Pakistan: కవ్విస్తున్న పాకిస్తాన్.. రాజస్థాన్ సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్, ఆర్టిలరీ యూనిట్స్..
- యుద్ధానికి సిద్ధమైన పాకిస్తాన్..
- సరిహద్దుల్లో దాయాది కవ్వింపు..
- రాజస్థాన్ బోర్డర్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆర్టిలరీ యూనిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ తన యుద్ధ సన్నాహాలు చేసుకుంటోంది. భారత్ నుంచి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఘర్షణ ప్రారంభమవుతుందో అని భయపడి చేస్తోంది. మరోవైపు, భారత్ని కవ్వించేలా పలు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే, ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లు కాల్పులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. కరాచీ పోర్టులో పాక్ నేవీ తన నౌకల్ని, జలంతార్గముల్ని మోహరించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మోహరించింది. రాజస్థాన్ సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ తో పాటు ఆర్టిలరీ యూనిట్ని ఏర్పాటు చేసింది. రాజస్థాన్లోని బార్మెర్లోని లాంగేవాలా సెక్టార్ సమీపంలో అధునాతన రాడార్ వ్యవస్థలు, ఎయిర్ డిఫెన్స్ వెపన్స్ సిస్టమ్ మోహరించినట్లు తెలిసింది. పాక్ ఎయిర్ ఫోర్స్ ఒకేసారి మూడు విన్యాసాలను నిర్వహిస్తోంది. వీటిలో ఫిజా-ఎ-బదర్, లాల్కర్-ఎ-మోమిన్, జర్బ్-ఎ-హైదరీ ఉన్నాయి, F-16, J-10, JF-17 వంటి అన్ని ప్రధాన యుద్ధ విమానాల ఫ్లీట్లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విన్యాసాలను ఏప్రిల్ 29న పాకిస్తాన్ మోహరించింది.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
Read Also: Pakistan: కరాచీ, లాహోర్ ఎయిర్స్పేస్ని పాక్షికంగా మూసేసిన పాకిస్తాన్..
పాకిస్తాన్ ఆర్మీ స్ట్రైక్ కార్ప్స్ కూడా వారి వారి ప్రాంతాల్లో ట్రైనింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఫోర్స్ని కూడా మోహరించింది. దీని ద్వారా తన గ్రౌండ్ అసెట్స్ని కాపాడుకోవాలని అనుకుంటోంది. చైనా నుంచి SH-15 హోవిట్జర్లను పాకిస్తాన్ సైన్యంలోకి చేరుతున్నాయి. ఈ యూనిట్లను ఫార్వర్డ్ లొకేషన్లలో మోహరిస్తోంది. పాక్ ఆర్మీ భారత సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించడం ప్రారంభించింది. నేవీని కూడా సిద్ధంగా ఉంచింది.
భారత వైమానిక దాడులను గుర్తించడానికి పాక్ సైన్యం తన రాడార్ వ్యవస్థల్ని సియాల్కోట్ సెక్టార్కి తరలిస్తోంది. ఫిరోజ్పూర్ సెక్టార్కి ఎదురుగా ఉన్న భారత కదలికల్ని గుర్తించడానికి పాక్ మిలిటరీ ఎలక్ట్రానిక్ యుద్ధ విభాగాలను మోహరించింది. దీనికి ముందు, పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ దేశానికి “విశ్వసనీయ నిఘా” అందిందని, భారతదేశం రాబోయే 24 నుండి 36 గంటల్లో సైనిక దాడి చేయవచ్చని అన్నారు.
తాజావార్తలు
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?