PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేరళలో శుక్రవారం ఇండియా బ్లాక్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.వేదికపై ఇద్దరు ప్రతిపక్ష నాయకులు ఉండగానే, ఇండీ కూటమిపై విమర్శలు ఎక్కుపెట్టారు. తిరువనంతపురంలో విజింజం అంతర్జాతీయ ఓడరేవు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Eknath Shinde: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాని నరేంద్రమోడీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ఇండియా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు బలమైన దౌత్య నిర్ణయాలు తీసుకుంది. దేశ ప్రజలు ప్రస్తుతం సైనిక ప్రతిస్పందన ఆశిస్తున్నారు. "ఇది చివరి దాడి అవుతుందని మన ప్రజలు నమ్ముతున్నారు. ప్రధాని మోడీ పాకిస్తాన్ను తుడిచిపెడతారు" అని షిండే చెప్పారు.
Gurpatwant Singh Pannun: పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇలాంటి సమయంలో, ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేస్తే సిక్కులు ఈ యుద్ధంలో పాల్గొనవద్దని పిలుపునిచ్చాడు.
India Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి భారత్, పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత, యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. 26 మందిని బలి తీసుకున్న ఈ ఉగ్రదాడిలో పాకిస్తాన్, లష్కరే తోయిబా ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తేలింది. అయితే, పాకిస్తాన్ ఇప్పటికే తన సైన్యాన్ని భారత సరిహద్దుల్లో మోహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ సాయంతో భారత సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం వస్తోంది.
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ తన యుద్ధ సన్నాహాలు చేసుకుంటోంది. భారత్ నుంచి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఘర్షణ ప్రారంభమవుతుందో అని భయపడి చేస్తోంది. మరోవైపు, భారత్ని కవ్వించేలా పలు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే, ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లు కాల్పులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. కరాచీ పోర్టులో పాక్ నేవీ తన నౌకల్ని, జలంతార్గముల్ని మోహరించినట్లు సమాచారం.
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్కి భయాందోళనలు పెరిగాయి. కాశ్మీర్ అందాలను చూస్తున్న అమాయకపు ప్రజలపై పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై, టెర్రరిజంపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Bangladesh: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 26 మందిని బలిగొన్న ఈ ఉగ్రవాద ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్, దాయాది దేశానికి దౌత్యపరమైన షాక్లు ఇస్తోంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు పాకిస్తాన్ జాతీయులకు వీసాలు రద్దు చేసింది. ఇక పాకిస్తాన్కి బిగ్ షాక్ ఇస్తూ భారత్ తన గగనతలాన్ని పాక్ విమానాలకు బ్లాక్ చేసింది.
Communal tension: 12 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో ఉత్తరాఖండ్ లోని నైనిటాల్లో మతపరమైన ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఏప్రిల్ 12న జరిగిన ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇది స్థానికుల్లో ఆగ్రహానికి కారణమైంది. మహ్మద్ ఉస్మాన్గా గుర్తించబడిని 73 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేవారు. గురువారం బాధిత బాలికను వైద్య పరీక్షలకు తరలించారు.
Loan recovery: లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు ఒక రైతు బలయ్యాడు. వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగింది. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో బలవంతపు రికవరీ పద్ధతులను అరికట్టడానికి బిల్లును ఆమోదించిన రెండు రోజులకే ఈ మరణం సంభవించింది.
Triple Talaq: వరకట్న వేధింపులు ఎదుర్కొంటున్న ఒక మహిళ తనువు చాలించింది. పెళ్లయినప్పటి నుంచి అత్తమామలు కట్నం కోసం వేధించడంతో పాటు భర్త ఇటీవల ఫోన్లో ‘‘ట్రిపుల్ తలాక్’’ చెప్పడంతో సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగింది. భర్త ట్రిపుల్ తలాక్ ఇవ్వడంతో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.