Communal tension: మైనర్పై అత్యాచారం, మసీదుపై రాళ్లదాడి.. నైనిటాల్లో ఉద్రిక్తత..
- ఉత్తరాఖండ్ నైనిటాల్లో మత ఉద్రిక్తత..
- మైనర్ బాలికపై 73 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం..
- తీవ్ర ఉద్రిక్తత నేేపథ్యంలో మసీదుపై రాళ్లదాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Communal tension: 12 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో ఉత్తరాఖండ్ లోని నైనిటాల్లో మతపరమైన ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఏప్రిల్ 12న జరిగిన ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇది స్థానికుల్లో ఆగ్రహానికి కారణమైంది. మహ్మద్ ఉస్మాన్గా గుర్తించబడిని 73 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేవారు. గురువారం బాధిత బాలికను వైద్య పరీక్షలకు తరలించారు.
మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న బాలికకు రూ. 200 ఇస్తానని ఉస్మాన్ ప్రలోభపెట్టాడు. ఆ బాలికను తన కారులో ఇంట్లో దించుతానని చెప్పాడు. ఇది నమ్మిన బాలికను కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. బాలిక ఈ విషయాన్ని కుటుంబానికి తెలియజేయడంతో, వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read
- West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
- Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
- Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
Read Also: Loan recovery: లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక రైతు ఆత్మహత్య..
బుధవారం ఈ ఘటన వెలుగులోకి రావడంతో హిందూ సంస్థలు తీవ్ర ఆందోళనలు చేశాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. స్థానిక మసీదుపై రాళ్ల రువ్వారు. స్థానిక పోలీస్ స్టేషన్కి భారీ సంఖ్యలో నిరసనకారులు చేరుకోవడంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విషయాన్ని సీరియస్గా తీసుకోలేదని ఆరోపించారు. కొన్ని ప్రదేశాల్లో గొడవలు చెలరేగడంతో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.
పరిస్థితి ఉద్రికత్తం కావడంతో నిందతుడు ఉస్మాన్ ఇంటికి భద్రతను మోహరించారు. అతడి ఇంటిపై నిరసనకారులు రాళ్ల దాడి చేయకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉస్మాన్ తన ఇంటిని అటవీ భూమి ఆక్రమించి కట్టాడని తేలడంతో మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో ఆక్రమణల్ని తొలగించాలని లేకుండా తామే చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేసింది.
తాజావార్తలు
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!