధారిగా పాకిస్తాన్కి చెందని హషీం మూసాగా గుర్తించారు. ముసాకు పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు ఉన్నట్లుగా మన నిఘా ఏజెన్సీలు గుర్తించాయి. 26 మందిని క్రూరంగా చంపిన ఘటనలో కీలకంగా వ్యవహరించిన మూసా పారా-కమాండో శిక్షణ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇది జమ్మూ కాశ్మీర్లో అతడి ఉగ్రవాద కార్యకలాపాలకు సమర్థవంతంగా ఉపయోగపడిందని భద్రతా వర్గాలు తెలిపాయి. 20 ఏళ్ల మూసా కథువా, సాంబా సెక్టార్ల ద్వారా భారత భూభాగంలోకి […]
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి అనేక వీడియోలు, ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. టూరిస్టులు రీల్స్ చేస్తున్న సమయంలో కొందరి మొబైల్లో ముష్కరుల దాడికి సంబంధించిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. తాజాగా, జిప్ లైనర్పై వెళ్తున్న ఓ టూరిస్ట్ రికార్డ్ చేసిన వీడియోలో కూడా టెర్రరిస్టుల దాడి రికార్డ్ అయింది. అయితే, దీనికి ముందు జిప్ లైన్ ఆపరేటర్ చేసిన ‘‘ అల్లాహు అక్బర్’’ నినాదాలు సంచలనంగా మారాయి. ఆపరేటర్ ముజమ్మిల్పై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
BJP vs Congress: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం మొదలైంది. కాంగ్రెస్ ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ..‘‘అవసరమైన సమయాల్లో మిస్ అవుతారు’’ అని కామెంట్ చేసింది. ప్రధానిని సూచించే ఒక ఫోటోని పోస్ట్ చేసి, దానికి తల లేకుండా ఉంచింది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Pahalgam terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా పథకం ప్రకారమే, టెర్రరిస్టులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడిలో ప్రాణాలతో బయటపడిన వారు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో ఉగ్రవాదుల కుట్ర వెలుగులోకి వచ్చింది. తప్పించుకోవడానికి మార్గం లేకుండా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఉగ్రవాదులు ఎంట్రీ గేట్ నుంచి రాగా, ఒకరు ఎగ్జిట్ గేట్ నుంచి వచ్చారు. నాలుగో ఉగ్రవాది వీరికి సపోర్ట్ చేయడానికి అడవిలో దాగి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
Canada Elections: కెనడా ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ వరసగా మూడోసారి ఘన విజయం సాధించి, అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు తీసుకోనున్నారు. కెనడా పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో మొత్తం 343 స్థానాలున్నాయి.