Venu Goapl Reddy
Author- NTV Telugu-
Kerala Woman: కేరళ బస్ వైరల్ వీడియో.. నిందితురాలు షింజితా ముస్తాఫా అరెస్ట్..
Kerala Woman: కేరళలో ఇటీవల బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఒక మహిళ చేసిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనలో, ఎలాంటి తప్పు చేయకపోయినా తనపై నిందలు రావడంతో 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. -
Operation Sindoor: పాక్పై దాడిలో అసలు విజయం “వైమానిక దళానిదే”: ఐఏఎఫ్ చీఫ్
Operation Sindoor: దేశ భద్రతకు కేవలం ఆర్థిక బలమే సరిపోదని, బలమైన సైనిక శక్తి తప్పనిసరి అని భారత వైమానిక దళ చీఫ్(IAF) చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన 22వ సుబ్రతో ముఖర్జీ సెమినార్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా, పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడులను గురించి ప్రస్తావించారు. ఆధునిక యుద్ధాల్లో ‘‘ఎయిర్ పవర్’’ చాలా కీలకమని అన్నారు. పాకిస్తాన్పై దాడుల్లో భారత వైమానిక […] -
Crime: పెళ్లై 4 నెలలు.. ఇద్దరు వ్యక్తులతో భార్య రాసలీలలు.. భర్త ఏం చేశాడంటే..
Crime: ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో దారుణం జరిగింది. ఒక యువకుడు తన భార్యను ముగ్గురు వ్యక్తులతో అసభ్యకరమైన స్థితిలో చూశానని చెప్పి, పెళ్లైన నాలుగు నెలలకే ఆమె గొంతు నులిమి హత్య చేశాడని అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, మరుసటి రోజు పోలీస్స్టేషన్లో నిందితుడు లొంగిపోయినట్లు తెలుస్తోంది. -
Maharashtra: బీజేపీకి బిగ్ షాక్.. మేయర్ పదవి కోసం ఒక్కటైన షిండే శివసేన, రాజ్ఠాక్రే..
Maharashtra: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి సత్తా చాటింది. దేశంలో అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్ అయిన ముంబై మేయర్ పీఠాన్ని బీజేపీ, శివసేనలు కలిసి దక్కించుకునే అవకాశం ఏర్పడింది. అయితే, ముంబైతో పాటు పలు కార్పొరేషన్లలో బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య మేయర్ పదవి కోసం ప్రతిష్టంభన ఏర్పడింది. -
Ryan Dahl: ప్రశ్నార్థకంగా “సాఫ్ట్వేర్ ఇంజనీర్ల” భవిష్యత్తు..
Ryan Dahl: AI అభివృద్ధి మొత్తం టెక్ రంగాన్ని మార్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. క్లాడ్ కోడ్ వంటి కోడింగ్ పనుల్ని ఏఐ సాధారణాలు సాఫ్ట్వేర్ డెవలపర్లు, కోడర్ల మాదిరిగానే చక్కబెట్టేస్తున్నాయి. దీంతో భవిష్యత్తులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పనిని కూడా ఏఐ నిర్వహించేలా పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా NodeJS క్రియేటర్, ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ర్యాన్ డాల్ చేసిన వ్యాఖ్యలు, టెక్కీల్లో గుబులు పుట్టిస్తున్నాయి. […] -
Pregnancy: GLP-1ఇంజెక్షన్లతో అద్భుతాలు.. భారత్లో పెరుగుతున్న ఆకస్మిక ‘‘ప్రెగ్నెన్సీలు’’.. కారణాలు ఇవే..
GLP-1: టైప్-2 డయాబెటిస్ కోసం తీసుకువచ్చిన GLP-1 వెయిట్ లాస్ ఇంజెక్షన్లు అద్భుతాలను సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ మందుల వాడకం పెరిగింది. ముఖ్యంగా, షుగర్ వల్ల బాధపడుతున్న వారు మాత్రమే కాకుండా.. స్థూలకాయం, అధిక బరువుతో బాధపడుతున్న వారు వీటిని తీసుకుంటున్నారు. భారత్లో వీటి వాడకం వల్ల అనూహ్యంగా చాలా ఏళ్లుగా ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్న చాలా మంది మహిళల్లో ఆకస్మిక ‘‘గర్భధారణ’’ కేసులు పెరుగుతున్నాయి. ‘‘ఆకస్మిక’’ లేదా ‘‘ఒజెంపిక్ శిశువుల’’గా పిలిచే కేసుల సంఖ్య […] -
Toll Fee: టోల్ బకాయిలు చెల్లించలేదా.? ఇకపై చిక్కుల్లో పడ్డట్లే.. కేంద్రం కఠిన నిర్ణయం..
Toll Fee: జాతీయ రహదారులపై టోల్ చెల్లింపులపై కేంద్రం సీరియస్గా వ్యవహరించనుంది. టోల్ బకాయిలు ఉన్న వాహనాలపై ఇకపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. టోల్ బకాయిలు ఉంటే వాహనాలకు కీలక సేవలను నిలిపివేయనుంది. బకాయిలు పెండింగ్లో ఉన్న వాహనాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC), ఫిట్నెస్ సర్టిఫికేట్ రిన్యువల్, నేషనల్ పర్మిట్ వంటి సేవల్ని అడ్డుకోనుంది. -
EU-India FTA: ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’.. భారత్-ఈయూ ట్రేడ్ డీల్పై కీలక వ్యాఖ్యలు..
EU-India FTA: యూరోపియన్ యూనియన్(EU)-భారత్ మధ్య ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) త్వరలో కుదురబోతోందని ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ అన్నారు. మంగళవారం దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆమె సంకేతాలు ఇచ్చారు. -
Asim Munir: పాకిస్తాన్ ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో, అది ఇప్పుడు నెరవేరుతోంది..
Asim Munir: ఇస్లాం పేరుపై ఏర్పడిన పాకిస్తాన్, ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో, ఇప్పుడు అది సాధించే దిశగా ఉన్నామని పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అన్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మనవడు జునైద్ సఫ్దర్ వలీమాకు హాజరైన bilwkh ఆయన పాక్ వార్తా పత్రిక ది న్యూస్ ఇంటర్నేషనల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, సీనియర్ సైనిక అధికారులు, క్యాబినెట్ మంత్రులు హాజరయ్యారు. -
Ajmer Dargah: “అజ్మీర్ దర్గా కింద శివాలయం”.. కోర్టులో మహారాణా ప్రతాప్ సేన పిటిషన్..
Ajmer Dargah: ప్రతిష్టాత్మక అజ్మీర్ షరీఫ్ దర్గా మరోసారి రాజకీయ వివాదంగా మారింది. దర్గాకు వ్యతిరేకంగా హిందూ సంస్థ మహారాణా ప్రతాప్ సేన (MPS) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే 2024లో హిందూ సేన పిటిషన్ దాఖలు చేసింది. దర్గా ఉన్న స్థలంలో ఒకప్పుడు శివాలయం ఉండేదని పిటిషన్లు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!