Venu Goapl Reddy
Author- NTV Telugu-
Monkeypox: ఇంగ్లాండ్ లో మంకీపాక్స్ కలకలం… అత్యంత అరుదైన వైరస్ గా గుర్తింపు
ప్రపంచం కరోనా వల్ల గత రెండేళ్ల నుంచి ప్రపంచం కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతోంది. వరసగా కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. కరోనా ధాటికి ప్రపంచ దేశాల ఆరోగ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే కొత్తకొత్త వైరస్ జాడలు, వ్యాధులు ప్రపంచంలో ఎక్కడో చోట బయటపడుతూనే ఉన్నాయి. కరోనాకు ముందు జీకా, స్వైన్ ఫ్లూ, నిఫా ఇలా ఏదో రకమైన వైరస్ లు ప్రజలపై దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ వ్యాధులు ఎక్కడో […] -
NIA Raids: ముంబైలో సోదాలు… దావూద్ ఇబ్రహీంతో లింకులపై విచారణ
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉండీ అనుచరులుగా చలామణీ అవుతున్న వ్యక్తుల ఇళ్లలో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఎజెన్సీ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. నిన్న ముంబై వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మొత్తంగా 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ముంబైలోని నాగ్ పాడ, గోరేగావ్, బోరివళి, శాంటాక్రూజ్, ముంబ్రాలోని పలువురు దావూద్ ఇబ్రహీం అనుచరుల ఇళ్లలో సోదాలు చేశారు. హవాలా ఆపరేటర్స్, రియల్ ఎస్టేట్, డ్రగ్ ట్రాఫికర్స్ నేరాలకు పాల్పడుతూ… దావూద్ […] -
Bulldozer Drive: ఢిల్లీలో టెన్షన్…. మొదలైన ఆక్రమణల కూల్చివేత
ఢిల్లీలో మరోసారి టెన్షన్ నెలకొంది. మరోసారి నార్త్, సౌత్ ఢిల్లీ మున్సిపాలిటీల అధికారులు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. బుల్డోజర్లతో ఆక్రమణలను తొలగిస్తున్నారు. నిన్న ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారి తీసింది. పెద్ద ఎత్తున స్థానికులు, ప్రజాప్రతినిధులు యాంటీ ఎన్ క్రోచ్మెంట్ డ్రైవ్ కు వ్యతిరేఖంగా ఆందోళనలు చేశారు. షాహీన్ బాగ్ లో ఆక్రమణల కూల్చివేతపై సీపీఐ సుప్రీం కోర్ట్ లో పిల్ దాఖలు చేసింది. అయితే ఈ పిల్ పై సుప్రీం ఆగ్రహం […] -
Asani Cyclone: తుఫాన్ ఎఫెక్ట్.. విశాఖ, చెన్నైలకు విమానాలు రద్దు
బంగాళాఖాతంలో అసని తుఫాన్ అలజడి రేపుతోంది. తీరం వైపు పయణిస్తోంది. తీరం వైపు గంటలకు 6 కిలోమీటర్ల వేగంతో పయణిస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తుఫాన్ కాకినాడకు 330 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. అసని తుఫాన్ కారణంగా విశాఖలో వాతావరణం మారిపోయింది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉంది. తీరం వెంబడి గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే విశాఖ వ్యాప్తంగా […] -
Covid-19: దేశంలో కొత్తగా 2288 కరోనా కేసులు.. భారీగా తగ్గిన మరణాలు
చైనా వూహాన్ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలపై ప్రభావం చూపించింది. దేశాల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసింది. ఇప్పటికీ ఏదో రూపంలో కరోనా మహమ్మారి ప్రజలను భయపెడుతూనే ఉంది. తన రూపాలను మార్చుకుంటూ… ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్, ఓమిక్రాన్ ఎక్స్ఈ ఇలా కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం చైనా వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇండియాలో మాత్రం కరోనా కేసుల […] -
Priyanka Gandhi: రైతులకు బీజేపీ మంత్రి ధమ్కీ … లఖీంపూర్ ఖేరీ ఘటనపై ప్రియాంకా ట్వీట్…
దేశవ్యాప్తంగా మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా ఢిల్లీలో ఏడాది పాటు రైతులు ఉద్యమం చేశారు. చివరకు రైతులు ఉద్యమానికి దిగివచ్చి ప్రధాని నరేంద్రమోదీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇదిలా ఉంటే రైతుల ఉద్యమంలో భాగంగా యూపీలో లఖీంపూర్ ఖేరీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా రైతులపైకి వేగంగా కార్లు నడిపించడంతో 8 […] -
