UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు..
- రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్, బీజేపీతో సమన్వయం..
- పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలపై నజర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Elections: ఉత్తర్ ప్రదేశ్ 2027 అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్వాదీ(ఎస్పీ)లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఎన్నికల సంగ్రామంలోకి బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ ఎంట్రీ ఇచ్చింది. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి యూపీలోని పలు ప్రాంతాల్లో సమన్వయం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య సంస్థాగత సమన్వయంపై దృష్టి పెరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్, యూపీ ఇన్చార్జ్ వినోద్ తావ్డే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ సంస్థాగత పరిస్థితి, క్షేత్రస్థాయి సమస్యలు, కార్యకర్తల అభిప్రాయాలపై సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ-ఆర్ఎస్ఎస్ సమన్వయం..
ఆర్ఎస్ఎస్ తరుఫున జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, బీజేపీ నేతల మధ్య సమావేశం జరిగింది. పార్టీ, ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ మద్య సమన్వయం, స్థానిక స్థాయిలో ఉన్న అసంతృప్తి, సంస్థాగత సమస్యలనున గుర్తించడం వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వినోద్ తావ్డే యూపీ ఇంచార్జ్గా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో పర్యటిస్తు్న్నారు. గోరఖ్పూర్, అయోధ్య, ప్రయాగ్ రాజ్ వంటి ప్రాంతాల్లో సమావేశాలు నిర్వమించి, స్థానిక పరిస్థితులపై ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు.
Also Read
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
- UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
బలహీన స్థానాలపై దృష్టి..
2022 అసెంబ్లీ, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పనితీరును సమీక్షించడంతో పాటు, ఆయా ఎన్నికల్లో ఓడిపోయిన సీట్లపై ఫీడ్ బ్యాక్ తీసుకోవడం, స్థానిక సమస్యల్ని అర్థం చేసుకోవడంపై దృష్టి సారించారు. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో సామాజిక సమీకరణాలు అర్థం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటారని భావిస్తున్న అభ్యర్థులపై క్షేత్రస్థాయిలో ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో చేసిన తప్పుల్ని పునరావృతం చేయకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కలిసి కసరత్తు మొదలుపెట్టాయి.
తాజావార్తలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!