Venu Goapl Reddy
Author- NTV Telugu-
Budget 2026: జీడీపీలో ద్రవ్యలోటు 4.3 శాతంగా అంచనా..
Budget 2026: 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ జీడీపీలో 4.3 శాతం ద్రవ్యలోటు (Fiscal Deficit) కేంద్రం అంచనా వేసింది. ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026లో ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలతో పోలిస్తే స్వల్పంగా తగ్గడం గమనార్హం. -
Union Budget 2026: హైదరాబాద్కు గుడ్ న్యూస్.. 7 హై-స్పీడ్ రైల్ కారిడార్లు ప్రకటన..
Union Budget 2026: బడ్జెట్లో మెరుగైన రైలు సౌకర్యాలకు కేంద్రం ప్రాధాన్యత ఇచ్చింది. ఆదివారం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో 7 హై స్పీడ్ రైల్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ను కలిపే మూడు కారిడార్లు ఉండటం గమనార్హం. -
Union Budget 2026: రేర్ ఎర్త్ ఖనిజాలకు పెద్ద పీట.. సెమీ-కండక్టర్ ఇండస్ట్రీకి రూ. 40,000 కోట్లు..
Union Budget 2026: ప్రస్తుతం కాలంలో టెక్నాలజీకి ఎంతో అవసరమైన సెమీ కండక్టర్లు, రేర్ ఎర్త్ ఖనిజాలకు కేంద్ర బడ్జెట్ 2026 పెద్ద పీట వేసింది. సెమీకండక్టర్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు భారత్ సెమీ-కండక్టర్ మిషన్ 2.0ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని కోసం రూ. 40,000 కోట్లు కేటాయించారు. -
Union Budget 2026: కాంచీవరం చీరలో నిర్మలా సీతారామన్.. 9 బడ్జెట్లు 9 రకాల చీరలు..
Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026పై దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరసగా 9వ సారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే, నిర్మలమ్మ ఈసారి తన సొంత రాష్ట్రం తమిళనాడుకు చెందిన కాంచీవరం చీరను ధరించారు. చేనేత మోరూన్ కాంచీవరం చీరను ధరించి ఆమె కర్తవ్య భవన్కు వచ్చారు. మరోవైపు, మరికొన్ని రోజుల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండటం గమనార్హం. తమిళనాడుకు చెందిన కాంచీవరం చీరలకు 2005లో జియో గ్రాఫికల్ ఇంటికేషన్(GI) […] -
Gold and silver prices: కేంద్ర బడ్జెట్ ముందు పడిపోయిన బంగారం,వెండి రేట్లు..
Gold and silver prices: మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(MCX)లో బంగారం, వెండి ధరలు 9 శాతం పడిపోయాయి. వరసగా రెండో రోజు ధరలు దారుణంగా పడిపోయాయి. -
Trump: భారత్ వెనిజులా ఆయిల్ కొనుగోలు చేస్తుంది..
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ వెనిజులా ఆయిల్ కొనేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇరాన్ నుంచి చమురు కొనగోలుకు బదులుగా భారత్ వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదర్చుకుందని ఆయన శనివారం చెప్పారు. ఎయిర్ ఫోర్స్ వన్లో విలేకరులతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంపై న్యూఢిల్లీ నుంచి తక్షణ స్పందన రాలేదు. -
Pakistan: పాక్లో “ధురంధర్”ల హవా.. పహల్గాం ఉగ్రదాడి హ్యాండ్లర్ ఖతం..
Pakistan: పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు హవా కొనసాగుతోంది. భారత వ్యతిరేకులు ఎక్కడ ఉన్న వెతికి వెంటాడి వేటాడి మట్టపెట్టుడుతున్నారు. అజ్ఞాత ‘‘ధురంధర్లు’’ పాకిస్తాన్లోని టెర్రరిస్టులు, భారత్కు వ్యతిరేఖంగా కుట్రలు పన్నుతున్న వ్యక్తులను లేపేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా, 26 మందిని బలితీసుకున్న పహల్గాం ఉగ్రవాద దాడి హ్యాండ్లర్గా భావిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నర్ ఇమ్రాన్ దయాల్ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చడం సంచలనంగా మారింది. పాక్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ లో అతడి కారుపై కాల్పులు […] -
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ బడ్జెట్ రికార్డులు.. ఆమె చదువు, నేపథ్యం ఇదే..
Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్లో ఏం ఉంటుందని దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టబోతున్నారు. వరసగా 9వ సారి కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఘటన సాధించిన తొలి ఆర్థిక మంత్రిగా ఆమె నిలిచారు. అంతకుముందు ఈ రికార్డ్ మొరార్జీ దేశాయ్(వరసగా 6 బడ్జెట్లు ప్రవేశపెట్టారు) పేరిటి ఉండేది. -
Union Budget 2026: నేడే కేంద్ర బడ్జెట్.. ఆసక్తిగా చూస్తున్న దేశం..
Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు( ఆదివారం) పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ -2026ను ప్రవేశపెట్టనున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థను మరింత పరుగులు పెట్టించేలా బడ్జెట్ ఉండబోతోంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ బడ్జెట్పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ రక్షణ, మౌలిక సదుపాయాలు, మూలధన వ్యయం, విద్యుత్, గృహనిర్మాణం, రక్షణపై బడ్జెట్ ఫోకస్ చేయనుంది. వరసగా 9వ సారి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ రికార్డ్ క్రియేట్ చేశారు. -
Indian Judicial System: ప్రతీ 10 లక్షల మందికి కేవలం 22 మంది జడ్జీలు..
Indian Judicial System: భారతీయ న్యాయ వ్యవస్థ తీవ్రమైన ఒత్తిళ్లతో సతమతమవుతోంది. దేశంలో ప్రతీ 10 లక్షల మందికి కేవలం 22 మంది న్యాయమూర్తులు ఉన్నారు. న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఉండాల్సిన సంఖ్య కన్నా ఇది తక్కువ. సకాలంలో న్యాయం జరగాలంటే జనాభాకు తగినంత మంది జడ్జీలు లేరని తెలుస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, 2026 నాటికి ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని లెక్కించినట్లు కేంద్రం తెలిపింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!