Mother Kills Son: ప్రియుడితో అసభ్యకర రీతిలో చూసిన కొడుకు.. చంపేసిన తల్లి.. కలల్లో కనిపించడంతో
- ప్రియుడితో అసభ్యకర రీతిలో చూసిన కొడుకు
- చంపేసిన తల్లి
- గ్వాలియర్ జిల్లాలోని థాటిపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో
అక్రమ సంబంధాలు కడుపున పుట్టిన పిల్లలను సైతం చంపేలా చేస్తున్నాయి. ఓ తల్లి తన ప్రియుడితో అసభ్యకర రీతిలో ఉండగా తన ఐదేళ్ల కొడుకు చూడడంతో దారుణానికి పాల్పడింది. భర్తకు చెప్తాడని భావించి ఆమె తన కొడుకును రెండంతస్తుల ఇంటి పైకప్పు నుండి తోసేసి చంపేసింది. ఈ సంఘటన ఏప్రిల్ 28, 2023న గ్వాలియర్ జిల్లాలోని థాటిపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. అయితే ఆ తల్లి ఈ నిజాన్ని బయటికి పొక్కకుండా జాగ్రత్త పడింది. కానీ తన కొడుకు పదే పదే కలల్లో కనిపించడంతో ఆమెను నిజం ఒప్పుకునేలా చేశాయి. దీని తరువాత, ఆ పిల్లవాడి కానిస్టేబుల్ తండ్రి, తన భార్య నుంచి వివరాలు తెలుసుకుని ఒక వీడియో తయారు చేసి, ఆధారాలు సేకరించి, పోలీసులకు ఇచ్చాడు. సాక్ష్యం ఆధారంగా, సెషన్స్ కోర్టు శనివారం హత్యకు పాల్పడిన తల్లికి జీవిత ఖైదు విధించింది.
Also Read:Dhurandhar 2 : రికార్డ్ బ్రేకర్ సీక్వెల్ ‘ధురంధర్ 2’.. టీజర్ రిలీజ్ డేట్ లాక్!
Also Read
- DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
అయితే, ఆధారాలు లేకపోవడంతో కోర్టు ఆమె ప్రేమికుడిని నిర్దోషిగా ప్రకటించింది. ప్రాసిక్యూషన్ ప్రకారం, తన కొడుకును హత్య చేసినందుకు దోషిగా తేలిన జ్యోతి రాథోడ్, సంఘటన జరిగిన సమయంలో తన పొరుగువాడు ఉదయ్ ఇందూలియాతో కలిసి టెర్రస్ మీద ఉంది. ఇంతలో, ఆమె ఐదేళ్ల కుమారుడు సన్నీ అలియాస్ జతిన్, టెర్రస్ పైకి చేరుకుని తన తల్లిని తన ప్రేమికుడితో అభ్యంతరకరమైన స్థితిలో చూశాడు. అక్రమసంబంధం బహిర్గతం అవుతుందనే భయంతో, జ్యోతి తన కొడుకును రెండంతస్తుల ఇంటి పైకప్పు నుండి కిందికి విసిరివేసింది. కిందపడటంతో ఆ చిన్నారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు అతను మరణించాడు. మృతుడి తండ్రి, పోలీస్ కానిస్టేబుల్ ధ్యాన్ సింగ్ మొదట దీనిని ప్రమాదవశాత్తు జరిగినట్లు భావించారు.
Also Read:Gaza Crisis: గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లో చేరాలి.. భారత్కు ట్రంప్ ఆహ్వానం..!
కొడుకు మరణం తరువాత, జ్యోతి మానసిక స్థితి క్షీణించడం ప్రారంభమైంది. ఆమె అర్ధరాత్రి భయంతో మేల్కొని భయంతో ఉండిపోయేది. ఆమె భర్త తన కొడుకు మరణంతో ఆమె షాక్లో ఉందని భావించాడు, వైద్య చికిత్స అందించినప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. తరువాత, ఆమె తన భర్తకు తన కలలో చనిపోయిన కొడుకు కనిపించాడని చెప్పింది. అతని ఆత్మ అక్కడే తిరుగుతోందని ఆమె నమ్మింది, భయంతో, ఆమె ఒక రోజు నిజం ఒప్పుకుంది. కొడుకు తనను, తన ప్రేమికుడిని టెర్రస్ పై కలిసి ఉండగా చూశాడని చెప్పింది. అతను ఎవరికైనా చెబుతాడేమోనని భయపడి, అతన్ని పైకప్పు నుండి కిందికి తోసేసినట్లు భర్తతో చెప్పింది. ఆఖరికి కటకటాలపాలైంది.
తాజావార్తలు
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!