Russia-Ukraine War: రష్యాకు జీ 7 షాక్… ప్రధాన ఆదాయంపై దెబ్బ
ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ ప్రారంభమై రెండు నెలలు దాటింది. అయినా ఇరు దేశాల మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. బలమైన సైన్యం కలిగిన రష్యా ముందు ఉక్రెయిన్ కేవలం కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందని అంతా భావించినప్పటికీ… అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు ఇస్తున్న ఆయుధ, సైనిక సహకారంతో రష్యాకు ఎదురొడ్డి నిలుస్తోంది. రష్యన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. బెలారస్, టర్కీ వేదికగా ఇరుదేశాలు పలుమార్లు చర్చలు జరిపినా ఉద్రిక్తతలు తగ్గడం […] -
Sri Lanka: విపక్ష నేత సజిత్ ప్రేమదాసపై దాడి….విషమించిన పరిస్థితులు
శ్రీలంకలో పరిస్థితులు విషమిస్తున్నాయి. ప్రధాని మహింద రాజపక్సే రాజీనామా చేసినా కూడా ఆందోళనలు సద్దుమణగడం లేదు. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే కూడా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడిన తర్వాత ప్రజలు ఆందోళన బాట పట్టారు. నిరసనకారులు రాజధాని కొలంబోలో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, మాజీ ప్రధాని మహిందా రాజపక్సే అధికారిక నివాసాల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే నిన్న ప్రధానిగా మహిందా రాజపక్సే రాజీనామా చేసిన […] -
Sri Lanka Crisis: శ్రీలంకలో ఆందోళనలు హింసాత్మకం… పరిస్థితిని గమనిస్తున్న అమెరికా
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకలో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు శాంతియుతంగా జరిగిన నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంది. ఓ వైపు గోటబయ సర్కార్ ఎమర్జెన్సీ విధించినా… ఆందోళనలు తగ్గడం లేదు. దాదాపుగా గత రెండు నెలల నుంచి శ్రీలంకలో ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో పాటు గ్యాస్, పెట్రోల్ కొరతతో శ్రీలంక అల్లాడుతోంది. ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామా తరువాత శ్రీలంకలో హింసాత్మక […] -
కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్….మోదీ సర్కార్ పై విమర్శలు
టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పనితీరుపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ వరసగా ట్వీట్లు చేస్తున్నారు. గ్యాస్ ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్భనం ఇలా ప్రతీ అంశంపై ట్విట్టర్ వేదికపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర అవలంభిస్తున్న తీరుతో పాటు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర ప్రాజెక్టుల్లో తెలంగాణకు మొండిచేయి చూపడంపై కేటీఆర్ మోదీ సర్కార్ ను విమర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా కేంద్రంపై ట్విట్టర్ […]
తాజావార్తలు
-
Women reservation bill: ఓడి గెలిచిన బీజేపీ.. గెలిచి ఓడిన కాంగ్రెస్..!
-
GT vs KKR: బ్యాటు ఝుళిపించిన కామెరూన్ గ్రీన్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
-
Fish Pickle: చేపల పచ్చడి నీచు వాసన రాకుండా పర్ఫెక్ట్గా కుదరాలా.. అయితే సింపుల్గా ఇలా చేయండి!
-
Video Call: 45, 55 ఏళ్ల మహిళల న్యూడ్ వీడియో కాల్ దందా.. పక్కా ప్లాన్ ప్రకారం ఇలా..
-
Rahul Gandhi: మహిళా బిల్లు కాదు, అందుకే అడ్డుకున్నాం..
ట్రెండింగ్
-
రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?
-
Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!