Venu Goapl Reddy
Author- NTV Telugu-
Osmania University: యూనివర్సిటీ పరిధిలో అన్ని ఎగ్జామ్స్ వాయిదా..
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ కళాశాలలు ఇలా అన్ని విద్యాసంస్థలు జూలై 11 నుంచి […] -
Tata Nexon: ఎస్యూవీ కార్ల అమ్మకాల్లో మరోసారి టాప్ ప్లేస్
దేశీయ కార్ల దిగ్గజం టాటా మరోసారి తన సత్తాను చూపింది. దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎస్యూవీ కార్లలో టాటా నెక్సాన్ మరోసారి టాప్ ప్లేస్ లో నిలిచింది. కాంపాక్ట్ ఎస్యూవీ కార్ల సెగ్మెంట్ అమ్మకాల్లో జూన్ నెలలో ఎక్కువగా అమ్ముడైన కార్లలో టాటా నెక్సాన్ మొదటిస్థానంలో ఉంది. 5 స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్, ఫీచర్స్, సేప్టీ, శక్తివంతమైన ఇంజిన్, ధర కూడా అందుబాటులో ఉండటంతో చాలా మంది ఈ కార్ ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. […] -
Udaipur Incident: కన్హయ్య లాల్ హత్య కేసులో మరో నిందితుడి అరెస్ట్
దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం రేపిన ఉదయ్ పూర్ ఘటనలో ఎన్ఐఏ మరో నిందితుడిని అరెస్ట్ చేసింది. టైలర్ కన్హయ్యలాల్ హత్య చేసిన కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుడు ఫర్హాద్ మహ్మద్ షేక్ అలియాస్ బాబ్లాను శనివారరం సాయంత్రం అరెస్ట్ చేశారు. కన్హయ్యలాల్ ను హత్య చేసి నిందితుల్లో ఒకడైన రియాజ్ అక్తరీకి సన్నిహితంగా ఉన్నాడని.. ఆయనను చంపే కుట్రలో పాల్గొన్నాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. జూన్ 28న […] -
IndiGo: మూకుమ్మడి సిక్ లీవుల్లో ఇండిగో టెక్నీషియన్లు
రెండు రోజులుగా ఇండిగో ఎయిర్ క్రాప్ట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్లు మూమకుమ్మడి సిక్ లీవులు పెట్టినట్లు తెలుస్తోంది. తమకు ఇస్తున్న తక్కువ జీతాలకు వ్యతిరేకంగా హైదరాబాద్, ఢిల్లీల్లో సిక్ లీవుల్లో వెళ్లారని తెలుస్తోంది. గతంలో జూలై 2న ఇండిగో క్యాబిన్ సిబ్బంది ఒకే సారి సిక్ లీవులు తీసుకున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది. క్యాబిన్ సిబ్బంది సిక్ లీవుల్లో వెల్లడంతో దేశీయంగా 55 శాతం ఆలస్యం అయ్యాయి. అయితే వీరంతా ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ కు వెళ్లినట్లు […] -
Maharashtra: శివసేన 53 ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివసేనకు సంబంధించి మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 53 మంది ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి రాజేంద్ర భగవత్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో నోటీసులపై స్పందించాలన్నారు. నోటీసులు అందుకున్న వారిలో సీఎం ఏకనాథ్ షిండే క్యాంపులోని 39 మంది ఎమ్మెల్యేలకు, ఉద్ధవ్ ఠాక్రేలోని 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు మాత్రం నోటీసులు ఇవ్వలేదు. ఇటీవల రెండు వర్గాలు పరస్పరం అనర్హత […] -
CM KCR: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. సమ్మక్క బ్యారేజీ వద్ద 9 లక్షల క్యూసెక్కుల నీరు పోతుందని ఆయన అన్నారు. తెల్లారే సరికి ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నిండిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని.. 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయని, విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. […] -
CM KCR: భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వానల నేపథ్యంలో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, డ్యాంలు, రిజర్వాయర్లలోని నీటి పరిస్థితి గురించి సీఎం ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టవలసిన రక్షణ సంబంధిత చర్యల గురించి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, పోలీస్, వైద్య, విద్యా […] -
Congress: గోవాలో కాంగ్రెస్ కు షాక్.. బీజేపీలో చేరనున్న ఎమ్మెల్యేలు.
వరసగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కేవలం సొంతంగా ఇప్పుడు రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. వరసగా ఎదురువుతున్న పరాభవాలు పార్టీ కార్యకర్తలను, నేతలను నిరాశ పరుస్తున్నాయి. ఐదేళ్లు అధికారంలో ఉన్నా పంజాబ్ రాష్ట్రంలో దారుణంగా ఓడిపోయింది. దీంతో పాటు ఈ ఏడాది మొదట్లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైంది. వరసగా కీలక నేతలు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి గోవాలో కూడా భారీ […] -
BJP: ఈ నెల 21 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు
బీజేపీ తెలంగాణలో జోరు పెంచుతోంది. క్రమంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీ బైక్ ర్యాలీలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 21 నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ బైక్ ర్యాలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ‘ప్రజలు, పల్లె ఘోష బీజేపీ భరోసా’ పేరుతో బైక్ ర్యాలీలు చెపట్టనుంది. ఒక్కో నేతకు నాలుగు నియోజక వర్గాల్లో ర్యాలీలు అప్పచెప్పారు. మొత్తం 30 మంది నాయకులు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. ఒక్కో […] -
Vonteru Pratap Reddy: ముందు నువ్వు హుజూరాబాద్ లో గెలిచి ఉనికి చాటుకో..
బీజేపీ నేత ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కామెంట్స్ పై ఫైర్ అవుతున్నారు టీఆర్ఎస్ నేతలు. శనివారం టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు ఈటెల రాజేందర్. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని..నేను టీఆర్ఎస్ పార్టీలో చేరింది గజ్వేల్ నియోజకవర్గంలోనే అని.. గజ్వేల్ పై ప్రత్యేక దృష్టి పెట్టానని.. బెంగాల్ లో సువేందు అధికారి, మమతా బెనర్జీని ఓడించినట్లే కేసీఆర్ ని ఇక్కడ నుంచి ఓడిస్తానని అని కామెంట్స్ చేశారు. Read […]
తాజావార్తలు
-
Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
-
KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..